ఆల్రెడీ రామ్చరణ్ తదుపరి సినిమాపై ఇప్పటివరకు క్లారిటీయే లేదు. RRR వంటి స్టన్నింగ్ బ్లాక్బస్టర్ తో ఇండియావైడ్ భారీగా పేరు తెచ్చుకున్న మెగా హీరో.. ఆ తరువాత కేవలం శంకర్ సార్తో మాత్రమే సినిమా చేస్తున్నాడు. #RC15 పూర్తయ్యాక అసలు చరణ్ ఎవరితో సినిమా చేస్తాడు? ఒక ప్రక్కన గౌతమ్ తిన్ననూరి సినిమా క్యాన్సిల్ చేశాడు.. మరో ప్రక్కన కన్నడ డైరక్టర్ కు నో అని చెప్పేశాడు.. మరి తదుపరి ఏంటి? అని ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్న సమయంలో.. ఇప్పుడు ఒక కామెంట్ తో అందరికీ షాకిచ్చాడు.
ఓ రెండ్రోజుల క్రితం హిందుస్తాన్ టైమ్స్ కాంక్లేవ్లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్తో కలసి పాల్గొన్న సమయంలో.. తమని సౌత్ హీరోస్ అనొద్దని, ఇండియన్ సినిమా ఇండియన్ హీరోస్ అని పిలవండంటూ చరణ్ క్లాసిచ్చాడు. అంతేకాదు.. తనకు కేవలం తెలుగు డైరక్టర్స్తోనే పనిచేయాలని లేదని, గుజరాతీ మరియు బెంగాళీ డైరక్టర్లు కూడా మంచి సినిమాలు తీస్తున్నారని, వారితో పనిచేయాలనుందని సెలవిచ్చాడు. ఇదంతా చూస్తుంటే.. ఇప్పుడు ఎవరన్నా బెంగాలీ డైరక్టర్ తోఏదన్నా హిందీ సినిమా ఎనౌన్స్ చేస్తాడా అనే సందేహం వచ్చేస్తోంది. కాని తెలుగు సినిమాతో ఇండియావైడ్ హిట్ కొడితే బాగుంటుంది కదా.. మళ్ళీ ఈ బెంగాళీ గుజరాతీ డైరక్టర్స్ ఎందుకు?
ప్రస్తతుం శంకర్ సినిమాలోని పాట చిత్రీకరణకు న్యూజిలాండ్ వెళ్తున్న చరణ్.. వచ్చీరాగానే ఉప్పెన్ డైరక్టర్ బుచ్చిబాబు చెప్పిన ఫైనల్ నెరేషన్ వినేసి.. ఆ సినిమా చేయాల వద్దా అనేది డిసైడ్ అవుతాడట. కాని ఎప్పుడైతే బెంగాళీ డైరక్టర్స్ అంటూ కామెంట్ చేశాడో.. ఇప్పుడు అక్కడి నుండి కూడా చాలామంది దర్శకులు చరణ్ను కలవడానికి క్యూ కట్టేసే ఛాన్సుంది. ఏ సినిమా చేసినా త్వరగా చేస్తే బెటర్ అనేది మూవి లవ్వర్స్ సలహా. చూద్దాం చరణ్ ఏం చేస్తాడో!
This post was last modified on November 15, 2022 10:18 am
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…