ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ తో శివకార్తికేయన్ ప్రిన్స్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ తమిళ్ లో డిజాస్టర్ అనిపించుకుంది. అప్పటి వరకు వరుస సక్సెస్ లతో కొనసాగుతున్న శివకార్తికేయన్ కెరీర్ కి ప్రిన్స్ బ్రేక్ వేసింది. ఓవరాల్ గా ఫ్లాప్ ప్రాజెక్ట్ అయింది. శివ కార్తికేయన్ నమ్మకాన్ని అనుదీప్ నిలబెట్టుకోలేక పోయాడని రిమార్క్ పడింది.
అయితే ఇప్పుడు వెంకీ అట్లూరి వంతు. ధనుష్ హీరోగా వెంకీ ‘సార్’ అనే సినిమా చేస్తున్నాడు. తమిళ్ లో వాతి పేరుతో తెరకెక్కుతున్న ఈ బైలింగ్వల్ సినిమాపై మంచి అంచనాలున్నాయి. కానీ వెంకీ మీదే అందరికీ డౌట్ కలుగుతుంది. తొలిప్రేమతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలతో ప్రేక్షకులను నిరాశ పరిచాడు. సో వెంకీకి ఈ సినిమా సక్సెస్ చాలా కీలకం అలాగే ధనుష్ పెట్టుకున్న నమ్మకం కూడా నిలబెట్టుకోవాల్సి ఉంది. విద్యా రంగంలో జరిగే అవినీతిపై జరిగే పోరాటంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వెంకీ అట్లూరి.
మరి టాలీవుడ్ డైరెక్టర్ కోలీవుడ్ స్టార్ కి తెలుగు, తమిళ్ లో సాలిడ్ హిట్ ఇస్తాడా ? చూడాలి. వెంకీ తర్వాత ధనుష్ శేఖర్ కమ్ముల తో మరో బైలింగ్వల్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమాకు సంబందించి కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి రానుంది.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…