ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ తో శివకార్తికేయన్ ప్రిన్స్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ తమిళ్ లో డిజాస్టర్ అనిపించుకుంది. అప్పటి వరకు వరుస సక్సెస్ లతో కొనసాగుతున్న శివకార్తికేయన్ కెరీర్ కి ప్రిన్స్ బ్రేక్ వేసింది. ఓవరాల్ గా ఫ్లాప్ ప్రాజెక్ట్ అయింది. శివ కార్తికేయన్ నమ్మకాన్ని అనుదీప్ నిలబెట్టుకోలేక పోయాడని రిమార్క్ పడింది.
అయితే ఇప్పుడు వెంకీ అట్లూరి వంతు. ధనుష్ హీరోగా వెంకీ ‘సార్’ అనే సినిమా చేస్తున్నాడు. తమిళ్ లో వాతి పేరుతో తెరకెక్కుతున్న ఈ బైలింగ్వల్ సినిమాపై మంచి అంచనాలున్నాయి. కానీ వెంకీ మీదే అందరికీ డౌట్ కలుగుతుంది. తొలిప్రేమతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలతో ప్రేక్షకులను నిరాశ పరిచాడు. సో వెంకీకి ఈ సినిమా సక్సెస్ చాలా కీలకం అలాగే ధనుష్ పెట్టుకున్న నమ్మకం కూడా నిలబెట్టుకోవాల్సి ఉంది. విద్యా రంగంలో జరిగే అవినీతిపై జరిగే పోరాటంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వెంకీ అట్లూరి.
మరి టాలీవుడ్ డైరెక్టర్ కోలీవుడ్ స్టార్ కి తెలుగు, తమిళ్ లో సాలిడ్ హిట్ ఇస్తాడా ? చూడాలి. వెంకీ తర్వాత ధనుష్ శేఖర్ కమ్ముల తో మరో బైలింగ్వల్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమాకు సంబందించి కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి రానుంది.
This post was last modified on November 14, 2022 9:22 pm
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…