ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ తో శివకార్తికేయన్ ప్రిన్స్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ తమిళ్ లో డిజాస్టర్ అనిపించుకుంది. అప్పటి వరకు వరుస సక్సెస్ లతో కొనసాగుతున్న శివకార్తికేయన్ కెరీర్ కి ప్రిన్స్ బ్రేక్ వేసింది. ఓవరాల్ గా ఫ్లాప్ ప్రాజెక్ట్ అయింది. శివ కార్తికేయన్ నమ్మకాన్ని అనుదీప్ నిలబెట్టుకోలేక పోయాడని రిమార్క్ పడింది.
అయితే ఇప్పుడు వెంకీ అట్లూరి వంతు. ధనుష్ హీరోగా వెంకీ ‘సార్’ అనే సినిమా చేస్తున్నాడు. తమిళ్ లో వాతి పేరుతో తెరకెక్కుతున్న ఈ బైలింగ్వల్ సినిమాపై మంచి అంచనాలున్నాయి. కానీ వెంకీ మీదే అందరికీ డౌట్ కలుగుతుంది. తొలిప్రేమతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలతో ప్రేక్షకులను నిరాశ పరిచాడు. సో వెంకీకి ఈ సినిమా సక్సెస్ చాలా కీలకం అలాగే ధనుష్ పెట్టుకున్న నమ్మకం కూడా నిలబెట్టుకోవాల్సి ఉంది. విద్యా రంగంలో జరిగే అవినీతిపై జరిగే పోరాటంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వెంకీ అట్లూరి.
మరి టాలీవుడ్ డైరెక్టర్ కోలీవుడ్ స్టార్ కి తెలుగు, తమిళ్ లో సాలిడ్ హిట్ ఇస్తాడా ? చూడాలి. వెంకీ తర్వాత ధనుష్ శేఖర్ కమ్ముల తో మరో బైలింగ్వల్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమాకు సంబందించి కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి రానుంది.
This post was last modified on November 14, 2022 9:22 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…