కొన్ని నెలల కిందట టాలీవుడ్లో జరిగిన స్ట్రైక్ గురించి తెలిసిందే. మామూలుగా సినీ కార్మికులు తమ డిమాండ్లతో షూటింగ్స్ ఆపేంచేయడం చూస్తుంటాం. కానీ ఈ ఆగస్టు నెలలో పెద్ద నిర్మాతలే ఉమ్మడి నిర్ణయంతో షూటింగ్స్కు బ్రేకులు వేశారు. తిరోగమనంలో పయనిస్తున్న ఇండస్ట్రీని గాడిన పెట్టాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవంటూ ఆ సమయంలో తమకు తాముగా షూటింగ్స్ ఆపుకుని సమావేశాలు నిర్వహించారు.
ఓటీటీల్లో త్వరత్వరగా కొత్త సినిమాలు రిలీజవుతుండడం వల్ల థియేట్రికల్ కలెక్షన్లు తగ్గిపోతున్నాయని.. తాత్కాలిక ప్రయోజనం గురించి ఆలోచిస్తే.. భవిష్యత్తులో భారీ నష్టాలు తప్పవని భావించి థియేటర్లలో రిలీజైన 50 రోజులకు కానీ కొత్త చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేయకూడదని తీర్మానించారు. గతంలోనూ ఇలాంటి తీర్మానాలు జరిగినప్పటికీ.. ఈసారి కఠినంగా షరతును పాటించేలా నిర్మాతల్లో ఏకాభిప్రాయం కుదిరినట్లే కనిపించింది. ఈ తీర్మానం జరిగిన టైంలో రిలీజైన బింబిసార, సీతారామం, కార్తికేయ-2 చిత్రాల విషయంలో కొంచెం కఠినంగానే ఈ నిబంధన అమలు చేశారు.
సరిగ్గా 50 రోజుల తర్వాత కాకపోయినా ఐదు వారాల తర్వాతే ఈ చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. ఆలస్యంగా వచ్చినా ఈ సినిమాలకు ఓటీటీల్లో మంచి స్పందనే వచ్చింది. వీటి థియేట్రికల్ రన్ కూడా ఎక్కువ రోజులు సాగింది. కానీ ఈ రూల్ మిగతా అన్ని సినిమాలకు కూడా మాత్రం వర్తింపజేయలేకపోతున్నారు. దసరా సినిమాల్లో ‘స్వాతిముత్యం’ మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసింది.
‘ది ఘోస్ట్’ కూడా నెల రోజులకే ఓటీటీలో అడుగు పెట్టింది. ఇక దీపావళి సినిమా ‘ఓరి దేవుడా’ అయితే 20 రోజుల్లోపే ఆహాలోకి వచ్చేస్తోంది. ఈ చిత్రంలో దిల్ రాజు, పీవీపీ లాంటి పెద్ద నిర్మాతలు భాగస్వాములు. ఇలాంటి పెద్ద నిర్మాతలే తాము పెట్టుకున్న రూల్ను బ్రేక్ చేసి ఒక పేరున్న సినిమాను ఇంత త్వరగా ఓటీటీలోకి వదిలేస్తే మిగతా ప్రొడ్యూసర్లు ఈ రూల్ను ఏం పాటిస్తారనే చర్చ నడుస్తోంది టాలీవుడ్లో.
This post was last modified on November 11, 2022 9:14 am
జపాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ లోని ఉత్తర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో కూడిన…
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…