Movie News

అమితాబ్ ఓకే.. అభిషేక్‌కు ఏమైంది?

కరోనా ముందు ఎంత పెద్ద వాళ్లయినా తల వంచాల్సిందే అని మరోసారి రుజువైంది. బయటికి వెళ్లాల్సిన, ఎవరినీ కలవాల్సిన అవసరమే పడని.. అన్ని జాగ్రత్తలూ తీసుకునే ప్రముఖులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ సైతం కరోనా బాధితుడిగా మారారు.

ఆయనే కాదు.. కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆద్య సైతం కరోనా బారిన పడ్డారు. వీరి పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా 77 ఏళ్ల వయస్కుడైన అమితాబ్ గురించి టెన్షన్ పడుతున్నారు. ఆయనతో పాటు అభిషేక్ కూడా ముంబయిలో అంబానీ వారి ప్రఖ్యాత కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

వీళ్లిద్దరికీ పాజిటివ్ వచ్చి ఆసుపత్రిలో చేరిన మరుసటి రోజే ఐశ్వర్య, ఆద్య కూడా కరోనా బారిన పడ్డట్లు వెల్లడైంది. వీళ్లిద్దరూ కూడా ఆసుపత్రికి వెళ్లగా.. వీరికి ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోవడంతో ఇంటికే పరిమితం కావాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లీకూతుళ్లిద్దరూ ఇంటికి వెళ్లిపోయారు. అక్కడే రెండు వారాల పాటు హోం క్వారంటైన్లో ఉండబోతున్నారు.

అభిషేక్ కూడా ఇంటికి వచ్చేస్తున్నట్లు ప్రచారం జరిగింది కానీ.. అది నిజం కాదని తేలింది. తండ్రితో పాటు తాను కూడా ఆసుపత్రిలో ఉండాల్సిందే అని వైద్యులు చెప్పారని అభిషేక్ స్వయంగా ట్వీట్ చేశాడు. అమితాబ్ పెద్ద వయస్కుడు కాబట్టి జాగ్రత్త కోసం ఆసుపత్రిలోనే పెట్టి ఉండొచ్చు. కానీ అభిషేక్ ఎందుకు ఆసుపత్రిలోనే ఉంటున్నాడని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఐతే అతడికి దగ్గు, జ్వరం ఉన్నాయని.. అవి నియంత్రణలోకి వచ్చాక ఇంటికి పంపాలని వైద్యులు నిర్ణయించారని, ఆందోళన ఏమీ అక్కర్లేదని బచ్చన్ కుటుంబ వర్గాలు తెలిపాయి. అమితాబ్‌ నెగెటివ్ వచ్చే వరకు ఆసుపత్రిలోనే ఉండి, ఆ తర్వాత డిశ్చార్జ్ అవుతారని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అంటున్నారు.

This post was last modified on July 13, 2020 5:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

23 seconds ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago