దసరా హాలిడేస్కు ఇంటికెళ్ళిన సూపర్స్టార్ మహేష్ ఆ తరువాత తన తల్లి చనిపోవడంతో షూటింగ్కు దూరమయ్యామడు. కాని నెల తరువాత కూడా ఇప్పుడు #SSMB28 షూటింగ్ మొదలుపెట్టడానికి కుదరట్లేదు. స్ర్కిప్ట్ సెట్టవ్వలేదని, యాక్టర్లు దొరకలేదని.. ఎన్ని న్యూస్లు వినబడుతున్నా కూడా, రీజన్ ఏంటో స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ టీమ్ కూడా బయటకు చెప్పట్లేదు. అయితే ఇప్పుడు మాత్రం సాలిడ్గా ప్రొడక్షన్ సభ్యుల నుండి ఒక మాట వినిపిస్తోంది.
నవంబర్ నెలలో కూడా #SSMB28 మొదలయ్యే ఛాన్సులేదని తెలుస్తోంది. ఒక ప్రక్కన ఇతర తారాగణం తాలూకు డేట్స్ లేకపోవడంతో ఒక ప్రాబ్లమ్ అయితే, మరో ప్రక్కన డస్కీ బ్యూటి పూజా హెగ్డే కూడా లిగమెంట్ బ్రేక్ అవ్వడంతో బెడ్ రెస్ట్ తీసుకుంటోంది. దానితో ఏ విధంగానూ మహేష్ బాబు సినిమాను త్రివిక్రమ్ సెట్స్ మీదకు తీసుకెళ్ళలేకపోతున్నాడట. ఏదేమైనా కూడా డిసెంబర్ మొదటి వారం తరువాతనే సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది. పైగా మ్యూజిక్ కు సంబంధించిన పనులు కూడా పూర్తవ్వలేదట. థమన్ ఆల్రెడీ కొన్ని బాణీలు ఇచ్చేశాడు కాని, అవి మహేష్కు నచ్చకపోవడంతో ప్రస్తుతం త్రివిక్రమ్ ఆ పనిలో నిమగ్నమయ్యాడట.
మొన్నటివరకైతే రాజమౌళి సినిమాను వెంటనే స్టార్ట్ చెయ్యాలి కాబట్టి మహేష్ తొందరపడుతున్నాడని అనుకున్నారు. కాని రాజమౌళి సినిమాను 2024 వరకు సెట్స్ తీసుకెళ్లే ఛాన్స్ లేదని క్లారిటీ రావడంతో, సూపర్స్టార్ కూడా కాస్త స్లోగానే ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నాడని అనుకోవచ్చేమో.
This post was last modified on November 10, 2022 9:11 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…