జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే మొదటిసారి అభిమానులు బాగా అసహనంతో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ విడుదలై నెలలు గడుస్తున్నా ఇంకా కొత్త సినిమా మొదలుకాకపోవడం దీనికి కారణం. మొన్న వీళ్లకు ఊరడించడానికే దర్శకుడు కొరటాల శివ కెమెరామెన్ రత్నవేలు ఉన్న డిస్కషన్ ఫోటోలు బయటికి వదిలారు కానీ వాటి వల్ల చిన్న కదలిక తప్ప ఆశించిన ఉత్సాహమైతే ఇంకా రాలేదు. ఎప్పుడైతే తారక్ సెట్లో అడుగు పెడతారో అప్పటి నుంచి ఫాన్స్ కౌంట్ చేసుకోబోతున్నారు. టీమ్ ప్రస్తుతం లొకేషన్ల కోసం గోవా వెళ్లినట్టు సమాచారం. ఇంకో నెలలోపు మొత్తం వీటితో సహా క్యాస్టింగ్ ని కూడా ఫైనల్ చేయాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ 30 రిలీజ్ డేట్ ని ముందే టార్గెట్ గా పెట్టుకున్నారట. దసరాను లక్ష్యంగా చేసుకుని అక్టోబర్ మూడో వారంలో రిలీజ్ చేయడం గురించి ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఆలూ లేదూ చూలు లేదు సామెత చెప్పినట్టు ఏంటీ తొందరని అనిపిస్తుంది కానీ ఒక్కసారి చిత్రీకరణ మొదలయ్యాక ఖచ్చితంగా అయిదు నెలలలోపే షూట్ పూర్తి చేసేలా షెడ్యూల్స్ ని సిద్ధం చేసినట్టు తెలిసింది. దానికి తగ్గట్టే జూనియర్ బాడీ మేకోవర్ తో పాటు హెయిర్ స్టైల్ గట్రా మార్చి సిద్ధం కాబోతున్నాడు. విజయదశమి 24వ తేదీ మంగళవారం వస్తుంది. దానికి ముందే అంటే 20నే థియేటర్లలో అడుగుపెడితే రన్ బాగుంటుంది.
ఇవన్నీ ఓకే కానీ హీరోయిన్ మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇంతకీ ఎవరు ఎస్ చెబుతారో అంతు చిక్కడం లేదు. జాన్వీ కపూరని ఒకసారి లేదు సాయిపల్లవిని అడిగారని మరోసారి లేదు ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి దిశా పటాని లేదా కియారా అద్వానీని ట్రై చేస్తున్నారని మరోసారి ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు కానీ యూనిట్ నుంచి కనీసం లీక్ కూడా బయటికి రావడం లేదు. ఇది ఫిక్స్ అయితే కానీ ముందుకు వెళ్లలేని పరిస్థితి. అలియా భట్ ప్రెగ్నెన్సీ అయిపోయింది కానీ ఓ రెండు నెలలు ఆగితే తనూ అందుబాటులోకి వస్తుంది. చూడాలి మరి ఏం చేయబోతున్నారో.
This post was last modified on November 10, 2022 8:54 am
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…