జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే మొదటిసారి అభిమానులు బాగా అసహనంతో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ విడుదలై నెలలు గడుస్తున్నా ఇంకా కొత్త సినిమా మొదలుకాకపోవడం దీనికి కారణం. మొన్న వీళ్లకు ఊరడించడానికే దర్శకుడు కొరటాల శివ కెమెరామెన్ రత్నవేలు ఉన్న డిస్కషన్ ఫోటోలు బయటికి వదిలారు కానీ వాటి వల్ల చిన్న కదలిక తప్ప ఆశించిన ఉత్సాహమైతే ఇంకా రాలేదు. ఎప్పుడైతే తారక్ సెట్లో అడుగు పెడతారో అప్పటి నుంచి ఫాన్స్ కౌంట్ చేసుకోబోతున్నారు. టీమ్ ప్రస్తుతం లొకేషన్ల కోసం గోవా వెళ్లినట్టు సమాచారం. ఇంకో నెలలోపు మొత్తం వీటితో సహా క్యాస్టింగ్ ని కూడా ఫైనల్ చేయాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ 30 రిలీజ్ డేట్ ని ముందే టార్గెట్ గా పెట్టుకున్నారట. దసరాను లక్ష్యంగా చేసుకుని అక్టోబర్ మూడో వారంలో రిలీజ్ చేయడం గురించి ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఆలూ లేదూ చూలు లేదు సామెత చెప్పినట్టు ఏంటీ తొందరని అనిపిస్తుంది కానీ ఒక్కసారి చిత్రీకరణ మొదలయ్యాక ఖచ్చితంగా అయిదు నెలలలోపే షూట్ పూర్తి చేసేలా షెడ్యూల్స్ ని సిద్ధం చేసినట్టు తెలిసింది. దానికి తగ్గట్టే జూనియర్ బాడీ మేకోవర్ తో పాటు హెయిర్ స్టైల్ గట్రా మార్చి సిద్ధం కాబోతున్నాడు. విజయదశమి 24వ తేదీ మంగళవారం వస్తుంది. దానికి ముందే అంటే 20నే థియేటర్లలో అడుగుపెడితే రన్ బాగుంటుంది.
ఇవన్నీ ఓకే కానీ హీరోయిన్ మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇంతకీ ఎవరు ఎస్ చెబుతారో అంతు చిక్కడం లేదు. జాన్వీ కపూరని ఒకసారి లేదు సాయిపల్లవిని అడిగారని మరోసారి లేదు ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి దిశా పటాని లేదా కియారా అద్వానీని ట్రై చేస్తున్నారని మరోసారి ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు కానీ యూనిట్ నుంచి కనీసం లీక్ కూడా బయటికి రావడం లేదు. ఇది ఫిక్స్ అయితే కానీ ముందుకు వెళ్లలేని పరిస్థితి. అలియా భట్ ప్రెగ్నెన్సీ అయిపోయింది కానీ ఓ రెండు నెలలు ఆగితే తనూ అందుబాటులోకి వస్తుంది. చూడాలి మరి ఏం చేయబోతున్నారో.
This post was last modified on November 10, 2022 8:54 am
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…