పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. ఆయన తన అభిమాన నటుడని పలు సందర్భాల్లో చెప్పుకున్న పవన్… ఆయన సినిమాలు తననెంతగా అలరించాయో కూడా చెప్పాడు.
ఇప్పుడు పవన్ అరాధ్య నటుడు కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. నిన్న రాత్రి నుంచి ఇండియాలో ఇదే అతి పెద్ద వార్త. అమితాబ్తో పాటు ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆద్య కూడా కరోనా బాధితులుగా మారారు. ఐశ్వర్య, ఆద్యలకు కరోనా అని లేటుగా తెలిసింది. ఈ లోపు పవన్ అమితాబ్, అభిషేక్ల గురించి ఆవేదనతో ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టాడు.
కూలీ సినిమా షూటింగ్ సందర్భంగా అమితాబ్ పెద్ద ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితికి చేరినపుడు తన తల్లిదండ్రులతో పాటు కుటుంబంలో అందరూ ఆయన కోసం ప్రార్థించారని.. అన్ని తరాల వారినీ అభిమానులుగా మార్చుకున్న వ్యక్తి అమితాబ్ అని.. అమితాబ్ను అందరూ కేవలం నటుడిగా మాత్రమే కాక ఆయన పోరాటతత్వం, అణకువ, సింప్లిసిటీ చూసి ఎక్కువ ఇష్టపడతారని.. అమితాబ్కు, అభిషేక్కు కరోనా అని తెలియగానే తనకు విపరీతమైన బాధ కలిగిందని.. వీళ్లిద్దరూ త్వరగా కోలుకునేలా దేవుడు చూస్తాడని ఆశిస్తున్నానని పవన్ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్కు హీరోయిన్ పూజా హెగ్డే స్పందిస్తూ.. అమితాబ్ విషయంలో తన ఫీలింగ్స్ కూడా డిట్టో ఇలాగే ఉన్నాయని.. ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసింది.
This post was last modified on July 12, 2020 8:42 pm
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…