పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. ఆయన తన అభిమాన నటుడని పలు సందర్భాల్లో చెప్పుకున్న పవన్… ఆయన సినిమాలు తననెంతగా అలరించాయో కూడా చెప్పాడు.
ఇప్పుడు పవన్ అరాధ్య నటుడు కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. నిన్న రాత్రి నుంచి ఇండియాలో ఇదే అతి పెద్ద వార్త. అమితాబ్తో పాటు ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆద్య కూడా కరోనా బాధితులుగా మారారు. ఐశ్వర్య, ఆద్యలకు కరోనా అని లేటుగా తెలిసింది. ఈ లోపు పవన్ అమితాబ్, అభిషేక్ల గురించి ఆవేదనతో ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టాడు.
కూలీ సినిమా షూటింగ్ సందర్భంగా అమితాబ్ పెద్ద ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితికి చేరినపుడు తన తల్లిదండ్రులతో పాటు కుటుంబంలో అందరూ ఆయన కోసం ప్రార్థించారని.. అన్ని తరాల వారినీ అభిమానులుగా మార్చుకున్న వ్యక్తి అమితాబ్ అని.. అమితాబ్ను అందరూ కేవలం నటుడిగా మాత్రమే కాక ఆయన పోరాటతత్వం, అణకువ, సింప్లిసిటీ చూసి ఎక్కువ ఇష్టపడతారని.. అమితాబ్కు, అభిషేక్కు కరోనా అని తెలియగానే తనకు విపరీతమైన బాధ కలిగిందని.. వీళ్లిద్దరూ త్వరగా కోలుకునేలా దేవుడు చూస్తాడని ఆశిస్తున్నానని పవన్ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్కు హీరోయిన్ పూజా హెగ్డే స్పందిస్తూ.. అమితాబ్ విషయంలో తన ఫీలింగ్స్ కూడా డిట్టో ఇలాగే ఉన్నాయని.. ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసింది.
This post was last modified on July 12, 2020 8:42 pm
https://www.youtube.com/watch?v=hFNCZ_oVOZ4 ఏడాదిన్నరగా కళ్యాణ్ రామ్ కు గ్యాప్ వచ్చేసింది. డెవిల్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ నందమూరి హీరో…
ఒకపక్క కామెడీ వేషాలు ఇంకోవైపు విలన్ పాత్రలు వేసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ బ్రహ్మాండంగా నడిపిస్తున్న సునీల్ కు కోలీవుడ్ లో…
అంతా అనుకున్నట్టే అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండానే జనసేన ఓ మునిసిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా…
తమిళ జనాలకు మహేంద్రసింగ్ ధోని అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆ జట్టుకు…
తమిళంలో ఆ మధ్య పెరుసు అనే సినిమా రిలీజయ్యింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది. తెలుగు డబ్బింగ్ తో పాటు…
గత ఏడాది టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ దెబ్బకు వీడియో ప్రమోషన్లకు దూరంగా ఉన్న విశ్వంభర ఎట్టకేలకు ఇవాళ హనుమాన్…