samantha
టాలీవుడ్ చరిత్రలోనే తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించిన కథానాయికల్లో సమంత ఒకరు. ఐతే ఈ ఫాలోయింగ్ కేవలం తన సినిమాల వల్ల రాలేదు. సగం క్రెడిట్ సినిమాలకు ఇస్తే.. సగం ఆమె వ్యక్తిత్వానికి ఇవ్వాలి. తన చిలిపితనం.. తన దృఢమైన వ్యక్తిత్వం.. తన సేవాభావం తెలుగు వారికి ఆమెను మరింత దగ్గర చేశాయి. వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకులు ఎదురైనపుడు ఆమె బలంగా నిలబడే తీరు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.
ఇటీవల మయోసైటిస్ అనే అనారోగ్య సమస్య తలెత్తితే.. దాని గురించి దాచి పెట్టకుండా అందరికీ వెల్లడించింది. అంతే కాక ఈ దశను అధిగమించి మళ్లీ సంపూర్ణ ఆరోగ్యవంతురాలినవుతానని ధీమా వ్యక్తం చేసింది. ఆసుపత్రిలో ఉంటూ చికిత్స తీసుకుంటూనే తన కొత్త చిత్రం ‘యశోద’ కోసం యాంకర్ సుమతో కలిసి ఆమె ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం విశేషం.
ఈ పరిస్థితుల్లోనూ సినిమా కోసం ఆమె చూపిస్తున్న కమిట్మెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ ఇంటర్వ్యూలో తన అనారోగ్యం గురించి మాట్లాడుతూ సమంత ఉద్వేగానికి గురైంది. ఆమె కన్నీళ్లు పెట్టుకున్న తీరు చూసి అభిమానులకు కూడా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ఓవైపు ఉద్వేగానికి గురవుతూనే.. మరోవైపు తన అనారోగ్యం గురించి యూట్యూబ్ ఛానెళ్లు చేస్తున్న అరాచకాలపై సమంత చమత్కరించడం విశేషం. ఒక్కో రోజు ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితిని తాను ఎదుర్కొన్నానని.. కానీ అంతలోనే ఆశ కోల్పోకుండా పుంజుకునే ప్రయత్నం చేస్తున్నానని సమంత చెప్పింది. ఈ మాట చెబుతూ సమంత కన్నీళ్లు పెట్టుకుంది.
జీవితంలో ఇలాంటివి మామూలే అని చెప్పిన సమంత.. తనకు వచ్చిన వ్యాధి కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమైనదే అయినప్పటికీ.. తాను మాత్రం ఆ స్థితిలో లేనని స్పష్టం చేసింది. అందరూ తన గురించి హెడ్డింగ్లు పెడుతున్నట్లు.. తానేమీ చనిపోయే స్థితిలో లేనని చెబుతూ.. ‘‘నేనింకా చావలేదు’’ అని నవ్వేసింది సమంత. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This post was last modified on November 8, 2022 1:21 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…