samantha
టాలీవుడ్ చరిత్రలోనే తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించిన కథానాయికల్లో సమంత ఒకరు. ఐతే ఈ ఫాలోయింగ్ కేవలం తన సినిమాల వల్ల రాలేదు. సగం క్రెడిట్ సినిమాలకు ఇస్తే.. సగం ఆమె వ్యక్తిత్వానికి ఇవ్వాలి. తన చిలిపితనం.. తన దృఢమైన వ్యక్తిత్వం.. తన సేవాభావం తెలుగు వారికి ఆమెను మరింత దగ్గర చేశాయి. వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకులు ఎదురైనపుడు ఆమె బలంగా నిలబడే తీరు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.
ఇటీవల మయోసైటిస్ అనే అనారోగ్య సమస్య తలెత్తితే.. దాని గురించి దాచి పెట్టకుండా అందరికీ వెల్లడించింది. అంతే కాక ఈ దశను అధిగమించి మళ్లీ సంపూర్ణ ఆరోగ్యవంతురాలినవుతానని ధీమా వ్యక్తం చేసింది. ఆసుపత్రిలో ఉంటూ చికిత్స తీసుకుంటూనే తన కొత్త చిత్రం ‘యశోద’ కోసం యాంకర్ సుమతో కలిసి ఆమె ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం విశేషం.
ఈ పరిస్థితుల్లోనూ సినిమా కోసం ఆమె చూపిస్తున్న కమిట్మెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ ఇంటర్వ్యూలో తన అనారోగ్యం గురించి మాట్లాడుతూ సమంత ఉద్వేగానికి గురైంది. ఆమె కన్నీళ్లు పెట్టుకున్న తీరు చూసి అభిమానులకు కూడా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ఓవైపు ఉద్వేగానికి గురవుతూనే.. మరోవైపు తన అనారోగ్యం గురించి యూట్యూబ్ ఛానెళ్లు చేస్తున్న అరాచకాలపై సమంత చమత్కరించడం విశేషం. ఒక్కో రోజు ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితిని తాను ఎదుర్కొన్నానని.. కానీ అంతలోనే ఆశ కోల్పోకుండా పుంజుకునే ప్రయత్నం చేస్తున్నానని సమంత చెప్పింది. ఈ మాట చెబుతూ సమంత కన్నీళ్లు పెట్టుకుంది.
జీవితంలో ఇలాంటివి మామూలే అని చెప్పిన సమంత.. తనకు వచ్చిన వ్యాధి కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమైనదే అయినప్పటికీ.. తాను మాత్రం ఆ స్థితిలో లేనని స్పష్టం చేసింది. అందరూ తన గురించి హెడ్డింగ్లు పెడుతున్నట్లు.. తానేమీ చనిపోయే స్థితిలో లేనని చెబుతూ.. ‘‘నేనింకా చావలేదు’’ అని నవ్వేసింది సమంత. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…