samantha
టాలీవుడ్ చరిత్రలోనే తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించిన కథానాయికల్లో సమంత ఒకరు. ఐతే ఈ ఫాలోయింగ్ కేవలం తన సినిమాల వల్ల రాలేదు. సగం క్రెడిట్ సినిమాలకు ఇస్తే.. సగం ఆమె వ్యక్తిత్వానికి ఇవ్వాలి. తన చిలిపితనం.. తన దృఢమైన వ్యక్తిత్వం.. తన సేవాభావం తెలుగు వారికి ఆమెను మరింత దగ్గర చేశాయి. వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకులు ఎదురైనపుడు ఆమె బలంగా నిలబడే తీరు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.
ఇటీవల మయోసైటిస్ అనే అనారోగ్య సమస్య తలెత్తితే.. దాని గురించి దాచి పెట్టకుండా అందరికీ వెల్లడించింది. అంతే కాక ఈ దశను అధిగమించి మళ్లీ సంపూర్ణ ఆరోగ్యవంతురాలినవుతానని ధీమా వ్యక్తం చేసింది. ఆసుపత్రిలో ఉంటూ చికిత్స తీసుకుంటూనే తన కొత్త చిత్రం ‘యశోద’ కోసం యాంకర్ సుమతో కలిసి ఆమె ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం విశేషం.
ఈ పరిస్థితుల్లోనూ సినిమా కోసం ఆమె చూపిస్తున్న కమిట్మెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ ఇంటర్వ్యూలో తన అనారోగ్యం గురించి మాట్లాడుతూ సమంత ఉద్వేగానికి గురైంది. ఆమె కన్నీళ్లు పెట్టుకున్న తీరు చూసి అభిమానులకు కూడా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ఓవైపు ఉద్వేగానికి గురవుతూనే.. మరోవైపు తన అనారోగ్యం గురించి యూట్యూబ్ ఛానెళ్లు చేస్తున్న అరాచకాలపై సమంత చమత్కరించడం విశేషం. ఒక్కో రోజు ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితిని తాను ఎదుర్కొన్నానని.. కానీ అంతలోనే ఆశ కోల్పోకుండా పుంజుకునే ప్రయత్నం చేస్తున్నానని సమంత చెప్పింది. ఈ మాట చెబుతూ సమంత కన్నీళ్లు పెట్టుకుంది.
జీవితంలో ఇలాంటివి మామూలే అని చెప్పిన సమంత.. తనకు వచ్చిన వ్యాధి కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమైనదే అయినప్పటికీ.. తాను మాత్రం ఆ స్థితిలో లేనని స్పష్టం చేసింది. అందరూ తన గురించి హెడ్డింగ్లు పెడుతున్నట్లు.. తానేమీ చనిపోయే స్థితిలో లేనని చెబుతూ.. ‘‘నేనింకా చావలేదు’’ అని నవ్వేసింది సమంత. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This post was last modified on November 8, 2022 1:21 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…