ఈ మధ్య ఏదైనా సినిమాకు పాజిటివ్ టాక్ లేదా మంచి రివ్యూలు వచ్చినంత మాత్రాన వసూళ్లు అంతే ఘనంగా ఉంటాయన్న గ్యారెంటీ ఉండటం లేదు. ఉదాహరణకు గత నెల దసరాకి విడుదలైన చిరంజీవి గాడ్ ఫాదర్ మొదటి నాలుగు రోజులు మాములు రచ్చ చేయలేదు. నిజంగానే బాస్ ఈజ్ బ్యాక్ అనేలా పండగ వసూళ్లు అదరగొట్టాయి. తొంబై కోట్ల టార్గెట్ ఈజీనే అనుకున్నారు. తీరా చూస్తే యాభై దాటడం ఆలస్యం రెండో వారానికే విపరీతంగా స్లో అయిపోయి ఫైనల్ గా హిట్టో ఫట్టో చెప్పలేని అయోమయంలోకి తీసుకెళ్లింది. మొత్తంగా చూస్తే ఆచార్య కంటే అన్ని కోణాల్లో వందరెట్లు నయమనే సంతృప్తిని మిగిల్చింది.
ఇప్పుడు అల్లుడు అల్లు శిరీష్ కీ ఇదే సమస్య వచ్చి పడింది. శుక్రవారం రిలీజైన ఊర్వశివో రాక్షసివోకి టాక్ బాగుంది. మీడియా సపోర్ట్ దక్కింది. నవ్వించి టైం పాస్ చేయించి స్పెషల్ రొమాన్స్ ని చక్కగా దట్టించి ఎంటర్ టైన్ చేశారనే రిపోర్ట్స్ గీతా ఆర్ట్స్ టీమ్ కి ఉత్సాహాన్ని ఇచ్చాయి. దీంతో అప్పటికప్పుడు ఒక్క రోజులో సక్సెస్ మీట్ కి కావాల్సిన ఏర్పాట్లు చేసి అల్లు అర్జున్ ని ముఖ్య అతిధిగా తీసుకొచ్చి హైప్ ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ వేడుకలో బన్నీ నామస్మరణ ఎక్కువవడంతో అసలు టార్గెట్ పక్కకెళ్లిన మాట కూడా వాస్తవం.
ఇక వసూళ్ల విషయానికి వస్తే ఈ ఊర్వశివో రాక్షసివో కలెక్షన్లు మరీ జెట్ స్పీడ్ తో ఏం లేవు. వీకెండ్ కి కనీసం ఓ రెండు కోట్ల షేర్ వచ్చి ఉంటే బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుందనుకోవచ్చు. కానీ కోటిన్నర కూడా టచ్ చేయలేకపోయిందని ట్రేడ్ న్యూస్. వీక్ డేస్ లో సహజంగానే డ్రాప్ ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రోజులు పెద్దగా అద్భుతాలు జరగవు. సండే రోజు కాంతార హౌస్ ఫుల్ అయిన చాలా చోట్ల శిరీష్ సినిమాకు టికెట్లు దొరికాయి. మిగిలిన వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. అసలే శుక్రవారం యశోద, వాకండా ఫరెవర్ లతో కాంపిటీషన్ టఫ్ గా ఉంది. మరి అల్లు బ్రదర్ ఎలా నెట్టుకొస్తాడో.
This post was last modified on November 8, 2022 6:28 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…