సంక్రాంతి రేసులో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముందు రిజర్వ్ చేసుకున్న ఆది పురుష్ ఫస్ట్ తప్పుకోగా తాజాగా ఏజెంట్ కూడా పండగ బరిలో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. నిర్మాత అనిల్ సుంకర ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ దాదాపు పోస్ట్ పోన్ అయినట్టేనని, మొన్న వదిలిన పోస్టర్ ముందస్తు జాగ్రత్త తప్పించి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలన్న గ్యారెంటీతో కాదట. మహాశివరాత్రిని టార్గెట్ చేసుకుంటే సోలో కాంపిటీషన్ తో పాటు మంచి రన్ దక్కే అవకాశం కనిపిస్తోంది కనుక దానికే మొగ్గు చూపొచ్చని వినికిడి.
అలా జరిగితే ఏజెంట్ తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఇదే అవుతుంది. పైగా వాల్తేర్ వీరయ్య, వీరసింహా రెడ్డి లాంటి మాస్ బొమ్మలను తట్టుకుని ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ నిలవడం అంత సులభం కాదు. ఎందుకంటే బిసి సెంటర్స్ లో గన్నులు పట్టుకుని ఫారిన్ లో తిరిగే హీరో కన్నా పంచలు కట్టుకుని ఊళ్ళో విలన్ల భరతం పట్టే ఊర మాస్ చిరు బాలయ్యకే మాస్ జనం ఎక్కువ మొగ్గు చూపుతారు. అందులోనూ ఇవి ప్యాన్ ఇండియా కాకపోయినా తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ పరంగా విపరీతమైన క్రేజ్ ఉంది. థియేటర్లు తగ్గడం ఏజెంట్ కు ఎంత మాత్రం సేఫ్ గేమ్ కాదు.
ఇదొక ఎత్తయితే తమిళంలో విజయ్ వారసుడు, అజిత్ తునివులకే అక్కడి స్క్రీన్లు చాలక డిస్ట్రిబ్యూటర్లు కొట్టుకునే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ప్యాన్ ఇండియా ఏజెంట్ కి కొన్ని ఇవ్వండంటే సమస్యే లేదని వెళ్లిపొమ్మంటారు. మమ్ముట్టి లాంటి బ్యాక్ పెట్టుకుని ఇలాంటి రిస్కులు చేయడం కరెక్ట్ కాదు. అఖిల్ సినిమా ఎప్పుడు వచ్చినా మల్టీ లాంగ్వేజెస్ లో వీలైనంత సోలో రిలీజ్ దక్కించుకోవడం అవసరం. అందుకే అన్నీ అలోచించి ఏజెంట్ ని ఫెస్టివల్ ట్రాక్ నుంచి తప్పించారనే టాక్ ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ సక్సెస్ కు అఖిల్ కు మార్కెట్ పరంగా చాలా కీలకం.
This post was last modified on November 7, 2022 10:55 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…