సంక్రాంతి రేసులో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముందు రిజర్వ్ చేసుకున్న ఆది పురుష్ ఫస్ట్ తప్పుకోగా తాజాగా ఏజెంట్ కూడా పండగ బరిలో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. నిర్మాత అనిల్ సుంకర ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ దాదాపు పోస్ట్ పోన్ అయినట్టేనని, మొన్న వదిలిన పోస్టర్ ముందస్తు జాగ్రత్త తప్పించి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలన్న గ్యారెంటీతో కాదట. మహాశివరాత్రిని టార్గెట్ చేసుకుంటే సోలో కాంపిటీషన్ తో పాటు మంచి రన్ దక్కే అవకాశం కనిపిస్తోంది కనుక దానికే మొగ్గు చూపొచ్చని వినికిడి.
అలా జరిగితే ఏజెంట్ తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఇదే అవుతుంది. పైగా వాల్తేర్ వీరయ్య, వీరసింహా రెడ్డి లాంటి మాస్ బొమ్మలను తట్టుకుని ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ నిలవడం అంత సులభం కాదు. ఎందుకంటే బిసి సెంటర్స్ లో గన్నులు పట్టుకుని ఫారిన్ లో తిరిగే హీరో కన్నా పంచలు కట్టుకుని ఊళ్ళో విలన్ల భరతం పట్టే ఊర మాస్ చిరు బాలయ్యకే మాస్ జనం ఎక్కువ మొగ్గు చూపుతారు. అందులోనూ ఇవి ప్యాన్ ఇండియా కాకపోయినా తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ పరంగా విపరీతమైన క్రేజ్ ఉంది. థియేటర్లు తగ్గడం ఏజెంట్ కు ఎంత మాత్రం సేఫ్ గేమ్ కాదు.
ఇదొక ఎత్తయితే తమిళంలో విజయ్ వారసుడు, అజిత్ తునివులకే అక్కడి స్క్రీన్లు చాలక డిస్ట్రిబ్యూటర్లు కొట్టుకునే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ప్యాన్ ఇండియా ఏజెంట్ కి కొన్ని ఇవ్వండంటే సమస్యే లేదని వెళ్లిపొమ్మంటారు. మమ్ముట్టి లాంటి బ్యాక్ పెట్టుకుని ఇలాంటి రిస్కులు చేయడం కరెక్ట్ కాదు. అఖిల్ సినిమా ఎప్పుడు వచ్చినా మల్టీ లాంగ్వేజెస్ లో వీలైనంత సోలో రిలీజ్ దక్కించుకోవడం అవసరం. అందుకే అన్నీ అలోచించి ఏజెంట్ ని ఫెస్టివల్ ట్రాక్ నుంచి తప్పించారనే టాక్ ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ సక్సెస్ కు అఖిల్ కు మార్కెట్ పరంగా చాలా కీలకం.
This post was last modified on November 7, 2022 10:55 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…