సంక్రాంతి రేసులో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముందు రిజర్వ్ చేసుకున్న ఆది పురుష్ ఫస్ట్ తప్పుకోగా తాజాగా ఏజెంట్ కూడా పండగ బరిలో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. నిర్మాత అనిల్ సుంకర ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ దాదాపు పోస్ట్ పోన్ అయినట్టేనని, మొన్న వదిలిన పోస్టర్ ముందస్తు జాగ్రత్త తప్పించి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలన్న గ్యారెంటీతో కాదట. మహాశివరాత్రిని టార్గెట్ చేసుకుంటే సోలో కాంపిటీషన్ తో పాటు మంచి రన్ దక్కే అవకాశం కనిపిస్తోంది కనుక దానికే మొగ్గు చూపొచ్చని వినికిడి.
అలా జరిగితే ఏజెంట్ తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఇదే అవుతుంది. పైగా వాల్తేర్ వీరయ్య, వీరసింహా రెడ్డి లాంటి మాస్ బొమ్మలను తట్టుకుని ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ నిలవడం అంత సులభం కాదు. ఎందుకంటే బిసి సెంటర్స్ లో గన్నులు పట్టుకుని ఫారిన్ లో తిరిగే హీరో కన్నా పంచలు కట్టుకుని ఊళ్ళో విలన్ల భరతం పట్టే ఊర మాస్ చిరు బాలయ్యకే మాస్ జనం ఎక్కువ మొగ్గు చూపుతారు. అందులోనూ ఇవి ప్యాన్ ఇండియా కాకపోయినా తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ పరంగా విపరీతమైన క్రేజ్ ఉంది. థియేటర్లు తగ్గడం ఏజెంట్ కు ఎంత మాత్రం సేఫ్ గేమ్ కాదు.
ఇదొక ఎత్తయితే తమిళంలో విజయ్ వారసుడు, అజిత్ తునివులకే అక్కడి స్క్రీన్లు చాలక డిస్ట్రిబ్యూటర్లు కొట్టుకునే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ప్యాన్ ఇండియా ఏజెంట్ కి కొన్ని ఇవ్వండంటే సమస్యే లేదని వెళ్లిపొమ్మంటారు. మమ్ముట్టి లాంటి బ్యాక్ పెట్టుకుని ఇలాంటి రిస్కులు చేయడం కరెక్ట్ కాదు. అఖిల్ సినిమా ఎప్పుడు వచ్చినా మల్టీ లాంగ్వేజెస్ లో వీలైనంత సోలో రిలీజ్ దక్కించుకోవడం అవసరం. అందుకే అన్నీ అలోచించి ఏజెంట్ ని ఫెస్టివల్ ట్రాక్ నుంచి తప్పించారనే టాక్ ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ సక్సెస్ కు అఖిల్ కు మార్కెట్ పరంగా చాలా కీలకం.
This post was last modified on November 7, 2022 10:55 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…