Movie News

మనసు మార్చుకుంటున్న ఏజెంట్ ?

సంక్రాంతి రేసులో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముందు రిజర్వ్ చేసుకున్న ఆది పురుష్ ఫస్ట్ తప్పుకోగా తాజాగా ఏజెంట్ కూడా పండగ బరిలో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. నిర్మాత అనిల్ సుంకర ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ దాదాపు పోస్ట్ పోన్ అయినట్టేనని, మొన్న వదిలిన పోస్టర్ ముందస్తు జాగ్రత్త తప్పించి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలన్న గ్యారెంటీతో కాదట. మహాశివరాత్రిని టార్గెట్ చేసుకుంటే సోలో కాంపిటీషన్ తో పాటు మంచి రన్ దక్కే అవకాశం కనిపిస్తోంది కనుక దానికే మొగ్గు చూపొచ్చని వినికిడి.

అలా జరిగితే ఏజెంట్ తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఇదే అవుతుంది. పైగా వాల్తేర్ వీరయ్య, వీరసింహా రెడ్డి లాంటి మాస్ బొమ్మలను తట్టుకుని ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ నిలవడం అంత సులభం కాదు. ఎందుకంటే బిసి సెంటర్స్ లో గన్నులు పట్టుకుని ఫారిన్ లో తిరిగే హీరో కన్నా పంచలు కట్టుకుని ఊళ్ళో విలన్ల భరతం పట్టే ఊర మాస్ చిరు బాలయ్యకే మాస్ జనం ఎక్కువ మొగ్గు చూపుతారు. అందులోనూ ఇవి ప్యాన్ ఇండియా కాకపోయినా తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ పరంగా విపరీతమైన క్రేజ్ ఉంది. థియేటర్లు తగ్గడం ఏజెంట్ కు ఎంత మాత్రం సేఫ్ గేమ్ కాదు.

ఇదొక ఎత్తయితే తమిళంలో విజయ్ వారసుడు, అజిత్ తునివులకే అక్కడి స్క్రీన్లు చాలక డిస్ట్రిబ్యూటర్లు కొట్టుకునే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ప్యాన్ ఇండియా ఏజెంట్ కి కొన్ని ఇవ్వండంటే సమస్యే లేదని వెళ్లిపొమ్మంటారు. మమ్ముట్టి లాంటి బ్యాక్ పెట్టుకుని ఇలాంటి రిస్కులు చేయడం కరెక్ట్ కాదు. అఖిల్ సినిమా ఎప్పుడు వచ్చినా మల్టీ లాంగ్వేజెస్ లో వీలైనంత సోలో రిలీజ్ దక్కించుకోవడం అవసరం. అందుకే అన్నీ అలోచించి ఏజెంట్ ని ఫెస్టివల్ ట్రాక్ నుంచి తప్పించారనే టాక్ ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ సక్సెస్ కు అఖిల్ కు మార్కెట్ పరంగా చాలా కీలకం.

This post was last modified on November 7, 2022 10:55 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

4 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

4 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

6 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

6 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

6 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

8 hours ago