గతంలో మాదిరిగా విదేశీ చిత్రాలను సైలెంటుగా కాపీ కొట్టేసి ఇప్పుడు సినిమాలు తీసేసే పరిస్థితి లేదు. వరల్డ్ సినిమా అందరికీ అందుబాటులోకి వచ్చేసిన నేపథ్యంలో ఫ్రీమేక్లు తీస్తే అడ్డంగా బుక్ అవ్వాల్సిందే. ఇక రీమేక్ సినిమాల విషయంలోనూ ఇంతకుముందులా దాపరికాలు పాటించే పరిస్థితి ఇప్పుడు లేదు. ఏదో భాష నుంచి రీమేక్ హక్కులు తీసుకుని, ఆ విషయం చెప్పకుండా జనాలను మభ్యపెట్టి సినిమాలు రిలీజ్ చేయడం కూడా కష్టంగానే ఉందిప్పుడు.
చిన్న ఫ్రేమ్ చూసి ఇది ఫలానా భాషలో ఫలానా సినిమాకు రీమేక్ అనే విషయాన్ని జనం కనిపెట్టేస్తున్నారు. అందుకే రీమేక్ సినిమాలు చేసే వాళ్లు.. ముందే అసలు విషయం చెప్పేస్తున్నారు. ఐతే అన్ని భాషల సినిమాలనూ అందరూ చూసేస్తున్న ఈ రోజుల్లో రీమేక్ సినిమాలు తీసి ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ కలిగించడం, సినిమాలను హిట్ చేయడం సవాలుగా మారిపోతోంది.
కానీ ‘ఊర్వశివో రాక్షసివో’ టీం మాత్రం ఈ విషయంలో భలే తెలివిగా వ్యవహరించింది. ఈ చిత్రం రీమేక్ అన్న విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. స్ట్రెయిట్ సినిమాలాగే ప్రచారం చేసింది. నిజానికి ఇది ‘ప్యార్ ప్రేమ కాదల్’ అనే తమిళ హిట్ మూవీకి రీమేక్. అక్కడ దీన్నొక బి-గ్రేడ్ బోల్డ్ మూవీలా చూశారు. యూత్ బాగా అట్రాక్ట్ అయి హిట్ చేశారు.
ఏదైనా పాపులర్, పెద్ద సినిమాను రీమేక్ చేసి ఉంటే దాని గురించి పెద్ద చర్చ జరిగేది. కానీ దర్శకుడు రాకేశ్ శశి ‘ప్యార్ ప్రేమ కాదల్’ లాంటి చిన్న స్థాయిలో బోల్డ్ మూవీని ఎంచుకుని, ఇక్కడ పేరున్న ఆర్టిస్టులతో ప్యాడింగ్ పెట్టుకుని, బోల్డ్ కంటెంట్ డోస్ ఏమాత్రం తగ్గించకుండానే యూత్ బాగా కనెక్టయ్యేలా వినోదాన్ని జోడించి సినిమా రేంజ్ పెంచాడు. ఇదొక రీమేక్ అన్న చర్చే లేకుండా చేయడంలో చిత్ర బృందం విజయవంతం అయింది. మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలి రోజు సాయంత్రం నుంచి బాగా పుంజుకుని మంచి వసూళ్ల దిశగా అడుగులు వేస్తోంది.
This post was last modified on November 6, 2022 8:03 am
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…