గతంలో మాదిరిగా విదేశీ చిత్రాలను సైలెంటుగా కాపీ కొట్టేసి ఇప్పుడు సినిమాలు తీసేసే పరిస్థితి లేదు. వరల్డ్ సినిమా అందరికీ అందుబాటులోకి వచ్చేసిన నేపథ్యంలో ఫ్రీమేక్లు తీస్తే అడ్డంగా బుక్ అవ్వాల్సిందే. ఇక రీమేక్ సినిమాల విషయంలోనూ ఇంతకుముందులా దాపరికాలు పాటించే పరిస్థితి ఇప్పుడు లేదు. ఏదో భాష నుంచి రీమేక్ హక్కులు తీసుకుని, ఆ విషయం చెప్పకుండా జనాలను మభ్యపెట్టి సినిమాలు రిలీజ్ చేయడం కూడా కష్టంగానే ఉందిప్పుడు.
చిన్న ఫ్రేమ్ చూసి ఇది ఫలానా భాషలో ఫలానా సినిమాకు రీమేక్ అనే విషయాన్ని జనం కనిపెట్టేస్తున్నారు. అందుకే రీమేక్ సినిమాలు చేసే వాళ్లు.. ముందే అసలు విషయం చెప్పేస్తున్నారు. ఐతే అన్ని భాషల సినిమాలనూ అందరూ చూసేస్తున్న ఈ రోజుల్లో రీమేక్ సినిమాలు తీసి ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ కలిగించడం, సినిమాలను హిట్ చేయడం సవాలుగా మారిపోతోంది.
కానీ ‘ఊర్వశివో రాక్షసివో’ టీం మాత్రం ఈ విషయంలో భలే తెలివిగా వ్యవహరించింది. ఈ చిత్రం రీమేక్ అన్న విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. స్ట్రెయిట్ సినిమాలాగే ప్రచారం చేసింది. నిజానికి ఇది ‘ప్యార్ ప్రేమ కాదల్’ అనే తమిళ హిట్ మూవీకి రీమేక్. అక్కడ దీన్నొక బి-గ్రేడ్ బోల్డ్ మూవీలా చూశారు. యూత్ బాగా అట్రాక్ట్ అయి హిట్ చేశారు.
ఏదైనా పాపులర్, పెద్ద సినిమాను రీమేక్ చేసి ఉంటే దాని గురించి పెద్ద చర్చ జరిగేది. కానీ దర్శకుడు రాకేశ్ శశి ‘ప్యార్ ప్రేమ కాదల్’ లాంటి చిన్న స్థాయిలో బోల్డ్ మూవీని ఎంచుకుని, ఇక్కడ పేరున్న ఆర్టిస్టులతో ప్యాడింగ్ పెట్టుకుని, బోల్డ్ కంటెంట్ డోస్ ఏమాత్రం తగ్గించకుండానే యూత్ బాగా కనెక్టయ్యేలా వినోదాన్ని జోడించి సినిమా రేంజ్ పెంచాడు. ఇదొక రీమేక్ అన్న చర్చే లేకుండా చేయడంలో చిత్ర బృందం విజయవంతం అయింది. మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలి రోజు సాయంత్రం నుంచి బాగా పుంజుకుని మంచి వసూళ్ల దిశగా అడుగులు వేస్తోంది.
This post was last modified on November 6, 2022 8:03 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…