టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ కావాలంటే రాజమౌళితోనే సినిమా చేయాల్సిన అవసరం లేదని చాటి చెప్పాడు అల్లు అర్జున్. ‘పుష్ప’ మూవీతో అతను అనూహ్యంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ సినిమా తెలుగేతర భాషల్లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్నందుకుంది. ముఖ్యంగా హిందీలో ఆ సినిమా ఏకంగా వంద కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టి అక్కడి ట్రేడ్ పండిట్లను షాక్కు గురి చేసింది.
ఈ సినిమాలో బన్నీ మేనరిజమ్స్, డైలాగ్స్ వరల్డ్ లెవెల్లో పాపులర్ అయ్యాయి. మెడ కింద చెయ్యి పెట్టి తగ్గేదేలే అంటూ చెప్పే డైలాగ్ ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. ఈ పాపులారిటీ ‘పుష్ప-2’ బిజినెస్కు బాగా కలిసొస్తోంది. ఈ సినిమాకు ఉన్న హైప్ను ఇంకా పెంచేందుకు ముందు నుంచి మార్కెటింగ్ గట్టిగా చేయడానికి రెడీ అవుతోంది చిత్ర బృందం. ఒక బ్యాంగ్ బ్యాంగ్ వీడియో ప్రోమోతో ‘పుష్ప-2’ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడట సుకుమార్.
నేరుగా ‘పుష్ప-2’ టాకీ పార్ట్ చిత్రీకరణ మొదలుపెట్టకుండా.. టీజర్ గ్లింప్స్ కోసం విజువల్స్ తీయబోతున్నాడట సుకుమార్. ఇంకొన్ని రోజుల్లోనే రామోజీ ఫిలిం సిటీలో ఈ షూట్ జరగబోతోంది. కొన్ని రోజుల పాటు ఈ షాట్స్ చిత్రీకరించి.. దాన్ని ఎడిటింగ్కు పంపించి ఆ తర్వాత రెగ్యులర్ షూట్లోకి వెళ్లనున్నారట.
‘పుష్ప-2’ టీజర్ గ్లింప్స్ను ‘అవతార్-2’ రిలీజ్ రోజు వరల్డ్ వైడ్ వీలైనంత మేర ఆ సినిమా ఆడే థియేటర్లలో ఇంటర్వెల్లో ప్రదర్శించేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దాదాపు 25 భాషల్లో ఈ టీజర్ గ్లింప్స్ లాంచ్ చేయబోతున్నారట. ‘పుష్ప-2’ సినిమాకు ఇది బ్యాంగ్ బ్యాంగ్ స్టార్ట్ అవుతుందనడంలో సందేహం లేదు. ఒకేసారి సినిమా మీద హైప్ మరిన్ని రెట్లు పెరిగేలా సుకుమార్ ఈ టీజర్ గ్లింప్స్ను తీర్చిదిద్దడంతో పాటు దీని రీచ్ ఒక రేంజిలో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది దసరాకు రిలీజయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.
This post was last modified on November 4, 2022 4:30 pm
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…