టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ కావాలంటే రాజమౌళితోనే సినిమా చేయాల్సిన అవసరం లేదని చాటి చెప్పాడు అల్లు అర్జున్. ‘పుష్ప’ మూవీతో అతను అనూహ్యంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ సినిమా తెలుగేతర భాషల్లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్నందుకుంది. ముఖ్యంగా హిందీలో ఆ సినిమా ఏకంగా వంద కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టి అక్కడి ట్రేడ్ పండిట్లను షాక్కు గురి చేసింది.
ఈ సినిమాలో బన్నీ మేనరిజమ్స్, డైలాగ్స్ వరల్డ్ లెవెల్లో పాపులర్ అయ్యాయి. మెడ కింద చెయ్యి పెట్టి తగ్గేదేలే అంటూ చెప్పే డైలాగ్ ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. ఈ పాపులారిటీ ‘పుష్ప-2’ బిజినెస్కు బాగా కలిసొస్తోంది. ఈ సినిమాకు ఉన్న హైప్ను ఇంకా పెంచేందుకు ముందు నుంచి మార్కెటింగ్ గట్టిగా చేయడానికి రెడీ అవుతోంది చిత్ర బృందం. ఒక బ్యాంగ్ బ్యాంగ్ వీడియో ప్రోమోతో ‘పుష్ప-2’ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడట సుకుమార్.
నేరుగా ‘పుష్ప-2’ టాకీ పార్ట్ చిత్రీకరణ మొదలుపెట్టకుండా.. టీజర్ గ్లింప్స్ కోసం విజువల్స్ తీయబోతున్నాడట సుకుమార్. ఇంకొన్ని రోజుల్లోనే రామోజీ ఫిలిం సిటీలో ఈ షూట్ జరగబోతోంది. కొన్ని రోజుల పాటు ఈ షాట్స్ చిత్రీకరించి.. దాన్ని ఎడిటింగ్కు పంపించి ఆ తర్వాత రెగ్యులర్ షూట్లోకి వెళ్లనున్నారట.
‘పుష్ప-2’ టీజర్ గ్లింప్స్ను ‘అవతార్-2’ రిలీజ్ రోజు వరల్డ్ వైడ్ వీలైనంత మేర ఆ సినిమా ఆడే థియేటర్లలో ఇంటర్వెల్లో ప్రదర్శించేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దాదాపు 25 భాషల్లో ఈ టీజర్ గ్లింప్స్ లాంచ్ చేయబోతున్నారట. ‘పుష్ప-2’ సినిమాకు ఇది బ్యాంగ్ బ్యాంగ్ స్టార్ట్ అవుతుందనడంలో సందేహం లేదు. ఒకేసారి సినిమా మీద హైప్ మరిన్ని రెట్లు పెరిగేలా సుకుమార్ ఈ టీజర్ గ్లింప్స్ను తీర్చిదిద్దడంతో పాటు దీని రీచ్ ఒక రేంజిలో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది దసరాకు రిలీజయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.
This post was last modified on November 4, 2022 4:30 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…