టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ కావాలంటే రాజమౌళితోనే సినిమా చేయాల్సిన అవసరం లేదని చాటి చెప్పాడు అల్లు అర్జున్. ‘పుష్ప’ మూవీతో అతను అనూహ్యంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ సినిమా తెలుగేతర భాషల్లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్నందుకుంది. ముఖ్యంగా హిందీలో ఆ సినిమా ఏకంగా వంద కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టి అక్కడి ట్రేడ్ పండిట్లను షాక్కు గురి చేసింది.
ఈ సినిమాలో బన్నీ మేనరిజమ్స్, డైలాగ్స్ వరల్డ్ లెవెల్లో పాపులర్ అయ్యాయి. మెడ కింద చెయ్యి పెట్టి తగ్గేదేలే అంటూ చెప్పే డైలాగ్ ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. ఈ పాపులారిటీ ‘పుష్ప-2’ బిజినెస్కు బాగా కలిసొస్తోంది. ఈ సినిమాకు ఉన్న హైప్ను ఇంకా పెంచేందుకు ముందు నుంచి మార్కెటింగ్ గట్టిగా చేయడానికి రెడీ అవుతోంది చిత్ర బృందం. ఒక బ్యాంగ్ బ్యాంగ్ వీడియో ప్రోమోతో ‘పుష్ప-2’ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడట సుకుమార్.
నేరుగా ‘పుష్ప-2’ టాకీ పార్ట్ చిత్రీకరణ మొదలుపెట్టకుండా.. టీజర్ గ్లింప్స్ కోసం విజువల్స్ తీయబోతున్నాడట సుకుమార్. ఇంకొన్ని రోజుల్లోనే రామోజీ ఫిలిం సిటీలో ఈ షూట్ జరగబోతోంది. కొన్ని రోజుల పాటు ఈ షాట్స్ చిత్రీకరించి.. దాన్ని ఎడిటింగ్కు పంపించి ఆ తర్వాత రెగ్యులర్ షూట్లోకి వెళ్లనున్నారట.
‘పుష్ప-2’ టీజర్ గ్లింప్స్ను ‘అవతార్-2’ రిలీజ్ రోజు వరల్డ్ వైడ్ వీలైనంత మేర ఆ సినిమా ఆడే థియేటర్లలో ఇంటర్వెల్లో ప్రదర్శించేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దాదాపు 25 భాషల్లో ఈ టీజర్ గ్లింప్స్ లాంచ్ చేయబోతున్నారట. ‘పుష్ప-2’ సినిమాకు ఇది బ్యాంగ్ బ్యాంగ్ స్టార్ట్ అవుతుందనడంలో సందేహం లేదు. ఒకేసారి సినిమా మీద హైప్ మరిన్ని రెట్లు పెరిగేలా సుకుమార్ ఈ టీజర్ గ్లింప్స్ను తీర్చిదిద్దడంతో పాటు దీని రీచ్ ఒక రేంజిలో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది దసరాకు రిలీజయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం విడుదల తేదీకి అఫీషియల్ ముద్ర పడిపోయింది. అక్టోబర్ 2…
హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ సమీప రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా నామకరణం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం…
అదేంటో గానీ… పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కు ఎటు వెళ్లినా విమర్శల జడివానే తప్పడం లేదు. సాధారణ…
ప్రస్తుత జెన్ జీ, జెన్ ఆల్ఫా వర్గానికి చెందిన యువతలానే నేనూ జెన్ జీని అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు…
డ్రాగన్ విడుదల ఇంకా సంవత్సరం ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కాలం భారంగా గడిచిపోతోంది. ఒకవేళ వార్ 2 బ్లాక్…
అమరావతిలోని ఉండవల్లిలో వైసీపీ నాయకుల పర్యటన ఉద్రిక్తతంగా మారింది. ఆ పర్యటనను రాజధాని రైతులు, టీడీపీ వర్గాలు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి.…