పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలన్నీ నత్తనడకన షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. వకీల్ సాబ్ కూడా గ్యాపులు గ్యాపులుగా షూటింగ్ చేశారు. ఇక భీమ్లా నాయక్ కి కూడా అదే జరిగింది. పాలిటిక్స్ లో పవన్ బిజీ ఉండటంతో సినిమా షూటింగ్ లకు ఎక్కువ డేట్స్ కేటాయించలేకపోతున్నాడు పవన్. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా ‘హరి హర వీరమల్లు’ కి కూడా ఎక్కువ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడు. ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో పవన్ మరింత బిజీగా ఉంటున్నాడు. దీంతో సినిమా వ్యయం రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. నిర్మాతను వడ్డీ భారం భయపెడుతుంది.
అందుకే లేటెస్ట్ గా పవన్ ఓ డిసిషన్ తీసుకొని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు. వీలైనన్ని డేట్స్ ఇచ్చి సినిమాను కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. ఇటివలే షూటింగ్ మొదలు పెట్టాడు. దానికి ముందు వారం పాటు రిహార్సల్స్ కూడా చేసాడు. అంటే పవన్ ఈ సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టేశాడన్నమాట. నిజానికి పవన్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా డిలే చేస్తూ వచ్చాడు. పవన్ సరైన డేట్స్ ఇవ్వకపోవడంతో షూటింగ్ బ్రేకులు బ్రేకులుగా సాగింది. మిగతా యాక్టర్స్ డేట్స్ కూడా వృదా అయ్యాయి.
ఎట్టకేలకు పవన్ నిర్మాతలపై పడుతున్న భారం తెలుసుకున్నాడో ఏమో కానీ ఈ సినిమా కోసం అడిగినన్ని డేట్స్ ఇచ్చే ఇకపై ఎలాంటి గ్యాప్ లేకుండా చిన్న చిన్న బ్రేకులతో కంటిన్యూ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. ఇక పవన్ కి అటు రాజకీయంగానూ ఇది కీలక సమయమే ఎలక్షన్స్ హడావుడి అప్పుడే మొదలైపోయింది. ఎవరి వ్యూహాలు వారి రెడీ చేసుకుంటున్నారు. పవన్ మాత్రం వీరమల్లు పూర్తయ్యాకే పాలిటిక్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని భావిస్తున్నాడు. మరి పవర్ స్టార్ ఇదే ప్లానింగ్ కి స్టిక్ అయితే ఫ్యాన్స్ తొందర్లోనే వీరమల్లు ను స్క్రీన్ పై చూడొచ్చు.
This post was last modified on November 3, 2022 9:45 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…