ప్రపంచవ్యాప్తంగా అవతార్ 2 ఫీవర్ మాములుగా లేదు. ఇప్పటికిప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ పెట్టినా వరల్డ్ వైడ్ కలెక్షన్ వందల కోట్లు వచ్చేలా ఉంది. దీని ప్రభావం అన్ని బాషల కొత్త రిలీజుల మీద తీవ్రంగా ఉండబోతోందని ట్రేడ్ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఉదాహరణకు కేరళ ఎగ్జిబిటర్ల సమాఖ్య డిసెంబర్ 16న దీనికి సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందట. అదే జరిగితే మల్లువుడ్ కు చాలా కీలకమైన క్రిస్మస్ అడ్వాంటేజ్ అవతారే తీసుకుంటుంది. మనకు సంక్రాంతి ఎలాగో వాళ్లకు ఆ పండగ అంతకన్నా ఎక్కువ.
అందుకే స్టార్లు మొదలుకుని చిన్న హీరోల దాకా ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆ సీజన్ ని వదులుకునేందుకు ఇష్టపడరు. మరి అవతార్ 2 కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే విద్యాధికులు ఎక్కువగా ఉండే ఆ రాష్ట్రంలో క్లాసు మాస్ తేడా లేకుండా అందరూ దాని మీదే ఎగబడతారు. అక్కడిదో పెద్ద సమస్య అయ్యిందని టాక్. మిగిలిన చోట్ల కూడా పరిస్థితి ఏమంత భిన్నంగా లేదు. నిన్నటి దాకా రణ్వీర్ సింగ్ సర్కస్ అవుట్ ఫుట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉండి డిసెంబర్ 23 రిలీజ్ కు రెడీ అన్న దర్శక నిర్మాత రోహిత్ శెట్టి డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడికి పునరాలోచన చేస్తున్నాడట.
ఇక తెలుగు విషయానికి వస్తే అవతార్ 2 వచ్చిన ఆ పై వారంలో రవితేజ ధమాకా, నిఖిల్ 18 పేజెస్ లు ప్రస్తుతానికి బెర్తులు కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఇంకో ఒకటో రెండో తోడయ్యే ఛాన్స్ లేకపోలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి ఆల్రెడీ వంద కోట్ల దాకా బిజినెస్ జరగొచ్చనే అంచనా ఉంది. అదే నిజమైతే రెండో వారానికే స్క్రీన్లు తగ్గించే సీన్ ఉండదు. ట్రైలర్ చూశాక హైప్ ఇంతకు పదింతలు ఉంటుందని ఇప్పటికే టాక్ ఉంది. ఏది ఏమైనా అవెంజర్స్ ఎండ్ గేమ్, స్పైడర్ నో వే హోమ్ ని మించిన బజ్ ఈ అవతార్ 2కు కనిపిస్తోంది. పన్నెండేళ్ల తర్వాత సీక్వెల్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…