ప్రపంచవ్యాప్తంగా అవతార్ 2 ఫీవర్ మాములుగా లేదు. ఇప్పటికిప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ పెట్టినా వరల్డ్ వైడ్ కలెక్షన్ వందల కోట్లు వచ్చేలా ఉంది. దీని ప్రభావం అన్ని బాషల కొత్త రిలీజుల మీద తీవ్రంగా ఉండబోతోందని ట్రేడ్ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఉదాహరణకు కేరళ ఎగ్జిబిటర్ల సమాఖ్య డిసెంబర్ 16న దీనికి సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందట. అదే జరిగితే మల్లువుడ్ కు చాలా కీలకమైన క్రిస్మస్ అడ్వాంటేజ్ అవతారే తీసుకుంటుంది. మనకు సంక్రాంతి ఎలాగో వాళ్లకు ఆ పండగ అంతకన్నా ఎక్కువ.
అందుకే స్టార్లు మొదలుకుని చిన్న హీరోల దాకా ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆ సీజన్ ని వదులుకునేందుకు ఇష్టపడరు. మరి అవతార్ 2 కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే విద్యాధికులు ఎక్కువగా ఉండే ఆ రాష్ట్రంలో క్లాసు మాస్ తేడా లేకుండా అందరూ దాని మీదే ఎగబడతారు. అక్కడిదో పెద్ద సమస్య అయ్యిందని టాక్. మిగిలిన చోట్ల కూడా పరిస్థితి ఏమంత భిన్నంగా లేదు. నిన్నటి దాకా రణ్వీర్ సింగ్ సర్కస్ అవుట్ ఫుట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉండి డిసెంబర్ 23 రిలీజ్ కు రెడీ అన్న దర్శక నిర్మాత రోహిత్ శెట్టి డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడికి పునరాలోచన చేస్తున్నాడట.
ఇక తెలుగు విషయానికి వస్తే అవతార్ 2 వచ్చిన ఆ పై వారంలో రవితేజ ధమాకా, నిఖిల్ 18 పేజెస్ లు ప్రస్తుతానికి బెర్తులు కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఇంకో ఒకటో రెండో తోడయ్యే ఛాన్స్ లేకపోలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి ఆల్రెడీ వంద కోట్ల దాకా బిజినెస్ జరగొచ్చనే అంచనా ఉంది. అదే నిజమైతే రెండో వారానికే స్క్రీన్లు తగ్గించే సీన్ ఉండదు. ట్రైలర్ చూశాక హైప్ ఇంతకు పదింతలు ఉంటుందని ఇప్పటికే టాక్ ఉంది. ఏది ఏమైనా అవెంజర్స్ ఎండ్ గేమ్, స్పైడర్ నో వే హోమ్ ని మించిన బజ్ ఈ అవతార్ 2కు కనిపిస్తోంది. పన్నెండేళ్ల తర్వాత సీక్వెల్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి.
This post was last modified on November 2, 2022 11:24 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…