మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్లాన్ చేసుకున్న సినిమా క్యాన్సిల్ కావడం ఫ్యాన్స్ కి ఒకింత రిలీఫ్ నే ఇచ్చింది. సెన్సిబుల్ కథలనే బాగా చెప్పగలడన్న పేరు తెచ్చుకున్న గౌతమ్ ప్యాన్ ఇండియా ఇమేజ్ తో ఇప్పుడు లెక్కలు మారిపోయిన చరణ్ ను ఎలా డీల్ చేస్తాడన్న అనుమానం వాళ్లలో ముందు నుంచి ఉంది. పైగా జెర్సీ హిందీ రీమేక్ దారుణంగా డిజాస్టర్ కావడం ఆ భయాన్ని ఇంకాస్త పెంచింది. వాస్తవానికి గౌతమ్ రెడీ చేసుకున్నది యాక్షన్ సబ్జెక్టే. ఫైనల్ వెర్షన్ ని చరణ్ మెచ్చేలా నెరేట్ చేయకపోవడంతో ఆగిపోయిందని మెగా కాంపౌండ్ న్యూస్.
సరే గౌతమ్ ది తేలిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వెంకీ కుడుముల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. డివివి దానయ్య నిర్మాణంలో చిరంజీవి హీరోగా ఈ ప్రాజెక్టు నెలల క్రితమే ప్రకటించారు. అయితే వెంకీ సైతం మెగాస్టార్ ని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోతున్నాడనే వార్తలు గట్టిగానే చక్కర్లు కొట్టాయి. నేరుగా అడుగుదామంటే అతను బయట కనిపించడం బొత్తిగా తగ్గించేశాడు. గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాబీ, మెహర్ రమేష్ లు ఉన్నారు కానీ వెంకీ కుడుముల మాత్రం అడ్రెస్ లేడు. ఆచార్యతో మొదలుపెడితే ఏ ప్రమోషన్ లోనూ చిరంజీవి తన ప్రస్తావన తీసుకురాలేదు.
ఒకవేళ నిజంగా నో అనుకుంటే అదేదో వీలైనంత త్వరగా బయటికి చెప్పేస్తే ఫ్యాన్స్ కి క్లారిటీ ఉంటుంది. భీష్మ లాంటి పెద్ద హిట్టు ఇచ్చాక కూడా వెంకీ కుడుములకు ఇంత గ్యాప్ రావడం కరెక్ట్ కాదు. మీడియం రేంజ్ హీరోలకు అసలే డైరెక్టర్లు దొరక్క సరైన కథలు లేని డెబ్యూ దర్శకులను నమ్ముకుని ఫ్లాపులు చూస్తున్నారు. అలాంటిది కుడుముల టైమింగ్ ని వాడుకోకపోవడం కరెక్ట్ కాదు. పైగా త్రివిక్రమ్ శిష్యుడాయే. ఇవన్నీ చూస్తుంటే ఒకప్పుడు దాసరి నారాయణరావు, కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు లాంటి అగ్రదర్శకులు ఏడాదికి అయిదారు ఎలా చేసేవారో అనిపిస్తుంది కదూ.
This post was last modified on November 2, 2022 6:53 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…