మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్లాన్ చేసుకున్న సినిమా క్యాన్సిల్ కావడం ఫ్యాన్స్ కి ఒకింత రిలీఫ్ నే ఇచ్చింది. సెన్సిబుల్ కథలనే బాగా చెప్పగలడన్న పేరు తెచ్చుకున్న గౌతమ్ ప్యాన్ ఇండియా ఇమేజ్ తో ఇప్పుడు లెక్కలు మారిపోయిన చరణ్ ను ఎలా డీల్ చేస్తాడన్న అనుమానం వాళ్లలో ముందు నుంచి ఉంది. పైగా జెర్సీ హిందీ రీమేక్ దారుణంగా డిజాస్టర్ కావడం ఆ భయాన్ని ఇంకాస్త పెంచింది. వాస్తవానికి గౌతమ్ రెడీ చేసుకున్నది యాక్షన్ సబ్జెక్టే. ఫైనల్ వెర్షన్ ని చరణ్ మెచ్చేలా నెరేట్ చేయకపోవడంతో ఆగిపోయిందని మెగా కాంపౌండ్ న్యూస్.
సరే గౌతమ్ ది తేలిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వెంకీ కుడుముల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. డివివి దానయ్య నిర్మాణంలో చిరంజీవి హీరోగా ఈ ప్రాజెక్టు నెలల క్రితమే ప్రకటించారు. అయితే వెంకీ సైతం మెగాస్టార్ ని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోతున్నాడనే వార్తలు గట్టిగానే చక్కర్లు కొట్టాయి. నేరుగా అడుగుదామంటే అతను బయట కనిపించడం బొత్తిగా తగ్గించేశాడు. గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాబీ, మెహర్ రమేష్ లు ఉన్నారు కానీ వెంకీ కుడుముల మాత్రం అడ్రెస్ లేడు. ఆచార్యతో మొదలుపెడితే ఏ ప్రమోషన్ లోనూ చిరంజీవి తన ప్రస్తావన తీసుకురాలేదు.
ఒకవేళ నిజంగా నో అనుకుంటే అదేదో వీలైనంత త్వరగా బయటికి చెప్పేస్తే ఫ్యాన్స్ కి క్లారిటీ ఉంటుంది. భీష్మ లాంటి పెద్ద హిట్టు ఇచ్చాక కూడా వెంకీ కుడుములకు ఇంత గ్యాప్ రావడం కరెక్ట్ కాదు. మీడియం రేంజ్ హీరోలకు అసలే డైరెక్టర్లు దొరక్క సరైన కథలు లేని డెబ్యూ దర్శకులను నమ్ముకుని ఫ్లాపులు చూస్తున్నారు. అలాంటిది కుడుముల టైమింగ్ ని వాడుకోకపోవడం కరెక్ట్ కాదు. పైగా త్రివిక్రమ్ శిష్యుడాయే. ఇవన్నీ చూస్తుంటే ఒకప్పుడు దాసరి నారాయణరావు, కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు లాంటి అగ్రదర్శకులు ఏడాదికి అయిదారు ఎలా చేసేవారో అనిపిస్తుంది కదూ.
This post was last modified on November 2, 2022 6:53 pm
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…