ఒకే యాక్టర్ కి చెందిన రెండు సినిమాలు ఒకే వారంలో రిలీజ్ అవ్వడం చాలా అరుదుగా చూస్తుంటాం. వచ్చే సంక్రాంతికి హీరోయిన్ శృతి హాసన్ నటించిన రెండు సినిమాలు ఒకే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. చిరంజీవి తో శృతి హాసన్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటిస్తుంది. అలాగే మరో వైపు బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ లో కూడా శృతి హాసన్ నే హీరోయిన్. ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్న విషయం తెలిసిందే. ఇంకా రిలీజ్ డేట్స్ ఫిక్స్ కాలేదు కానీ ఒకే వారంలో రోజుల గ్యాప్ లో ఈ రెండూ థియేటర్స్ లోకి రావడం పక్కా అని తెలుస్తుంది.
అయితే ఈ రెండు సినిమాల సక్సెస్ శృతి హాసన్ కి చాలా ముఖ్యం. ఇటు చిరు అటు బాలయ్య రెండు బడా సినిమాలతో సంక్రాంతి డబుల్ బొనంజా కొడితే శృతి హాసన్ కి డిమాండ్ బాగా పెరుగుతుంది. అలాగే ఇద్దరితోనూ శృతి ఫస్ట్ టైం జోడీ కట్టింది. రెండూ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇద్దరికీ శృతి సెంటిమెంట్ గా మారిపోతుంది.
ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో మరో బడా సినిమా కూడా ఉంది. ప్రభాస్ ‘సలార్’ లో కూడా శృతి నే హీరోయిన్. ఆ సినిమా కూడా వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రాబోతుంది. సంక్రాంతి కి రెండు బ్లాక్ బస్టర్స్ అలాగే సలార్ తో ఇంకో బ్లాక్ బస్టర్ కొడితే 2023 శృతి నామ సంవత్సరం అయిపోతుంది. మరి శృతి హాసన్ ఈ రేర్ ఫీట్ టచ్ చేసి హ్యాట్రిక్ సాదిస్తే ఇక అమ్మడుకి తెలుగులో ఇంకొన్నేళ్ళ పాటు తిరుగుండదు.
This post was last modified on November 2, 2022 11:14 am
ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు…
సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్…
బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…