సక్సెస్ ఉన్న హీరోకి ఏ ఇండస్ట్రీలో అయినా తిరుగుండదు. అయితే విశ్వక్ సేన్ మాత్రం ఇందుకు మినహాయింపు అనుకోవచ్చు. అవును ఫలక్ నుమా దాస్ తర్వాత విశ్వక్ కి ఇంత వరకూ సరైన హిట్ పడలేదు. హిట్ ఒక్కటే ఓ మోస్తరుగా ఆడింది. ‘పాగల్’ డిజాస్టర్ అనిపించుకోగా , ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ పర్లేదు అనే టాక్ అందుకుంది కానీ ఫైనల్ గా కలెక్షన్స్ తెచ్చిపెట్టలేకపోయింది.
ఇక రీసెంట్ గా విశ్వక్ తమిళ్ లో సూపర్ హిట్టయిన ‘ఓ మై కడవులే’ సినిమాను ‘ఓరి దేవుడా’ పేరుతో రీమేక్ చేసి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ ఆ సినిమా కూడా పనవ్వలేదు. దీపావళి స్పెషల్ గా వచ్చిన ఈ సినిమా కనీసం మంచి ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది.
అయితే ఇవన్నీ విశ్వక్ కి ఎలాంటి ఇబ్బంది కలిగించడం లేదు. హిట్ , ఫ్లాప్ అనేది పట్టించుకోకుండా కుర్ర హీరోకి ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం విశ్వక్ సేన్ సొంత బేనర్ లో తనే దర్శకుడిగా ‘మాస్ కా దంకీ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటే అర్జున్ సార్జా దర్శకత్వంలో ఇంకో సినిమా చేస్తున్నాడు. తాజాగా మరో ప్రాజెక్ట్ కూడా లైనప్ లో పెట్టేశాడు. సాహిత్ అనే దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఓ పెద్ద బేనర్ లో రూపొందనుందని టాక్. ఇవి కాకుండా మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా డిస్కషన్స్ లో ఉన్నాయట.
ఇక మైత్రి , సితార సంస్థలు కూడా విశ్వక్ కి అడ్వాన్స్ లు ఇచ్చాయని టాక్ ఉంది. సో హిట్ లేకపోయినా విశ్వక్ డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. సరైన హిట్ పడితే ఈ యంగ్ హీరో చుట్టూ మరింత మంది నిర్మాతలు ఈగల్లా వాలడం ఖాయమనిపిస్తుంది. మరి ‘దాస్ కా దమ్కీ’ తో తనకి తనే హిట్ ఇంచుకుంటాడేమో చూడాలి.
This post was last modified on November 2, 2022 11:11 am
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…