జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా విషయంలో ఎడతెగని చర్చలే తప్ప.. ఇప్పటిదాకా ఆ సినిమా సెట్స్ మీదికే వెళ్లలేదు. ‘ఆర్ఆర్ఆర్’ పని పూర్తి చేసి ఏడాది కిందటే తారక్ ఫ్రీ అయిపోయినా ఇప్పటిదాకా తర్వాతి చిత్రాన్ని మొదలుపెట్టకపోవడంపై అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ సినిమాను అనౌన్స్ చేసి మాత్రం ఏడాదిన్నర దాటిపోయింది. ‘జనతా గ్యారేజ్’ తర్వాత మళ్లీ కొరటాలతో తారక్ సినిమా చేయబోతున్నాడని ముందు అభిమానులు చాలా ఎగ్జైట్ అయ్యారు కానీ.. గత కొన్ని నెలల్లో పరిణామాలు చూశాక మాత్రం వారిలో కంగారు మొదలైంది.
కొరటాల చివరి సినిమా ‘ఆచార్య’ డిజాస్టర్ కావడం, తారక్ కోసం స్క్రిప్టు తయారు చేసే పని ఎంతకీ తెగకపోవడం, ఈ స్క్రిప్టు సంతృప్తికరంగా రాలేదన్న ఊహాగానాలు తారక్ అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి. అసలీ సినిమా ఉంటుందా అన్న సందేహాలు కూడా ఒక దశలో వ్యక్తమైనప్పటికీ.. తారక్ దీనికే కట్టుబడి ఉన్నాడన్న సంకేతాలే అతడి వైపు నుంచి వచ్చాయి.
ఇలాంటి టైంలో ఎన్టీఆర్-కొరటాల సినిమా గురించి అప్డేట్ అంటూ ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో అందరూ హోరెత్తించేశారు. ఈ సినిమాకు టైటిల్ ఏమైనా ఖరారు చేశారేమో.. లేక ఫలానా రోజు సినిమా మొదలవుతుందని చెబుతారేమో అని అనుకుంటే.. చివరికి అలాంటిదేమీ లేకపోయింది. ఈ సినిమా క్యాన్సిల్ కాలేదు, త్వరలోనే మొదలవుతుంది అన్నదే ఈ అప్డేట్. ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలులతో కలిసి ప్రి ప్రొడక్షన్ పనులను కొరటాల పూర్తి చేసినట్లు, నవంబరు నెలాఖరు నుంచి ఈ సినిమా కోసం అనిరుధ్ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెడతాడని కూడా సమాచారం ఇచ్చారు.
ఐతే ఈ సినిమా క్యాన్సిల్ కాలేదు, ఉంది అని చెప్పడం కూడా ఒక అప్డేటేనా అని తారక్ ఫ్యాన్స్ నిట్టూరుస్తున్నారు. అసలు సినిమా రద్దయిందని ఎవరు ఫిక్సయ్యారు, ఖండిస్తూ అప్డేట్ ఇవ్వడానికి అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు తారక్ సమయాన్ని వృథా చేస్తారు.. సరిగ్గా సినిమాను ఎప్పుడు మొదలుపెడతారో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on October 31, 2022 3:38 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…