దర్శకుడు మారుతి ట్రాక్ రికార్డును పట్టించుకోకుండా అతడికి తనతో సినిమా చేసే అవకాశం కల్పించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఐతే మారుతి ఇప్పటిదాకా చేసినవన్నీ మిడ్ రేంజ్ సినిమాలే. అందులో కొన్ని బాగా ఆడాయి. కొన్ని తుస్సుమనిపించాయి. ‘మహానుభావుడు’ తర్వాత అయతే మారుతి ట్రాక్ రికార్డు ఏమీ బాగా లేదు. ‘ప్రతి రోజు పండగే’ చిత్రానికి ఏదో టైం కలిసి వచ్చి ఓ మోస్తరుగా ఆడేసింది. ‘మంచి రోజులు వచ్చాయి’ బోల్తా కొట్టింది. ‘పక్కా కమర్షియల్’ అయితే అడ్రస్ లేకుండా పోయింది.
ఇలాంటి దర్శకుడితో ప్రభాస్ సినిమా చేయడం ఏంటి అని అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటే.. కనీసం ఈ సినిమా ప్రారంభోత్సవం గురించి ఒక ప్రకటన చేయడానికి కూడా భయపడ్డారు. సినిమా గురించి ఏ రకమైనా ప్రకటన లేదు. ఏ అప్డేట్ ఇస్తే అభిమానులు ఎలా స్పందిస్తారో అని దర్శక నిర్మాతలు భయపడుతున్నట్లున్నారు.
తాజాగా మారుతి ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు అతిథిగా వచ్చాడు. ఆ సినిమా గురించి, హీరో సంతోష్ శోభన్ గురించి చాలా బాగా మాట్లాడాడు. ఐతే తన ప్రసంగాన్ని ముగించబోతుండగా.. సంతోష్ శోభన్ వచ్చి ఏమైనా అప్డేట్ ఇస్తారా అంటూ మారుతిని అడిగాడు. అతడి ఉద్దేశం ప్రభాస్ సినిమా గురించి ఏమైనా చెప్పమని.. దానికి మారుతి స్పందిస్తూ.. “ఫ్యాన్స్ నన్ను కొడతారు” అని నవ్వేసి ఆ సినిమా గురించి తాను మాట్లాడనని చెప్పకనే చెప్పేశాడు.
మారుతి సరదాగా స్పందించినా.. తాను ప్రభాస్తో సినిమా చేస్తుండడం పట్ల అభిమానుల్లో ఎంత వ్యతిరేకత ఉందో అతడికి బాగానే అర్థమైనట్లుంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఇటీవలే ప్రభాస్తో మారుతి సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. ఒక వారం రోజులకు పైగా తొలి షెడ్యూల్ నడిచింది. అందులో మూడు రోజులు ప్రభాస్ షూట్లో పాల్గొన్నాడు. మిగతా రోజులు వేరే నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరించారు.
This post was last modified on October 30, 2022 5:52 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…