నిన్న మధ్యాన్నం తన జబ్బు గురించి సమంత సోషల్ మీడియాలో ట్వీట్ చేసాక అభిమానులకే కాదు ఇండస్ట్రీలోనూ అది హాట్ టాపిక్ అయ్యింది. ఆ మధ్య కరణ్ జోహార్ టాక్ షోలో అక్షయ కుమార్ తో కలిసి పాల్గొన్నాక సామ్ మళ్ళీ బయట ఎక్కడా కనిపించలేదు. విజయ్ దేవరకొండతో చేస్తున్న ఖుషి షూటింగ్ వాయిదా పడ్డానికి కారణం తనేననే ప్రచారం జరిగినప్పటికీ ఆ వార్తను ఖండిస్తూ కానీ సమర్థిస్తూ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. తీరా హఠాత్తుగా తనకో వ్యాధి ఉందని చెప్పాక ఫ్యాన్స్ హతాశులయ్యారు. సామాన్యులు అసలెప్పుడూ వినని పేరుతో చికిత్స తీసుకుంటున్నానని చెప్పేసరికి షాక్ తిన్నారు.
త్వరగా లేదా కొంత టైం తీసుకునో సామ్ కోలుకోవడం కన్ఫర్మే. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ ఈ మయోసైటిస్ తీవ్రత మీద అవగాహన ఉన్న వాళ్ళు తక్కువ. ఇది కండరాల మీద ప్రభావం చూపించే జబ్బు. మహిళలు ఎక్కువగా దీని బారిన పడతారు. అయితే ఈ సైటిస్ క్యాటగిరీలో కొన్ని రకాలున్నాయి. ఒక విభాగంలో విపరీతమైన నీరసం లాంటి లక్షణాలు ఉంటే, మరోదాంట్లో చర్మంపై దద్దుర్లు లాంటివి తలెత్తుతాయి. ఇంకోటైపులో మోచేయి మోకాలు తదితర ప్రాంతాల్లో విపరీతమైన నొప్పి ఉంటుంది. వీటిలో సమంతా దేన్నుంచి సఫరవుతుందో వివరించలేదు కానీ వీటిలో ఒకటన్నది మాత్రం వాస్తవమే
సరైన వైద్యం అందకపోతేనే ఇది ప్రాణాల మీదకు తెస్తుంది. అయితే సామ్ కు ఆ ఇబ్బంది లేదు. అత్యున్నత ఆసుపత్రికలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది కాబట్టి స్పెషలిస్ట్ లు తనకేం చేస్తే త్వరగా నయమవుతుందో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కాకపోతే టైం మాత్రం అంత ఈజీగా చెప్పలేం. నెలల సమయం నిజమే. నవంబర్ 11 యశోద విడుదలయ్యాక వచ్చే ఏడాది ప్రారంభంలో శాకుంతలం రిలీజ్ ప్లాన్ చేశారు. బాలన్స్ షూట్ పూర్తయితే వేసవిలో ఖుషి థియేటర్లలో వస్తుంది. పూర్తిగా కోలుకున్నాక వెబ్ సిరీస్ లు మొదలవుతాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా సెలబ్రిటీలు తన రికవరీకి విషెస్ చెబుతున్నారు
This post was last modified on October 30, 2022 2:08 pm
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…