నిన్న మధ్యాన్నం తన జబ్బు గురించి సమంత సోషల్ మీడియాలో ట్వీట్ చేసాక అభిమానులకే కాదు ఇండస్ట్రీలోనూ అది హాట్ టాపిక్ అయ్యింది. ఆ మధ్య కరణ్ జోహార్ టాక్ షోలో అక్షయ కుమార్ తో కలిసి పాల్గొన్నాక సామ్ మళ్ళీ బయట ఎక్కడా కనిపించలేదు. విజయ్ దేవరకొండతో చేస్తున్న ఖుషి షూటింగ్ వాయిదా పడ్డానికి కారణం తనేననే ప్రచారం జరిగినప్పటికీ ఆ వార్తను ఖండిస్తూ కానీ సమర్థిస్తూ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. తీరా హఠాత్తుగా తనకో వ్యాధి ఉందని చెప్పాక ఫ్యాన్స్ హతాశులయ్యారు. సామాన్యులు అసలెప్పుడూ వినని పేరుతో చికిత్స తీసుకుంటున్నానని చెప్పేసరికి షాక్ తిన్నారు.
త్వరగా లేదా కొంత టైం తీసుకునో సామ్ కోలుకోవడం కన్ఫర్మే. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ ఈ మయోసైటిస్ తీవ్రత మీద అవగాహన ఉన్న వాళ్ళు తక్కువ. ఇది కండరాల మీద ప్రభావం చూపించే జబ్బు. మహిళలు ఎక్కువగా దీని బారిన పడతారు. అయితే ఈ సైటిస్ క్యాటగిరీలో కొన్ని రకాలున్నాయి. ఒక విభాగంలో విపరీతమైన నీరసం లాంటి లక్షణాలు ఉంటే, మరోదాంట్లో చర్మంపై దద్దుర్లు లాంటివి తలెత్తుతాయి. ఇంకోటైపులో మోచేయి మోకాలు తదితర ప్రాంతాల్లో విపరీతమైన నొప్పి ఉంటుంది. వీటిలో సమంతా దేన్నుంచి సఫరవుతుందో వివరించలేదు కానీ వీటిలో ఒకటన్నది మాత్రం వాస్తవమే
సరైన వైద్యం అందకపోతేనే ఇది ప్రాణాల మీదకు తెస్తుంది. అయితే సామ్ కు ఆ ఇబ్బంది లేదు. అత్యున్నత ఆసుపత్రికలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది కాబట్టి స్పెషలిస్ట్ లు తనకేం చేస్తే త్వరగా నయమవుతుందో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కాకపోతే టైం మాత్రం అంత ఈజీగా చెప్పలేం. నెలల సమయం నిజమే. నవంబర్ 11 యశోద విడుదలయ్యాక వచ్చే ఏడాది ప్రారంభంలో శాకుంతలం రిలీజ్ ప్లాన్ చేశారు. బాలన్స్ షూట్ పూర్తయితే వేసవిలో ఖుషి థియేటర్లలో వస్తుంది. పూర్తిగా కోలుకున్నాక వెబ్ సిరీస్ లు మొదలవుతాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా సెలబ్రిటీలు తన రికవరీకి విషెస్ చెబుతున్నారు
This post was last modified on October 30, 2022 2:08 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…