లైగర్ తాలూకు ఆర్థిక వ్యవహారాలు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాక ఇండస్ట్రీలో దీని గురించి పలురకాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఇంతకు మించిన ఫ్లాపులు నష్టాలు వచ్చినప్పటికీ ఈ స్థాయిలో ఏవీ బజారుకెక్కపోవడంతో పూరి చేసింది రైటా లేక డిస్ట్రిబ్యూటర్లది కరెక్టా అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. హీరో మార్కెట్ కి మించి అత్యాశకు పోయి ఎక్కువ పెట్టుబడి ఇన్వెస్ట్ చేసిన కోణంలో పంపిణీదారులు చేసింది తప్పయితే, మసిపూసి మారేడుకాయని చేసినట్టు లోకల్ ప్రోడక్ట్ ని అంతర్జాతీయ వస్తువుగా ఓవర్ పబ్లిసిటీ ఇచ్చిన పూరి బృందానిది కూడా అంతే మిస్టేక్. మొత్తానికి ఈ వివాదం పూరి మీద గట్టి ప్రభావమే చూపించింది.
ఏకంగా తన ట్విట్టర్ అకౌంట్ ని డిలీట్ చేసేశాడు. మిలియన్ల ఫాలోయర్స్ ఉన్న వెరిఫైడ్ హ్యాండిల్ ఇది. తాను మోసం చేసింది నమ్మి టికెట్లు కొన్న ఆడియన్స్ నే తప్ప ఇంకెవరిని కాదనే ఉద్దేశంతో బయటికి వదిలిన ఒక నోట్ లో పూరి విజయాలు ఓటముల గురించి చాలా క్యాలికులేటెడ్ సిద్ధాంతాలు మాట్లాడాడు. అందరూ చివరికి కలుసుకునేది స్మశానంలోనేనని, ఎవరూ డబ్బును వెంటేసుకుని పోరని చెప్పిన మాటలు అభిమానులను కదిలిస్తున్నాయి. పూరిలో రియలైజేషన్ కనిపిస్తోంది. తాను నేరం చేయకపోయినా ఈ స్థాయిలో టార్గెట్ చేయడం పట్ల ఆవేదన ఆ వ్యాఖ్యల్లో కనిపిస్తోంది.
ఒకపక్క లైగర్ కాంట్రావర్సీలు, జనగణమన ఆగిపోవడం, కొత్త ప్రాజెక్టు కోసం హీరోలెవరూ అంత సుముఖంగా లేకపోవడం, కొడుకు ఆకాష్ ఇంకా సెటిల్ కాకపోవడం, పూరి వ్యక్తిగత జీవితం గురించి బయట రకరకాల కామెంట్లు వినిపించడం ఇలా ఒక పద్మవ్యూహంలో ఉన్నాడు ఈ కల్ట్ డైరెక్టర్. ఒకప్పుడు హీరోలను స్టార్లుగా మార్చే ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన దర్శకుడికి ఈ పరిస్థితి రావడం ఫ్యాన్స్ కి బాధ కలిగించేదే. కింద పడేది లేచేందుకే అనే సూత్రాన్ని బలంగా నమ్మే పూరి గట్టిగా తలుచుకుని తనలో రచయితకు దర్శకుడికి సరైన పని కల్పిస్తే బౌన్స్ బ్యాక్ అవ్వడం ఎంతసేపు. దానికోసమే అందరూ వెయిటింగ్.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…