Movie News

కాంతార మొదటి హీరో రిషబ్ కాదు

వరల్డ్ వైడ్ సెన్సేషనల్ వసూళ్లతో దుమ్ము దులుపుతున్న కాంతార పుణ్యమాని మొన్నటి దాకా బయటవాళ్ళకు పెద్దగా పరిచయం లేని దర్శకుడు కం హీరో రిషబ్ శెట్టి ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి ప్రత్యక్షంగా ప్రశంసలు అందుకునే రేంజ్ కు వెళ్ళాడు. తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా ఆడుతుండటంతో ప్రత్యేకంగా రోడ్ మ్యాప్ వేసుకుని మరీ ఏపీ తెలంగాణ థియేటర్లలో ప్రేక్షకులను కలుసుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్లినా క్లైమాక్స్ లో అతని పెర్ఫార్మన్స్ గురించి తప్ప మరో అంశం గురించి మాట్లాడితే ఒట్టు. అంతగా కనెక్ట్ అయిపోయిన కాంతారకు ముందు అనుకున్న హీరో వేరు.

ఈ రిషబ్ శెట్టి వెనుక పెద్ద కథే ఉంది. నానా కష్టాలు పడి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి అనక కెమెరా సహాయకుడిగా మారి ఒక దర్శకుడి చేతిలో అవమానం పాలై ఇలా ఎన్నో అడ్డంకులు దాటుకున్న తర్వాతే ఈ స్థితికి వచ్చాడు. కాంతారను పెద్ద స్కేల్ లో నిర్మించాలని అనుకున్నప్పుడు హోంబాలే ఫిలింస్ తప్ప ఇంత బడ్జెట్ కు ఎవరూ న్యాయం చేయలేరని వాళ్ళను కలిశాడు. స్క్రిప్ట్ రాసుకున్న టైంలో రిషబ్ మనసులో ఉన్న హీరో పునీత్ రాజ్ కుమార్. ఫైనల్ వెర్షన్ పూర్తయ్యాక వెళ్లి వినిపించాడు. దేవుడు ఆవహించినట్టు రాశావని నువ్వే నటిస్తేనే దీనికి న్యాయం జరుగుతుందని చెప్పి రిషబ్ ని ఒప్పించింది పునీతే.

ఒకవేళ కన్నడ పవర్ స్టార్ ఇది చేసేందుకు ఒప్పుకుని ఉంటే ఫలితం ఇలాగే ఉండేదేమో కానీ రిషబ్ లోని అత్యద్భుతమైన యాక్టర్ ప్రపంచానికి తెలిసే వాడు కాదు. కానీ పునీత్ కు ఒక్క గొప్ప ల్యాండ్ మార్క్ మూవీ చివరి చిత్రంగా మిగిలిపోయేది. అయినా విధి రాత అలా ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు కానీ ఇప్పుడీ కాంతార ప్రభావం వల్ల రిషబ్ డైరెక్ట్ చేసిన గత చిత్రం సాహిప్రషాల కాసారగోడుతో పాటు ఇతను నటించిన గరుడగమన వృషభ వాహనలను తెలుగులో డబ్బింగ్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతే మరి హిట్టు పడితే ఎఫెక్ట్ ఇలాగే ఉంటుంది.

This post was last modified on October 30, 2022 11:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

1 hour ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

1 hour ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago