వరల్డ్ వైడ్ సెన్సేషనల్ వసూళ్లతో దుమ్ము దులుపుతున్న కాంతార పుణ్యమాని మొన్నటి దాకా బయటవాళ్ళకు పెద్దగా పరిచయం లేని దర్శకుడు కం హీరో రిషబ్ శెట్టి ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి ప్రత్యక్షంగా ప్రశంసలు అందుకునే రేంజ్ కు వెళ్ళాడు. తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా ఆడుతుండటంతో ప్రత్యేకంగా రోడ్ మ్యాప్ వేసుకుని మరీ ఏపీ తెలంగాణ థియేటర్లలో ప్రేక్షకులను కలుసుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్లినా క్లైమాక్స్ లో అతని పెర్ఫార్మన్స్ గురించి తప్ప మరో అంశం గురించి మాట్లాడితే ఒట్టు. అంతగా కనెక్ట్ అయిపోయిన కాంతారకు ముందు అనుకున్న హీరో వేరు.
ఈ రిషబ్ శెట్టి వెనుక పెద్ద కథే ఉంది. నానా కష్టాలు పడి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి అనక కెమెరా సహాయకుడిగా మారి ఒక దర్శకుడి చేతిలో అవమానం పాలై ఇలా ఎన్నో అడ్డంకులు దాటుకున్న తర్వాతే ఈ స్థితికి వచ్చాడు. కాంతారను పెద్ద స్కేల్ లో నిర్మించాలని అనుకున్నప్పుడు హోంబాలే ఫిలింస్ తప్ప ఇంత బడ్జెట్ కు ఎవరూ న్యాయం చేయలేరని వాళ్ళను కలిశాడు. స్క్రిప్ట్ రాసుకున్న టైంలో రిషబ్ మనసులో ఉన్న హీరో పునీత్ రాజ్ కుమార్. ఫైనల్ వెర్షన్ పూర్తయ్యాక వెళ్లి వినిపించాడు. దేవుడు ఆవహించినట్టు రాశావని నువ్వే నటిస్తేనే దీనికి న్యాయం జరుగుతుందని చెప్పి రిషబ్ ని ఒప్పించింది పునీతే.
ఒకవేళ కన్నడ పవర్ స్టార్ ఇది చేసేందుకు ఒప్పుకుని ఉంటే ఫలితం ఇలాగే ఉండేదేమో కానీ రిషబ్ లోని అత్యద్భుతమైన యాక్టర్ ప్రపంచానికి తెలిసే వాడు కాదు. కానీ పునీత్ కు ఒక్క గొప్ప ల్యాండ్ మార్క్ మూవీ చివరి చిత్రంగా మిగిలిపోయేది. అయినా విధి రాత అలా ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు కానీ ఇప్పుడీ కాంతార ప్రభావం వల్ల రిషబ్ డైరెక్ట్ చేసిన గత చిత్రం సాహిప్రషాల కాసారగోడుతో పాటు ఇతను నటించిన గరుడగమన వృషభ వాహనలను తెలుగులో డబ్బింగ్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతే మరి హిట్టు పడితే ఎఫెక్ట్ ఇలాగే ఉంటుంది.
This post was last modified on October 30, 2022 11:52 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…