మెగాస్టార్ చిరంజీవి స్టార్ డమ్ గురించి, ఆయన నటనా కౌశలం గురించి.. ఇంకా డ్యాన్సులు, ఫైట్లలో ఆయన చూపించే గ్రేస్ గురించి, వ్యక్తిగా ఆయన గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పట్నుంచో అందరూ ఆయన్ని చూస్తున్నారు. కానీ ఈ జనరేషన్కు చిరు గురించి అంతగా తెలియకపోవచ్చు. అలాంటి వాళ్లకు చిరును అభిమానించే వాళ్లు ఆయన గురించి కథలు కథలుగా చెబుతుంటారు.
ఐతే బయటి వారి సంగతేమో కానీ.. తన కుటుంబంలోనే కొత్త తరం పిల్లలకు తన గురించి పెద్దగా తెలియకపోవడం పట్ల తాను కొంచెం బాధపడ్డానని, అందుకే వారి దగ్గర సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సి వచ్చిందని చిరు తాజాగా జర్నలిస్ట్ ప్రభు రాసిన ఒక పుస్తకావిష్కరణ సభలో చెప్పడం విశేషం. ఈ అనుభవం గురించి ఆయనేమన్నారంటే..
“మా ఇంట్లో నా మనవళ్లు, మనవరాళ్లు ఎప్పుడు చూసినా చరణ్, తేజ్, వైష్ణవ్ సినిమాలు, పాటలే చూస్తున్నారు. నా సినిమాల గురించీ, నా పాటల గురించీ ఎవరూ పట్టించుకోరు. దాంతో నా మనసులో ఒకరకమైన జెలసీ ఫీలింగ్ కలిగింది. అప్పుడు వాళ్లందరినీ కూర్చొబెట్టుకుని నా గురించి నేనే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ టైంలో వాళ్లందరికీ ఒకప్పటి నా సినిమాలు, పాటలు చూపించా. భయ్యా ఇది నువ్వా.. అంటూ వాళ్లంతా ఆశ్చర్యపోయారు. నా వయసు పెరిగినప్పటికీ పిల్లలంతా నన్ను ‘భయ్యా’ అనే అంటుంటారు. వాళ్లు అలా పిలవడం నాకు ఆనందమే. అలా నా గురించి నేనే నా ఇంట్లో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సివచ్చింది. నా అదృష్టం ఏంటంటే.. వాళ్లందరికీ ‘గాడ్ ఫాదర్’ సినిమా నచ్చింది. ఒక్కొక్కరూ నాలుగుసార్లు చూశారట” అని చిరు చెప్పడం విశేషం.
ఇదే వేడుకలో తనతో అభిమానులు ఫొటోల కోసం ప్రయత్నిస్తున్నపుడు ఆయన లేరు కదా అంటూ పరోక్షంగా గరికపాటికి చిరు కౌంటర్ వేయడం చర్చనీయాంశం అయింది.
This post was last modified on October 30, 2022 9:09 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…