తెలుగు వారికి బాగా దగ్గరైన మలయాళ భామ నిత్యా మీనన్ శుక్రవారం పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్టు పెద్ద చర్చకే దారి దాసింది. ఆమె ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్లో పాజిటివ్ చూపిస్తున్న ఫొటో పెట్టి ‘అండ్ ద వండర్ బిగిన్స్’ అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో ఆమె ఫాలోవర్లు ఒక్కసారిగా షాకైపోయారు.
ఇంకా నిత్యాకు పెళ్లే కాలేదు.. ఇప్పుడే ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోయారు. నిత్యా ఓ మలయాళ నటుడితో ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి కానీ.. అతనెవ్వరన్నది వెల్లడి కాలేదు.
వీరి పెళ్లి గురించి కూడా ఈ మధ్య ఎలాంటి వార్తలు రాలేదు. అలాంటిది ఏకంగా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయడం ఏంటి అనుకున్నారు. కానీ అసలు విషయం కొన్ని గంటల తర్వాత కానీ బయటపడలేదు. ఈ అప్డేట్ నిత్యా వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కాదు. ఓ సినిమాకు సంబంధించిన ప్రచారంలో భాగంగా ఇచ్చింది.
ఎందుకంటే మరో మలయాళ నటి పార్వతి సైతం సేమ్ ఇలాంటి పోస్టే పెట్టింది. ఇలా ఒకేసారి ఇద్దరు హీరోయిన్లు ఒకేలా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయడం అన్నది జరగదు. ఇదంతా నిత్యా, పార్వతి కలిసి చేయబోతున్న ఒక సినిమాకు సంబంధించి ప్రచారంలో భాగంగా చేసిందట. ముందు ఈ నర్మగర్భమైన పోస్టులు పెట్టి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాక.. సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారట.
పార్వతి మలయాళయేతర భాషల్లో అంతగా పాపులర్ కాదు కాబట్టి ఆమె పోస్టు గురించి జనాలకు ఆలస్యంగా తెలిసింది. ఈ లోపు నిత్యా పోస్టు మాత్రం వైరల్ అయిపోయింది. దీని గురించి పెద్ద చర్చ జరిగింది. కానీ అసలు విషయం తెలిశాక అందరూ కామ్ అయ్యారు. ఈ పోస్టును బట్టి చూస్తుంటే ఈ చిత్రం మహిళలు, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అని అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియబోతున్నాయి.
This post was last modified on October 29, 2022 1:12 pm
దేశంలో అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయాల వరకు ఎంతో గొప్ప పాత్ర…
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…