తెలుగు వారికి బాగా దగ్గరైన మలయాళ భామ నిత్యా మీనన్ శుక్రవారం పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్టు పెద్ద చర్చకే దారి దాసింది. ఆమె ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్లో పాజిటివ్ చూపిస్తున్న ఫొటో పెట్టి ‘అండ్ ద వండర్ బిగిన్స్’ అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో ఆమె ఫాలోవర్లు ఒక్కసారిగా షాకైపోయారు.
ఇంకా నిత్యాకు పెళ్లే కాలేదు.. ఇప్పుడే ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోయారు. నిత్యా ఓ మలయాళ నటుడితో ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి కానీ.. అతనెవ్వరన్నది వెల్లడి కాలేదు.
వీరి పెళ్లి గురించి కూడా ఈ మధ్య ఎలాంటి వార్తలు రాలేదు. అలాంటిది ఏకంగా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయడం ఏంటి అనుకున్నారు. కానీ అసలు విషయం కొన్ని గంటల తర్వాత కానీ బయటపడలేదు. ఈ అప్డేట్ నిత్యా వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కాదు. ఓ సినిమాకు సంబంధించిన ప్రచారంలో భాగంగా ఇచ్చింది.
ఎందుకంటే మరో మలయాళ నటి పార్వతి సైతం సేమ్ ఇలాంటి పోస్టే పెట్టింది. ఇలా ఒకేసారి ఇద్దరు హీరోయిన్లు ఒకేలా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయడం అన్నది జరగదు. ఇదంతా నిత్యా, పార్వతి కలిసి చేయబోతున్న ఒక సినిమాకు సంబంధించి ప్రచారంలో భాగంగా చేసిందట. ముందు ఈ నర్మగర్భమైన పోస్టులు పెట్టి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాక.. సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారట.
పార్వతి మలయాళయేతర భాషల్లో అంతగా పాపులర్ కాదు కాబట్టి ఆమె పోస్టు గురించి జనాలకు ఆలస్యంగా తెలిసింది. ఈ లోపు నిత్యా పోస్టు మాత్రం వైరల్ అయిపోయింది. దీని గురించి పెద్ద చర్చ జరిగింది. కానీ అసలు విషయం తెలిశాక అందరూ కామ్ అయ్యారు. ఈ పోస్టును బట్టి చూస్తుంటే ఈ చిత్రం మహిళలు, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అని అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియబోతున్నాయి.
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…