అందరి దృష్టి వచ్చే ఏడాది సంక్రాంతికి జరగబోయే బాక్సాఫీస్ యుద్ధం మీదే ఉంది కానీ అదే స్థాయిలో డిసెంబర్ 23 కూడా మెగా కాంపిటీషన్ కి రెడీ అవుతోంది. మాస్ మహారాజా ‘ధమాకా’ని ఆ డేట్ కి లాక్ చేస్తూ ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. నిఖిల్ ’18 పేజెస్’ని అదే రోజుకి ఫిక్స్ చేశారు. రణ్వీర్ సింగ్ ‘సర్కస్’ ప్యాన్ ఇండియా రేంజ్ లో ముస్తాబవుతోంది దాని కోసమే. ఇప్పుడు తాజాగా విజయ్ సేతుపతి కత్రినా కైఫ్ ల ‘మెర్రి క్రిస్మస్’ని కూడా బరిలో దించబోతున్నారు. అందాధూన్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ అందిస్తున్న మరో థ్రిల్లర్ మూవీ ఇది. ఈ నాలుగు కన్ఫర్మ్ చేసేసుకున్నాయి.
ఇక్కడితో స్టోరీ అయిపోలేదు. సమంతా ‘శాకుంతలం’ కోసం గుణశేఖర్ అదే సీజన్ ని చూస్తున్నాడు. ఇంత రద్దీ మధ్యలో దింపితే నలిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి నిర్ణయం మార్చుకునే అవకాశం లేకపోలేదు. ఈ సినిమా మొత్తం సామ్ ఇమేజ్ మీదే మార్కెట్ చేయాలి కనక స్టార్ హీరోలతో క్లాష్ కావడం అంత సేఫ్ కాదు. ఒకవేళ ఇది వద్దనుకుంటే ఫిబ్రవరికి షిఫ్ట్ అవ్వడం తప్ప మరో మార్గం లేదు. రెండు రోజుల ముందు 21న ‘అన్నీ మంచి శకునములే’ రావొచ్చు. నందిని రెడ్డి దర్శకురాలు. ఎందుకు రిస్క్ అనుకుంటే అదే నెల 30కి వాయిదా వేసుకునే సూచనలున్నాయి.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే డిసెంబర్ పదహారునే రానున్న ‘అవతార్ 2’ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే వారానికే నెమ్మదించే సీన్ ఉండదు కాబట్టి ఆపై వచ్చే వాటికి స్క్రీన్లను సర్దడం మల్టీప్లెక్సులకు సవాల్ గా మారుతుంది. అసలే దాని డిమాండ్ మాములుగా లేదు. ఈ లెక్కన పొంగల్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో బాక్సాఫీస్ రచ్చ చూడబోతున్నాం. పలు సందర్భాల్లో చెప్పుకున్నట్టు అయితే అతివృష్టి లేదా అనావృష్టి టాలీవుడ్ లో కొనసాగుతూనే ఉంది. నేనా నువ్వా అంటూ ఎవరూ వెనక్కు తగ్గేందుకు మొగ్గు చూపకపోవడం ఈ పరిస్థితికి దారి తీస్తోంది.
This post was last modified on October 29, 2022 10:31 am
వైసీపీ అధినేత జగన్ తమపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం.. హైకోర్టును ఆశ్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ…
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే కొలువుల కోత మొదలుకాగా… త్వరలోనే హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పాలి. ఎందుకంటే..…
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తెరమీదికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.…
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ.. విజయవాడ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే ఆయన…
ఐపీఎల్లో రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలు గెలిచిన జట్టు ముంబయి ఇండియన్స్. కానీ ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది.…
డైలాగ్ కింగ్ మంచు మోహన్బాబు ఇంట్లో ఇటీవల కాలంలో పలు రగడలు తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. ఆస్తుల వివాదాలు…