Movie News

ఒకే వేదికపై రజనీ తారక్

కొన్ని అరుదైన కలయికలు పదే పదే జరగవు. దానికి సమయం సందర్భం కలిసి రావాలి. అలాంటి అరుదైన కాంబోకు బెంగళూరు వేదిక కానుంది. స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ కు త్వరలో కర్ణాటకరత్న బిరుదును ప్రధానం చేయనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా సూపర్ స్టార్ రజినీకాంత్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు తమ అంగీకారాన్ని తెలిపారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై స్వయంగా ఈ విషయం వెల్లడించడంతో అభిమానుల ఆనందం మాములుగా లేదు. నవంబర్ 1న జరగబోయే స్టేట్ ఫార్మేషన్ డే నాడు ఘనమైన నివాళితో ఈ పురస్కారం అందజేస్తారు.

తారక్ తో పునీత్ కు ఎప్పటినుంచో బాండింగ్ ఉంది. అతని చక్రవ్యూహ సినిమా కోసం జూనియర్ ప్రత్యేకంగా కన్నడలో పాట పాడటం అప్పట్లో సంచలనం. తమన్ స్వరపరిచిన ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. పరస్పరం ఇద్దరూ ఎక్కడ కలుసుకున్నా వాళ్ళ బాండింగ్ చాలాసార్లు బయట పడింది. ఎన్టీఆర్ తల్లి స్వస్థలం కన్నడనాడే కావడం ఇది మరింత బలపడేందుకు దోహదపడింది. భవిష్యత్తులో ఇద్దరూ కలిసి ఒక మల్టీ స్టారర్ ప్లాన్ చేసుకున్నారు కానీ అది సాధ్యపడలేదు. ఈలోగా విధి వక్రీకరించి పునీత్ శాశ్వతంగా సెలవు తీసుకోవడం జరిగిపోయింది.

ఇక రజనీకాంత్ కు రాజ్ కుమార్ కుటుంబంతో అనుబంధం ఇప్పటిది కాదు. దశాబ్దాల నాటిది.ప్రస్తుతం సూపర్ స్టార్ జైలర్ లో పునీత్ అన్నయ్య శివ రాజ్ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇలా పలురకాలుగా ఎమోషనల్ అటాచ్ మెంట్ కొనసాగుతూనే ఉంది. వీళ్ళే కాదు ఎందరో అతిరథ మహారథులు కర్ణాటక రత్న ఫంక్షన్ కు హాజరు కాబోతున్నారు. ఏది ఏమైనా దగ్గరి వాళ్ళు చనిపోతేనే సాయంత్రానికి మర్చిపోతున్న కాలంలో ఏడాది కావొస్తున్నా ఆ మనిషి జ్ఞాపకాల్లోనే ఉంటూ శాండల్ వుడ్ ఫ్యాన్స్ ఇంకా ఇంత ప్రేమను ప్రదర్శించడం చూస్తే పునీత్ నిజంగా కారణజన్ముడే అనిపిస్తుంది.

This post was last modified on October 28, 2022 9:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

17 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

36 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago