ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమా ఓకే చేసుకోవాలంటే దర్శక రచయితలకు అదో పెద్ద అగ్ని పరీక్ష, నిర్మాత రామానాయుడు గారు ఒక ప్రేక్షకుడిగా స్క్రిప్ట్ విని థియేటర్లో అది ఆడుతుందో లేదో సరిగ్గా పసిగట్టేవారు. ఆయన లెక్క తప్పిన సందర్భాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ. బొబ్బిలి రాజా నుంచి భారీ చిత్రాల నిర్మాణ బాధ్యతలు సురేష్ బాబు చేతికి వచ్చాక తండ్రిని మించి తనయుడనే స్థాయిలో ఒక పక్క డిస్ట్రిబ్యూషన్ తో పాటు ప్రొడక్షన్ వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించారు. తమిళ దర్శకుడిని తీసుకొచ్చి కలిసుందాం రా అనే ఫ్యామిలీ మూవీతో ఇండస్ట్రీ హిట్టు కొట్టడమనే ఉదాహరణ చాలు జడ్జ్ మెంట్ పవర్ చూపించడానికి.
కానీ ఈ మధ్య సురేష్ బాబు లెక్క పూర్తిగా తప్పుతోంది. కథలను సరిగా వినకుండా ఓకే చేస్తున్నారో లేక తను నిర్మాణ భాగస్వామినే కాబట్టి లాభమో నష్టమో అది అందరూ పంచుకుంటారనే నిర్లిప్తతో తెలియదు కానీ మొత్తానికి ఆ సంస్థ స్టాండర్డ్ కు తగ్గ బొమ్మలు రావడం లేదనేది దగ్గుబాటి అభిమానుల ఫిర్యాదు. ఇటీవలే వచ్చిన ప్రిన్స్ తెలుగులో ఫ్లాప్ దిశగా పరుగులు పెడితే అటు తమిళంలోనూ సోసోగానే ఆడుతోంది. ఆ మధ్య శాకినీ డాకిని, దొంగలున్నారు జాగ్రత్తలదీ ఇదే వరస. కేవలం ఓటిటి కంపనీల కండీషన్ మీదనే థియేటర్ రిలీజ్ చేశారన్న కామెంట్స్ నిజమే అనిపించాయి వాటి ఫలితాలు చూశాక.
అంతకు ముందు విరాట పర్వం సైతం సోషల్ మీడియా హడావిడి తప్ప టికెట్ కౌంటర్ల దగ్గర రాబట్టింది ఏమి లేదు. నారప్ప, దృశ్యం 2 లను నేరుగా ఓటిటికి ఇవ్వడం పట్ల ఇప్పటికీ ఫ్యాన్స్ గుర్రుగానే ఉన్నారు. పెద్ద స్క్రీన్ మీద ఆడాల్సిన వాటిని డిజిటల్ లో, స్మార్ట్ ఫోన్ కే ఎక్కువనుకునే వాటిని థియేటర్లో విడుదల చేయడం ఇలా రివర్స్ లో వెళ్లడం ఏమిటని వాళ్ల ఆవేదన. ఇదంతా సురేష్ సోలో ప్రొడ్యూసర్ గా చేసినవి కాదు. అయినప్పటికీ అధిక శాతం జనానికి రెండు బొమ్మల లోగో చూసినప్పుడు ఇది నాయుడు గారిదే అనుకుంటారు తప్ప పార్ట్ నర్స్ ఎవరున్నారో చెక్ చేయరు. చూడాలి రాబోయే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో.
This post was last modified on October 27, 2022 9:29 am
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…