జూనియర్ను చాలా చిన్న వయసులోనే పెద్ద స్టార్ను చేసిన సినిమా ‘సింహాద్రి’. అప్పటికే ‘ఆది’తో తన స్టామినా చూపించిన తారక్.. ఈ చిత్రంతో రికార్డుల మోత మోగించి టాప్ స్టార్లకు పోటీగా నిలిచాడు.
అప్పటికి అత్యధిక కేంద్రాల్లో శత దినోత్సవ రికార్డును ‘సింహాద్రి’ బద్దలు కొట్టింది. ఏకంగా 151 కేంద్రాల్లో ఆ చిత్రం వంద రోజులు ఆడింది. ఈ చిత్రం విడుదలై గురువారంతో 17 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయి ట్వీట్లు వేస్తున్నారు. మిలియన్లలో ట్వీట్లు పడుతున్నాయి.
ఇక ‘సింహాద్రి’ సినిమా విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టించిందన్నది పక్కన పెడితే.. ఇది పట్టాలెక్కడానికి ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఈ చిత్రాన్ని నిర్మించిన వీఎంసీ సంస్థ.. ఎన్టీఆర్కు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ‘ఆది’ మేకింగ్ దశలో ఉండగానే అతను హీరోగా పవన్స్ శ్రీధర్ అనే కొత్త దర్శకుడితో ఓ కాలేజ్ లవ్ స్టోరీని మొదలుపెట్టింది. ఆ చిత్రం సగం దాకా చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. ఐతే ఈ లోపు ‘ఆది’ రిలీజై బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాతో తారక్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. పెద్ద మాస్ హీరో అయిపోయాడు.
వీఎంసీ బేనర్లో తారక్ చేస్తున్న సినిమాలో అంతగా మాస్ అంశాలు లేకపోవడం, అది సగటు కాలేజీ లవ్ స్టోరీ కావడం అతడి ఇమేజ్కు ఈ సినిమా సరిపోదనిపించి దాన్ని మధ్యలో ఆపేశారు. అప్పుడే తారక్కు ‘స్టూడెంట్ నంబర్ వన్’తో తొలి విజయాన్నందించిన రాజమౌళి తెరపైకి వచ్చాడు.
అతను తన తండ్రితో ‘సింహాద్రి’ స్క్రిప్టు తయారు చేయించి.. తారక్తో వీఎంసీ బేనర్లో తెరకెక్కించడానికి ముందుకొచ్చాడు. తర్వాత ఏం జరిగిందన్నది అందరికీ తెలిసిందే. ఈ కాంబినేషన్ మీద మంచి అంచనాలే ఉండగా.. ఆ అంచనాల్ని మించి ఎక్కడికో వెళ్లిపోయి భారీ విజయాన్నందుకుంది ‘సింహాద్రి’.
This post was last modified on July 10, 2020 4:04 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…