సినిమాలన్నాక డిజాస్టర్లు బ్లాక్ బస్టర్లు సహజమే కానీ ఒక్కోసారి వాటి ఫలితాల తాలూకు ప్రభావం చాలా కాలం వెంటాడుతుంది. ఈ మధ్య కాలంలో అలా విపరీతమైన చర్చకు గురైన చిత్రాలు లైగర్, ఆచార్య. నిర్మాణంలో భాగస్వాములైనందుకు ఆ దర్శకులే వాటిని భరించాల్సిన పరిస్థితి తలెత్తడం పెద్ద ఇష్యూ అయ్యింది. ఎప్పుడూ ఏదో ఒక సందర్భంలో నవ్వుతూ కనిపించే కొరటాల శివ నెలల తరబడి మాయమయ్యారంటే దానికి కారణం ఎన్టీఆర్ స్క్రిప్ట్ ఒకటే కాదన్న సంగతి తెలిసిందే. ఇక లైగర్ తాలూకు నీలినీడలు ఇంకా పూరి బృందాన్ని వెంటాడుతూనే ఉన్నట్టు తాజా పరిణామాలు గమనిస్తే అర్థం చేసుకోవచ్చు.
లైగర్ నష్టాల భర్తీ కోసం డిస్ట్రిబ్యూటర్లు పూరిని కలిసి చర్చించేందుకు రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు. ఎక్కువగా ముంబైలోనే ఉంటున్న పూరి వీలైనంత తిరిగి ఇస్తాననే హామీ కూడా ఇచ్చినట్టు టాక్ వచ్చింది. కాకపోతే కొంత టైం అడిగారు. అది దగ్గర పడుతోంది. కానీ అంతకన్నా ముందే డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్న కొందరు పంపిణీదారులు సుమారు 50కి పైగా సమూహంగా ఏర్పడి ఆయన ఆఫీసర్ ముందు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారట. ఇది కాస్తా పూరికి తెలియడం ఓ ఫోన్ కాల్ లో దీని మీద సీరియస్ అయినట్టుగా వచ్చిన లీక్ హాట్ టాపిక్ గా మారింది.
తన పరువు తీయాలని చూస్తే భరించనని వాళ్లకు తప్ప మిగిలినవాళ్లకు నష్టపరిహారం ఇస్తానని అందులో ఉంది. అంతే కాదు పోకిరి నుంచి ఇస్మార్ట్ శంకర్ దాకా బయ్యర్లు ఉన్న బాకీలను సదరు అసోసియేషన్ ఇప్పిస్తుందాని నిలదీయడం కూడా వినిపించింది. తిరిగి ఇవ్వాలని రూల్ లేకపోయినా నష్టపోయారనే ఉద్దేశంతో ముందుకొస్తే ఇలా చేయడం పట్ల పూరి చాలా ఆవేదన చెందినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ బ్లాక్ మెయిల్ వ్యవహారం సోషల్ మీడియాకు సైతం పాకిపోయింది. అఫీషియల్ సోర్స్ నుంచి ఇదంతా బయటికి రాకపోయినా దీని మీద ఫిలిం నగర్ వర్గాల్లో పెద్ద డిబేటే జరుగుతోంది
This post was last modified on October 24, 2022 6:28 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…