మొత్తానికి నందమూరి బాలకృష్ణ సినిమా ‘వీరసింహారెడ్డి’ విడుదల విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. ముందు దసరాకు అనుకుని.. ఆ తర్వాత డిసెంబర్ రిలీజ్ మీద కన్నేసి.. చివరికి సంక్రాంతి విడుదలకు ఫిక్సయిపోయారు. ముందు నుంచి ప్రచారంలో ఉన్న ‘వీరసింహారెడ్డి’ టైటిల్నే సినిమాకు ఖాయం చేసిన చిత్ర బృందం.. సంక్రాంతికి తమ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఇప్పటిదాకా ఎవరూ చేయని విధంగా కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ‘వీరసింహారెడ్డి’ టైటిల్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమా గురించి ఇచ్చిన ఎలివేషన్ బాలయ్య అభిమానులకు పూనకాలు తెప్పించేసింది. అతను సిినమా మీద మామూలు కాన్ఫిడెన్స్తో లేడని ఈ మాటల్ని బట్టి అర్థమవుతోంది.
“ఇంకా ఇరవై రోజులు షూటింగ్ ఉన్నా సరే.. ఇప్పటికిప్పుడు సినిమా రిలీజ్ అయినా కానీ.. బ్లాక్బస్టర్ అవుతుంది. అంత కంటెంట్ ఉంది సినిమాలో” అంటూ ‘వీరసింహారెడ్డి’కి ఎలివేషన్ ఇచ్చాడు గోపీచంద్. అంతేకాక తన లాంటి వీరాభిమాని బాలయ్యతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూస్తారు అంటూ మరో కామెంట్ కూడా చేశాడు. “ఒక సమరసింహారెడ్డి సినిమా చూసిన ఫ్యాన్.. సినిమా రిలీజ్ రోజు మొత్తం జైల్లో ఉన్న ఒక అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే.. వీరసింహారెడ్డి. మన ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకునేలా ఉంటుందీ సినిమా” అని గోపీచంద్ అన్నాడు.
తాను బాలయ్యకు వీరాభిమాని అని.. ఆయనతో సినిమా చేసే అవకాశాన్ని ఒక బాధ్యతగా భావించి అభిమానులు గర్వించే చిత్రాన్ని అందిస్తానని ఈ సినిమా ప్రారంభోత్సవం టైంలోనే చెప్పాడు గోపీచంద్. సినిమా చివరి దశలో ఉండగా గోపీచంద్ ఎలివేషన్ చూస్తుంటే అభిమానులకు ఈ సినిమా పెద్ద ట్రీట్ అని అర్థమవుతోంది.
This post was last modified on October 22, 2022 7:37 pm
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…