నాలుగేళ్ల కిందట సంక్రాంతికి మూడు పెద్ద తెలుగు సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. అందులో ఒకటి నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషించిన ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ కాగా.. ఇంకొకటి రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’. ఇది కాక దిల్ రాజు నిర్మాణంలో విక్టరీ వెంకటేష్-వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఎఫ్-2’ సైతం ఆ పండక్కే రిలీజైంది.
ఐతే వీటికే థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టంగా ఉంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తమిళ చిత్రం ‘పేట’ సంక్రాంతి రేసులోకి వచ్చింది. ఐతే ఆ సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన ఓ నిర్మాత.. దానికి థియేటర్లు కేటాయించకపోవడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. దిల్ రాజును పరోక్షంగా తీవ్రంగా విమర్శించాడు. దీనికి దిల్ రాజు దీటుగానే బదులిచ్చాడు. ‘పేట’ సినిమా లేటుగా సంక్రాంతి రేసులోకి వచ్చిందని.. తెలుగు సినిమాలను కాదని అనువాద చిత్రానికి థియేటర్లు ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు.
ఐతే కట్ చేస్తే ఇప్పుడు సంక్రాంతికి దిల్ రాజు నిర్మిస్తున్న ‘వారసుడు’ సినిమా రిలీజ్ కాబోతోంది. దాన్ని ద్విభాషా చిత్రంగా పేర్కొంటున్నప్పటికీ.. ప్రధానంగా తమిళ సినిమా అనే చెప్పాలి. ఈ మధ్య తెలుగు సినిమాల షూటింగ్స్ దాదాపు నెల రోజులు ఆపేయగా.. ‘వారసుడు’ మూవీ చిత్రీకరణ మాత్రం ఆగలేదు. ఇదేం న్యాయం అని దిల్ రాజును మీడియా వాళ్లు అడిగితే దాన్ని తమిళ సినిమాగా పేర్కొన్నాడు రాజు.
ఇక సంక్రాంతి పోటీ విషయానికి వస్తే ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్), వీరసింహారెడ్డి రిలీజ్ ఖరారు చేసుకున్నాయి. వీటికి తోడు ‘వారసుడు’ కూడా లైన్లో ఉంది. ఒకేసారి ఇన్ని సినిమాల పోటీ అంటే కచ్చితంగా థియేటర్ల విషయంలో గొడవలు తప్పవు. మరి దిల్ రాజు ఇంతకుముందు చెప్పిన లాజిక్ ప్రకారం తమిళ సినిమా అయిన ‘వారసుడు’కి థియేటర్ల కేటాయింపు విషయంలో వెనక్కి తగ్గుతారా.. మిగతా మూడు చిత్రాలకే పెద్ద పీట వేసేలా రాజీకి వస్తారా అన్నది ఆసక్తికరం. అలా కాకుండా ముందు చెప్పిన లాజిక్ పక్కన పెట్టి తన సినిమాకు ఎక్కువ థియేటర్లు అట్టి పెట్టుకుంటారా అన్నది చూడాలి.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…