ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు మరోసారి పవన్ కళ్యాణ్ నిర్మాతలను టెన్షన్ పెడుతున్నాయి. విశాఖలో జరిగిన పరిణామాలకు నిరసనగా పవర్ స్టార్ ఓ రేంజ్ లో వైసిపి మీద ఎదురు దాడి చేయడం ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు కానీ ఇంతకన్నా దారుణంగా వీళ్ళే గతంలో దూషించిన దాఖలాలు ఉండటంతో సోషల్ మీడియాలోనూ పవన్ చర్యల పట్ల ఏమంత వ్యతిరేకత కనిపించడం లేదు. అయితే దీని ప్రభావం వచ్చే ఏడాది విడుదల కాబోయే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాల మీద తప్పకుండా ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం.
ముఖ్యంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న హరిహరవీరమల్లు 2023 వేసవిలో రిలీజ్ కానుంది. కొత్త షెడ్యూల్ మొదలుపెట్టేందుకు ఇటీవలే ఒక వర్క్ షాప్ కూడా నిర్వహించారు. ఈలోగానే ఊహించని సంఘటనలు జరిగిపోయాయి. గతంలో వకీల్ సాబ్ టైంలో బెనిఫిట్ షోలు లేకుండా జగన్ సర్కార్ కట్టడి చేసిన విషయం అభిమానులు మర్చిపోలేదు. భీమ్లా నాయక్ కి ఏకంగా రెవిన్యూ అధికారులను థియేటర్ల వద్ద కాపలా పెట్టి టికెట్లను సాధారణ రేట్లకు అమ్మించారు. ఇది ఓవరాల్ కలెక్షన్ల మీద ప్రభావం చూపించింది. ఆ కారణం వల్లే కొన్ని ఏరియాల బయ్యర్లకు నష్టాలు తప్పలేదు.
కానీ వీరమల్లకు అలా చేస్తే దాని దెబ్బ తీవ్రంగానే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి గ్రాండియర్లకు టికెట్ రేట్ల పెంపు చాలా అవసరం. అలా చేయడం వల్లే ఆర్ఆర్ఆర్ ఈజీగా గట్టెక్కగలిగింది. తెలంగాణలో ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ ఎటొచ్చి పవన్ మీద కోపంతో ఏపీలో మళ్ళీ పాత చర్యలకు తెగబడితే ఆ భారమంతా నిర్మాత ఏఎం రత్నం మీద పడుతుంది. ఒకవేళ అక్కడిదాకా వస్తే తక్కువ రేట్లకు బిజినెస్ చేయాల్సి ఉంటుంది. వినోదయ సితం రీమేక్ లాంటివైతే ఈ సమస్య వచ్చేది కాదు కానీ మరి వీరమల్లు టైంకి ఈ వేడి చల్లారిపోతుందా అప్పటిదాకా మనసులో పెట్టుకుని భయపడినంతా చేస్తారా చూడాలి.
This post was last modified on October 21, 2022 6:39 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…