Movie News

వీరమల్లుకి మళ్ళీ టెన్షన్

ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు మరోసారి పవన్ కళ్యాణ్ నిర్మాతలను టెన్షన్ పెడుతున్నాయి. విశాఖలో జరిగిన పరిణామాలకు నిరసనగా పవర్ స్టార్ ఓ రేంజ్ లో వైసిపి మీద ఎదురు దాడి చేయడం ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు కానీ ఇంతకన్నా దారుణంగా వీళ్ళే గతంలో దూషించిన దాఖలాలు ఉండటంతో సోషల్ మీడియాలోనూ పవన్ చర్యల పట్ల ఏమంత వ్యతిరేకత కనిపించడం లేదు. అయితే దీని ప్రభావం వచ్చే ఏడాది విడుదల కాబోయే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాల మీద తప్పకుండా ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం.

ముఖ్యంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న హరిహరవీరమల్లు 2023 వేసవిలో రిలీజ్ కానుంది. కొత్త షెడ్యూల్ మొదలుపెట్టేందుకు ఇటీవలే ఒక వర్క్ షాప్ కూడా నిర్వహించారు. ఈలోగానే ఊహించని సంఘటనలు జరిగిపోయాయి. గతంలో వకీల్ సాబ్ టైంలో బెనిఫిట్ షోలు లేకుండా జగన్ సర్కార్ కట్టడి చేసిన విషయం అభిమానులు మర్చిపోలేదు. భీమ్లా నాయక్ కి ఏకంగా రెవిన్యూ అధికారులను థియేటర్ల వద్ద కాపలా పెట్టి టికెట్లను సాధారణ రేట్లకు అమ్మించారు. ఇది ఓవరాల్ కలెక్షన్ల మీద ప్రభావం చూపించింది. ఆ కారణం వల్లే కొన్ని ఏరియాల బయ్యర్లకు నష్టాలు తప్పలేదు.

కానీ వీరమల్లకు అలా చేస్తే దాని దెబ్బ తీవ్రంగానే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి గ్రాండియర్లకు టికెట్ రేట్ల పెంపు చాలా అవసరం. అలా చేయడం వల్లే ఆర్ఆర్ఆర్ ఈజీగా గట్టెక్కగలిగింది. తెలంగాణలో ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ ఎటొచ్చి పవన్ మీద కోపంతో ఏపీలో మళ్ళీ పాత చర్యలకు తెగబడితే ఆ భారమంతా నిర్మాత ఏఎం రత్నం మీద పడుతుంది. ఒకవేళ అక్కడిదాకా వస్తే తక్కువ రేట్లకు బిజినెస్ చేయాల్సి ఉంటుంది. వినోదయ సితం రీమేక్ లాంటివైతే ఈ సమస్య వచ్చేది కాదు కానీ మరి వీరమల్లు టైంకి ఈ వేడి చల్లారిపోతుందా అప్పటిదాకా మనసులో పెట్టుకుని భయపడినంతా చేస్తారా చూడాలి.

This post was last modified on October 21, 2022 6:39 am

Share
Show comments
Published by
satya

Recent Posts

నీ ముగ్గురు భార్యలకూ టికెట్లు ఇప్పిస్తా .. ఓకేనా ?!

‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…

1 hour ago

ఈ రెండే హాట్ టాపిక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఏపీలో రెండు సంచ‌ల‌న విష‌యాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జ‌గ‌న్ విదేశీ…

1 hour ago

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో…

2 hours ago

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

"నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు…

3 hours ago

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…

4 hours ago

బాహుబలి బ్రాండు విలువ ఎప్పటిదాకా

టాలీవుడ్ గమనాన్ని ఆసాంతం మార్చిన అతి కొద్ది సినిమాల్లో బాహుబలి స్థానం చాలా ప్రత్యేకం. అప్పటిదాకా మహా అయితే వంద…

4 hours ago