మంచు విష్ణు కెరీర్లో హిట్లన్నీ చాలా వరకు కామెడీ ఎంటర్టైనర్లే. అతడికి తొలి విజయాన్నందించిన ఢీ.. ఆ తర్వాత సక్సెస్ అయిన దేనికైనా రెడీ, దూసుకెళ్తా.. ప్రేక్షకులకు మంచి వినోదాన్నందించాయి. కానీ ఆ తర్వాత అతను రకరకాల జానర్లలో సినిమాలు చేశాడు. అవి తేడా కొట్టాయి. ఇప్పుడు మళ్లీ తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్లో జిన్నా చేశాడు. మధ్యలో అనవసరంగా వేరే జానర్లలో సినిమాలు చేసి ఇబ్బంది పడ్డానని.. ఇకపై ఆ తప్పు చేయనని మంచు విష్ణు అంటున్నాడు.
జిన్నా ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన మంచు విష్ణు.. తన సినిమాల ఎంపిక, జిన్నా విశేషాల గురించి ఇంకా ఏం చెప్పాడంటే.. నేను ఇప్పుడు రెండు విషయాలు దృష్టిలో పెట్టుకుని సిినిమాలు చేస్తున్నా. మా అమ్మన్నీ, పిల్లల్నీ తీసుకెళ్లి సినిమా చూడగలిగేలా ఉండాలి. విపరీతంగా నవ్వుకోవాలి. ఆ రెండు లక్షణాలున్న కథలతోనే నా ప్రయాణం. జిన్నా సరిగ్గా అలాంటి సినిమానే.
ఈ సినిమా కథను మొదటిసారి నాకు చెప్పినపుడు కోన వెంకట్ గారు హీరో పాత్ర పేరు గాలి నాగేశ్వరరావు అని చెప్పగానే కనెక్ట్ అయ్యాను. అతను అప్పు చేసి టెంట్ హౌస్ పెడతాడు. ఐతే అతను ఏ పెళ్లికి టెంట్ హౌస్ సామాన్లు అద్దెకు ఇచ్చినా ఆ పెళ్ళి ఆగిపోతుంటుంది. దీంతో అతడి అప్పులు మరింత పెరిగి ఇబ్బంది పడుతుంటాడు.
ఇలాంటి జిన్నా జీవితం మధ్యలో అనుకోని మలుపు తిరుగుతుంది. ఆ మలుపు కథలో నేను చెప్పిన మార్పు ప్రకారం వచ్చేదే. ఇంటర్వెల్లో ప్రేక్షకులు కచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. లేదా షాకవుతారు. అదేంటన్నది తెర మీదే చూడాలి. ఈ సినిమా టైటిల్ విషయంలో కొన్ని వివాదాలు నడిచాయి. మాకు చెడు ఉద్దేశం ఏమీ లేదు కాబట్టి వాటిని పట్టించుకోం. నేను మాట్లాడినా వివాదమే. మాట్లాడకపోయినా వివాదమే. అందుకే నా పని నేను చూసుకుంటున్నా.. అని మంచు విష్ణు తెలిపాడు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…