ప్రస్తుతం తెలుగు సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు అందుకోలేకపోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ బాగానే ఉందనే టాక్ అందుకున్నప్పటికీ మూడు నాలుగు రోజులకే డ్రాప్ అవుతూ వచ్చింది. వర్షాల ఎఫెక్ట్ కూడా ఆ సినిమా కలెక్షన్స్ పై పడింది. అయితే ఓ మోస్తారు కలెక్షన్స్ తో మెల్లగా బండి లాగిస్తున్న తరుణంలో చిరు బావ అల్లు అరవింద్ గాడ్ ఫాదర్ కి టఫ్ ఇచ్చాడు.
కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్న రిషబ్ శెట్టి ‘కాంతార’ ను అల్లు అరవింద్ తెలుగులో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాంతార సినిమా రావడంతో ఒక్కసారిగా గాడ్ ఫాదర్ కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. ఏదో మెల్లగా ఓ మోస్తారు కలెక్షన్స్ తో ముందుకు సాగుతున్న గాడ్ ఫాదర్ కి కాంతార ఉన్నపళంగా చెక్ పెట్టేసింది.
సినిమా టాక్ రోజు రోజుకి స్ప్రెడ్ అవుతుండటంతో కలెక్షన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. తెలుగు స్టేట్స్ లో ఇప్పటికే 8 కోట్లకు పైగా షేర్ సాదించింది కాంతార.
రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ డబ్బింగ్ సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ముఖ్యంగా క్లైమాక్స్ తో రిషబ్ ఆడియన్స్ ను కట్టిపరేసి మెస్మరైజ్ చేయడంతో సినిమా భారీ వసూళ్ళు అందుకుంటుంది. వచ్చే వీకెండ్ కూడా ఈ సినిమా తెలుగులో మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే దీపావళి సినిమాలపై కూడా కాంతార ఎఫెక్ట్ గట్టిగా పడనుంది. మరి ‘కాంతార ‘ ఫైనల్ రన్ ఎంత వరకూ కొనసాగుతుందో చూడాలి.
This post was last modified on October 19, 2022 10:41 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…