నాని ఇంకా స్టార్ కాకముందు అతను కథానాయకుడిగా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు నాగ్ అశ్విన్. దాని తర్వాత అతను చేసింది ఒకే సినిమా. కానీ అంతలోనే ‘బాహుబలి’తో ఆల్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్తో సినిమా చేసే అవకాశం పట్టేశాడు.
అతడి రెండో సినిమా ‘మహానటి’ అంత మంచి గుర్తింపునిచ్చింది మరి. గురువు శేఖర్ కమ్ముల లాగా చిన్న, మీడియం రేంజి హీరోలతో క్లాస్ సినిమాలేవో చేసుకుంటాడనుకుంటే.. ఇలా ప్రభాస్ లాంటి పెద్ద మాస్ హీరోతో అతను సినిమా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. ఐతే ‘మహానటి’ తర్వాత అనుకోకుండా కథ రాసి ప్రభాస్ను మెప్పించి.. అశ్వినీదత్ను ఒప్పించి ఈ సినిమా చేస్తున్నాడని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా కోసం అతను 13 ఏళ్లుగా నిరీక్షిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
తాను దర్శకుడు కావాలని నిర్ణయించుకున్నాక.. 2006-07 మధ్య ప్రభాస్ కోసం ఓ కథ రాసినట్లు అశ్విన్ వెల్లడించాడు. ఇప్పుడు అదే కథకు మెరుగులు దిద్ది ప్రభాస్తో సినిమా చేయబోతున్నట్లు చెప్పాడు. 13 ఏళ్ల కిందట అంటే అప్పటికి అశ్విన్కు మహా అయితే 20 ఏళ్లుంటాయేమో. సినీ రంగంలో పెద్దగా అనుభవం కూడా లేదు. మరి అప్పటికే ప్రభాస్ను దృష్టిలో ఉంచుకుని కథ రాయడం.. ఇప్పటికీ అది ట్రెండీగా ఉండటం.. అంతర్జాతీయ స్థాయిలో, వందల కోట్ల బడ్జెట్తో ఆ సినిమాను తెరకెక్కించబోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.
చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఇది ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ కలగలిసిన చందమామ కథలా ఉంటుందని చెబుతున్నారు. తమ సంస్థ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫిలిం అని.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కబోతున్న చిత్రాల్లో ఒకటని ఈ సినిమా గురించి అశ్వినీదత్ ఓ సందర్భంలో అన్నారు. వచ్చే ఏడాది సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ సినిమా 2022లో రిలీజయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on July 10, 2020 11:16 am
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…