Movie News

ఎవ్వరిమాటా పట్టించుకోని ప్రభాస్

అక్టోబర్ 23 వస్తోంది. బాహుబలి ప్రభాస్ పుట్టినరోజు కాబట్టి ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్సయిటింగ్ గా బర్తడే పోస్టర్ల కోసం వెయిట్ చేస్తుంటారు. అయితే ఈసారిమాత్రం.. ప్రభాస్ తన అభిమానులకు షాకివ్వబోతున్నాడు. ఎందుకంటే వారు వద్దంటూ ఎంత గొంతుచించుకున్నా కూడా ప్రభాస్ మాత్రం తను అనుకున్నదే చేస్తానన్నట్లు దర్శకుడు మారుతితో సినిమా చేస్తున్నాడు. పైగా ఈ సినిమా ఫస్ట్ లుక్ తప్పకుండా 23న వస్తున్నట్లు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇట్టే అర్ధమవుతోంది.

బుధవారం నుండి మారుతి సినిమా షూటింగ్ మొదలపెడుతున్నాడు ప్రభాస్. అయితే అంతకంటే ముందే మనోడు ఒక ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ తో ఒక ఫోటో షూట్లో పాల్గొన్నాడు. ఇది ప్రభాస్ తో మారుతి తీస్తున్న ‘రాజా డీలక్స్’ సినిమాకోసం చేసిన ఫోటో షూట్ అంటూ ఇప్పుడు ఫిలింనగర్లో వార్తలు వేడివేడిగా చెక్కర్లు కొడుతున్నాయ్. 23న ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ రిలీజ్ చెయ్యాలి కాబట్టి, అందుకోసమే ముందు ఫోటో షూట్ చేశారని అంటున్నారు. ఆల్రెడీ ఈ షూట్లో ఇద్దరు హీరోయిన్స్.. మాళవికా మోహనన్ అలాగే నిధి అగర్వాల్ కూడా పాల్గొన్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిబట్టి చూస్తే.. ఒక్కసారి మారుతి చెప్పిన కథ నచ్చిన తరువాత.. అసలు ప్రభాస్ ను ఎవ్వరూ ఆపలేరని అర్దమవుతోంది. ఎవ్వరి మాటా పట్టించుకోకుండా ప్రభాస్ కూడా ఈ చిన్న సినిమా కోసం డేట్లు కూడా కేటాయించేసి పని మొదలెట్టేశాడు.

ఒక ప్రక్కన రాధేశ్యామ్ ఫ్లాప్ అవ్వడం, మరో ప్రక్కన ఆదిపురుష్‌ టీజర్ గ్రాఫిక్స్ నాసిరకంగా ఉండటంతో ఆల్రెడీ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. అందుకే మారుతితో సినిమా అనగానే వాళ్ళు ఇంకా అప్సెట్ అయిపోతున్నారు. ఎందుకంటే రొటీన్ కథలతో పక్కా కమర్షియల్ అంటూ పక్కా రొటీన్ సినిమాలను తీయడం ఈయనకు అలవాటైపోయిందనేది వారి వాదన. మరి ప్రభాస్ ను ఎంత కొత్తగా చూపిస్తే మారుతికి అంత పేరొస్తుంది. అలాగే చాలాకాలం నుండి ఆయనకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న హిట్టు కూడా ఆయన పాకెట్లోకి వచ్చి పడుతుంది. చూద్దాం ఏమవుతుందో!

Satya

Recent Posts

కర్ణాటక సీఎం మార్పు… ఢిల్లీలో షర్మిల

దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…

48 minutes ago

జూన్ నెలలో విజయ్…….జూలైలో జూనియర్ విజయ్

కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…

7 hours ago

కెప్టెన్‌గా రిష‌బ్ పంత్ ఔట్‌

రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్ల‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీం సొంత‌మైన ఆట‌గాడు రిష‌బ్ పంత్.…

7 hours ago

రండి తేల్చేద్దాం.. ముఖ్య నేత‌ల‌కు చంద్ర‌బాబు పిలుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. గ‌త వారం రోజులుగా మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌పై దృష్టి పెట్టారు. ఇదేస‌మ‌యంలో పాల‌న ప‌రంగా కూడా స‌మీక్ష‌లు..…

8 hours ago

అతిథిని ఎక్కువగా అంచనా వేశారు

మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు సైతం రీ రిలీజ్ లోనూ రికార్డులు సృష్టించడం చూశాం. ముఖ్యంగా ఖలేజాని చూసుకుంటే దానికొచ్చిన…

9 hours ago

జ‌గ‌న్ ఇప్పుడు ఫీల‌వుతున్నారా…?

వైసీపీ అధినేత జగన్ ఆవేదన చెందుతున్నారా ? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు.. పార్టీని…

9 hours ago