Movie News

సలార్ కు సరైన విలనే దొరికాడు

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ లో విలన్ గా పృథ్విరాజ్ సుకుమారన్ అఫీషియల్ గా లాక్ అయ్యాడు. ఆ మధ్య తన డబ్బింగ్ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఇందులో మీరు ఉంటారా లేదా అనే మీడియా ప్రశ్నకు నర్మగర్భంగా సమాధానం ఇచ్చిన పృథ్విరాజ్ సరైన సమయంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా క్లారిటీ ఇచ్చేశారు. ఇందులో తన పాత్ర పేరు వరదరాజ మన్నార్. నీల్ రెగ్యులర్ స్టైల్ లో మసిపూసిన బట్టలు, మొహం, గెటప్ తో ఈ విలక్షణ నటుడు భయపెట్టే లుక్స్ తో ఉన్నాడు. మెయిన్ విలన్ ఇతననే మెసేజ్ ఇచ్చినట్టే.

ప్రతినాయకుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ కోసం సంజయ్ దత్ ని సెట్ చేసుకుని ఎంత అడ్వాంటేజ్ వాడుకున్నాడో చూశాం. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఈ ఫ్యాక్టర్ బాగా ఉపయోగపడింది. ఇప్పుడు ఈ సలార్ కోసం పృథ్విరాజ్ ని పెట్టుకోవడం ద్వారా కేరళ మార్కెట్ ని ఇంకాస్త బలంగా టార్గెట్ చేసినట్టు అయ్యింది. ఎందుకంటే ఇతను మల్లువుడ్ లో మాములు స్టార్ కాదు. మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత ఆ స్థాయి బిజినెస్ చేయగలిగిన రేంజ్ ఇతనిది. అలాంటి నటుడు ఏరికోరి మరీ ప్రభాస్ కి ఎదురు నిలబడే క్యారెక్టర్ చేస్తే బజ్ డబుల్ కాక ఇంకేమవుతుంది.

ఇలా సరైన విలన్ కరెక్ట్ గా కుదిరితే ప్రభాస్ మూవీస్ ఏ స్థాయిలో అరాచకం చేస్తాయో బాహుబలిలో రానా, కెజిఎఫ్ 1లో గరుడ రామ్ లు నిరూపించారు. ఈ థ్రెడ్ వీక్ గా ఉండటం వల్లే సాహో, రాధే శ్యామ్ లు వీక్ అయిపోయి మాస్ కి కనెక్ట్ కాలేదు. కానీ ప్రశాంత్ నీల్ అలాంటి పొరపాటు చేయలేదు. విడుదలకు ఇంకా ఏడాది టైం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే దీని మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఆది పురుష్ యానిమేషన్ మిక్స్ చేసిన సినిమా కాబట్టి అది ఏ స్థాయిలో విజయం సాధించినా సలార్ మీదే వాళ్ళ కళ్లన్నీ. శృతి హాసన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే

This post was last modified on October 16, 2022 12:28 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

5 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

6 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

7 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

7 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

8 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

9 hours ago