గాడ్ ఫాదర్ ఎంత పెద్ద హిట్ అని చెప్పుకున్నా, నిర్మాత స్వంతంగా రిలీజ్ చేసుకున్నాం కాబట్టి ఎలాంటి నష్టాలు లేవని మీడియా ముందు నొక్కి వక్కాణించినా మొదటి నాలుగైదు రోజులు కనిపించిన హడావిడి ఆ తర్వాత థియేటర్ల వద్ద లేదన్నది నిజం . కొన్ని మెయిన్ సెంటర్లు మినహాయించి దాదాపు అన్ని చోట్ల షేర్లు అమాంతం పడిపోయాయి. ఇది ఊహించని బయ్యర్లు చాలా థియేటర్లకు అగ్రిమెంట్లను పది రోజుల దాకా మొదట్లోనే రెన్యూవల్ చేసుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడీ షాక్. మెగాస్టార్ స్టామినా ఇది కాదు. ఈ రేంజ్ లో పాజిటివ్ టాక్ వస్తే కనీసం మూడు వారాల దాకా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ బ్యాటింగ్ ఉండాల్సిందే.
కానీ వాస్తవానికి జరుగుతున్నది వేరు. ఆచార్య బెనిఫిట్ షోలకే జనం రాలేదు. సరే అదంటే బొమ్మ మరీ అన్యాయంగా ఉంది కాబట్టి డిజాస్టర్ అయ్యిందని సర్దిచెప్పొచ్చు. కానీ అన్నీ సానుకూలంగా కనిపించిన గాడ్ ఫాదర్ ఉన్నట్టుండి ఇంత తీవ్ర స్థాయిలో నెమ్మదించడం మాత్రం ఆందోళన కలిగించే అంశం. సోషల్ మీడియాలోనూ మొదటి ఆదివారం దాకా కలెక్షన్లను ట్రాక్ చేసి మరీ షేర్ చేసుకున్న అభిమానులు ఆ తర్వాత ఉన్నట్టుండి సైలెంట్ అయ్యారు. దీన్ని బట్టే వాస్తవంగా జరుగుతున్నదేంటో అర్థం చేసుకోవచ్చు. కంటెంట్ బాగుందని పేరొచ్చినా ఏదో మిస్ అయ్యిందనే ఫీలింగ్ గాడ్ ఫాదర్ రేంజ్ ని తగ్గించేసింది.
దానికి కారణాలు తర్వాత విశ్లేషించుకోవచ్చు కానీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ తమ భారమంతా వాల్తేర్ వీరయ్య మీదే పెడుతున్నారు. దీపావళికి టీజర్ తో పాటు సంక్రాంతి రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేయబోతున్నారు. దీని తర్వాత వచ్చే భోళా శంకర్ మళ్ళీ రీమేకే కాబట్టి ఏ రికార్డైనా వీరయ్యతోనే సాధ్యమని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. దానికి తగ్గట్టే లీకైన ఫొటోల్లో చిరంజీవి చేపలుపట్టే వాడిగా ఊర మాస్ గెటప్ లో రౌడీ అల్లుడు, దొంగమొగుడు నాటి లుక్స్ ని గుర్తుకు తెస్తున్నారు. మాస్ కంటెంట్ కనక కరెక్ట్ గా కుదిరితే మళ్ళీ చిరు రేంజ్ ఏంటనేది దీంతో ప్రూవ్ అవుతుంది. దర్శకుడు బాబీ మాత్రం దీనికి పక్కా హామీ ఇస్తున్నాడు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…