రాజకీయాల నుంచి సుదీర్ఘ విరామం తీసుకుని తిరిగి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఖైదీ నెంబర్ 150తో పాటు వేరే కథలు చాలా విన్నారు మెగాస్టార్ చిరంజీవి. అందులో దర్శకుడు పూరి జగన్నాధ్ చెప్పిన ఆటో జానీ కూడా ఉంది. 1992లో వచ్చిన రౌడీ అల్లుడులోని ఐకానిక్ పాత్రను తీసుకుని ఊర మాస్ క్యారెక్టరైజేషన్ తో దాన్ని రాసినట్టు అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి. అయితే సెకండ్ హాఫ్ విషయంలో చిరుతో పాటు చరణ్ ని కన్విన్స్ చేయడంతో పూరి ఫెయిలయ్యారు. అప్పుడాయన ఉన్న ట్రాక్ రికార్డుకి రిస్క్ చేసేందుకు తండ్రి కొడుకులు సిద్ధపడలేదు. ఫలితంగా ఆ ప్రాజెక్ట్ ఫ్యాన్స్ మధ్య కేవలం డిస్కషన్ గా మిగిలింది
అప్పటి నుంచి అభిమానులు ఈ కాంబో కుదిరితే బాగుండునని కోరుకుంటూనే ఉన్నారు. గాడ్ ఫాదర్ ప్రమోషన్ లో భాగంగా పూరి చిరంజీవి ఇన్స్ టా వేదికగా చేసిన ఇంటర్వ్యూలో మరోసారి దీని ప్రస్తావన వచ్చింది. లైగర్ డిజాస్టర్ తర్వాత సోషల్ మీడియాకు దూరంగా వెళ్ళిపోయి ఎవరికీ దొరక్కుండా ఇల్లు ఆఫీస్ కే పరిమితమైన పూరి వీడియో రూపంలో అయినా పబ్లిక్ లోకి వచ్చింది ఈ గాడ్ ఫాదర్ కోసమే. ఇందులోనే ఆటో జానీని మించిన స్క్రిప్ట్ తో త్వరలోనే కలుస్తానని నొక్కి చెప్పడం మెగా ఫ్యాన్స్ కి కొత్త జోష్ ఇచ్చింది. ఎన్ని ఫ్లాపులు తీసినా సరైన కథ పడితే పూరి బ్లాక్ బస్టర్ కొడతాడనే నమ్మకం మూవీ లవర్స్ లో ఉంది.
ఎలాగూ చిరంజీవి దర్శకుల ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా సబ్జెక్టు నచ్చితే చాలు ఓకే చెబుతున్నారు. లేకపోతే ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ కు భోళా శంకర్ ఎలా ఇస్తారు. సర్దార్ గబ్బర్ సింగ్ దారుణంగా దెబ్బ తిన్నా, వెంకీ మామ యావరేజ్ గా ఆడినా బాబీకి వాల్తేర్ వీరయ్య ఎందుకు చేశారు. సో పూరి జగన్నాథ్ అంత పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో రావాలే కానీ గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు. పైగా గాడ్ ఫాదర్ లో కీలకమైన జర్నలిస్ట్ పాత్రను చక్కగా పండించిన అభిమానం మెగాస్టార్ కు ఎలాగూ ఉంది. మరి నిజంగా పూరి కనక అన్నంత పని చేస్తే పండగే.
This post was last modified on October 13, 2022 8:44 am
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…