రెండేళ్ల విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చాక వరుసగా రెండు రీమేక్ సినిమాల్లో నటించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అవి ఉన్నంతలో మంచి ఫలితాలే అందుకున్నప్పటికీ.. అన్ని భాషల చిత్రాలనూ అందరూ చూసేస్తున్న ఈ రోజుల్లో రీమేక్లంటేనే జనాలు పెద్దగా ఆసక్తి ఉండట్లేదు.
ఈ నేపథ్యంలో వేరే భాషా చిత్రాలను రీమేక్ చేయడం ఇక ఆపేస్తే బెటర్ అన్న ఫీలింగ్ అందరిలోనూ వచ్చేస్తోంది. అందుకే పవన్ హీరోగా తమిళ చిత్రం వినోదిత సిత్తం చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారన్న వార్త బయటికి రాగానే అభిమానుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అందులోనూ ఆ సినిమా చాలా డల్లుగా సాగుతుంది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాల్లో మాదిరి కాస్తో కూస్తో మాస్ మూమెంట్స్ పెట్టడానికి కూడా ఆస్కారం ఉండదు.
ఐతే ఈ సినిమాను పట్టాలెక్కించే విషయంలో చాలా గందరగోళం నెలకొంది. మార్చిలోనే సినిమా మొదలవుతుందని అన్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆ తర్వాత ఒకట్రెండు సందర్భాల్లో సినిమా ముందుకు కదులుతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ మళ్లీ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయినట్లే కనిపించింది. ఐతే తాజాగా ఈ చిత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని, ఇక సినిమా పట్టాలెక్కే అవకాశమే లేదని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. కాగా అదే సమయంలో ఈ ఊహాగానాలను నిర్మాతలు ఖండించినట్లు కూడా వార్తలొస్తున్నాయి.
పీపుల్స్ మీడియా అధినేతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వాళ్లే ఈ ఊహాగానాలను ఖండించినట్లుగా చెబుతున్నారు. ఐతే ఇప్పటిదాకా అధికారికంగా ప్రకటించని సినిమా గురించి ఇలా ఊహాగానాలు రావడమేంటో.. దాన్ని నిర్మాతలు ఖండించడమేంటో.. అసలు చేతిలో ఉన్న హరిహర వీరమల్లు చిత్రాన్నే పూర్తి చేయలేక, రెండేళ్ల ముందు ప్రకటించిన భవదీయుడు భగత్ సింగ్ మూవీని పట్టాలెక్కించలేక వాటి దర్శక నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న పవన్.. వినోదియ సిత్తం రీమేక్ కోసం అసలెలా డేట్లు కేటాయిస్తాడన్నది అర్థం కాని విషయం.
This post was last modified on October 12, 2022 9:54 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…