తన మొదటి హిందీ సినిమా ఒక ప్రక్కన రిలీజవుతున్న కూడా.. శుక్రవారం ఉదయం ఫ్లైట్ ఎక్కేసి మాల్డీవ్స్ చెక్కేసింది ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. పోనివ్ ఒక్కత్తే సోలో హాలిడేకు వెళ్ళిందా అంటే.. అదీ కాదు. అసలు మా మధ్యన ఏం లేదు అంటూనే ఇప్పుడు విజయ్ దేవరకొండతో కలసి హిందూ మహాసముద్రంలో సరదాగా సేదతీరడానికి వెళ్లిపోయింది. వీరిద్దరూ కలసి ఒక్క ఫోటోలు కూడా పెట్టట్లేదేంటబ్బా అంటూ వస్తున్న కామెంట్లను అటుంచితే.. అసలు ఇద్దరూ ఏం నేర్చుకున్నారో అనే డిస్కషన్ కూడా ఇప్పుడు ఎక్కువైందనే చెప్పాలి.
ఒక ప్రక్కన తన ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ తీశాం.. సినిమా ధియేటర్లలో మీరెవ్వరూ తలదించుకునే ఛాన్సుండదని అంటూ ‘లైగర్’ సినిమాను భారీగా ప్రమోట్ చేసిన విజయ్ దేవరకొండ.. సినిమా రిలీజయ్యాక మాత్రం భారీ షాక్ తినేశాడు. అప్పటికే ఆల్రెడీ చాలా ఫ్లాపులు చవిచూసిన విజయ్ కు మరో ఫ్లాప్ వలన వచ్చే బాధ ఏముందిలే అనుకోవచ్చు కాని.. పాన్ ఇండియా లెవెల్లో దెబ్బ పడితే దాని పెయిన్ మాత్రం మామూలుగా ఉండదు కదా.
ఇప్పుడు అదే తరహాలో తన తొలి బాలీవుడ్ మూవీ అయిన ‘గుడ్ బాయ్’ ను చాలా గట్టిగానే ప్రమోట్ చేసింది రష్మిక. కాకపోతే ఇక రిలీజయ్యాక తాను చేసేదేం ఉండదు కాబట్టి, వెంటనే మాల్డీవ్స్ చెక్కేసింది. సినిమాకు నెగెటివ్ రివ్యూస్ రాగా, అందులో ముందుగా ఆమె యాక్టింగ్ కు మరియు హిందీ స్లాంగ్ కు ఇంకా ఎక్కువ నెగెటివ్ రివ్యూస్ వచ్చేశాయ్.
హిట్ సినిమాతో డబ్బులొస్తాయ్, పేరొస్తొంది, ఇమేజ్ పెరుగుతుంది. కాని.. ఫ్లాప్ సినిమాలతోనే ఒక స్టార్ లో ఉన్న లూప్ హోల్స్ మరియు వీక్నెస్ లు బయటపడతాయ్. అందుకే.. ఈ ఇద్దరూ అసలు ఈ ఫ్లాప్స్ తో ఏం నేర్చుకుని ఉంటారు అనేది ఇప్పుడు డిస్కషన్. తాము కథలను ఎంచుకోవడంలో ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నామో తెలుసుకుంటేనే వీరిద్దరూ కూడా ఎక్కవకాలం సినిమాల్లో రాణించే ఛాన్సుంటుంది. అలా కాకుండా 24 గంటలూ సంచలనాలు క్రియేట్ చేయడం, లేదంటే సోషల్ మీడియాలో అభిమానులను పెంచుకోవడం వంటి అంశాలపై ఫోకస్ చేస్తే మాత్రం.. అబ్బే కాస్త కష్టమే.
పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ని నిలబెట్టుకోవాలి.…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…
టాలీవుడ్ టాప్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలని, ఏడాదికి ఒకట్రెండు రిలీజ్లు ఉండేలా చూసుకోవాలని ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు…
ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…
రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్ను పూర్తిగా తన సొంతం…
ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ వరుసగా రెండోసారి కప్పు గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ…