దసరాకు మూడు సినిమాలు రిలీజయ్యాయి. అందులో అన్నింటికంటే పెద్ద సినిమా, ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది గాడ్ ఫాదర్ కాగా.. ది ఘోస్ట్ మంచి కంటెంట్ ఉన్న సినిమాలాగే కనిపించింది. స్వాతిముత్యం అనే చిన్న సినిమాకు రిలీజ్ ముంగిట పెద్దగా బజ్ లేకపోయినా.. దానికి మంచి టాక్ వచ్చింది. ఐతే మెగాస్టార్ సినిమా ముందు మిగతా సినిమాలు అస్సలు నిలబడలేకపోయాయి. రోజులు గడిచేకొద్దీ మొత్తం ప్రేక్షకులను తన వైపే తిప్పేసుకుంది చిరు సినిమా.
ది ఘోస్ట్కు బ్యాడ్ టాక్ రావడంతో ఆరంభం నుంచే ఆ సినిమా పడుకుండిపోగా.. స్వాతిముత్యం మంచి టాక్ను ఉపయోగించుకోలేకపోయింది. ఎంతకీ ఆ సినిమా వసూళ్లు మెరుగుపడలేదు. గాడ్ఫాదర్ మూవీకి కూడా రిలీజ్ ముంగిట మరీ బజ్ ఏమీ లేదు కానీ.. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ కలిసొచ్చింది. సగటు ప్రేక్షకులను ఆకర్షించే అన్ని అంశాలూ ఉన్న సినిమా కావడంతో దసరాకు బాక్సాఫీస్ లీడర్ అయిపోయింది.
ఫ్యామిలీ ఆడియన్స్ను పెద్ద ఎత్తున థియేటర్లకు రప్పించిన గాడ్ఫాదర్.. శని, ఆదివారాల్లో హౌస్ ఫుల్స్తో రన్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడాయి. ముఖ్యంగా వైజాగ్ సహా ఉత్తరాంధ్రలో గాడ్ఫాదర్కు మామూలు క్రేజ్ లేదు. అలాగే హైదరాబాద్లోనూ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. చిరు సినిమాకు ఉన్న డిమాండ్ చూసి ఆల్రెడీ ది ఘోస్ట్, స్వాతిముత్యం చిత్రాలకు కేటాయించిన స్క్రీన్లు, షోలను కూడా కట్ చేసి గాడ్ఫాదర్కే ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.
మొత్తంగా చూస్తే దసరా సందడంతా చిరంజీవిదే అని చెప్పాలి. ఐదు రోజుల్లో ఈ సినిమా గ్రాస్ రూ.100 కోట్లకు చేరువగా, షేర్ రూ.60 కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా. ఐతే గాడ్ఫాదర్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఫుల్ రన్లో రూ.90 కోట్ల దాకా షేర్ రాబట్టాల్సి ఉంది. ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కాబట్టి దీపావళి వీకెండ్ వరకు సినిమా జోరు కొనసాగుతుందనే ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు.
This post was last modified on October 9, 2022 10:35 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…