గత ఏడాది ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన సినిమా అనౌన్స్మెంట్ అంటే.. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ల కలయికలోనిదే. ఈ కాంబినేషన్లో సినిమాను అసలెవరూ ఊహించలేదు. ఒక తమిళ స్టార్ తెలుగు దర్శకుడితో సినిమా చేయడమే ఆశ్చర్యమంటే.. అతను కమ్ములతో మూవీని ఓకే చేయడం ఇంకా ఆశ్చర్యం.
ఐతే అనౌన్స్మెంట్ హడావుడి తర్వాత ఈ సినిమా ముందుకే కదల్లేదు. దీని తర్వాత ప్రకటించిన సార్ మూవీని ధనుష్ చకచకా పూర్తి చేసేశాడు. కొత్తగా వేరే చిత్రాలు ప్రకటిస్తున్నాడు. కానీ కమ్ముల సినిమా సంగతేంటో తెలియడం లేదు. శేఖర్ చివరి సినిమా లవ్ స్టోరీ నిరాశపరిచిన నేపథ్యంలో ఈ సినిమా నుంచి ధనుష్ వైదొలిగాడేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే అలాంటిదేమీ లేదన్నది చిత్ర వర్గాల సమాచారం.
మామూలుగానే శేఖర్ కమ్ముల సినిమాకు సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటాడు. స్క్రిప్టు కోసం చాలా సమయం వెచ్చిస్తాడు. హడావుడి పడడు. ధనుష్ సినిమా విషయంలోనూ అదే చేస్తున్నాడట. అతడి కోసం ఒక పీరియడ్ కథను కమ్ముల రెడీ చేస్తున్నట్లు సమాచారం. తమిళనాడులో స్థిరపడే ఒక తెలుగు కుర్రాడి కథ ఇదని, కొన్ని దశాబ్దాల వెనుకటి కాలంలో నడుస్తుందని.. ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులను మెప్పించేలా యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథ ఇదని చిత్ర వర్గాల సమాచారం.
పక్కాగా స్క్రిప్టు రెడీ అయ్యాక ధనుష్ డేట్లు చూసుకుని సినిమాను పట్టాలెక్కిస్తారని సమాచారం. వచ్చే ఏడాదే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించనున్నారు. ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.
This post was last modified on October 9, 2022 10:27 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…