కాంతార.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సినిమా ఇది. ‘కేజీఎఫ్’తో సంచలనం రేపిన హోంబళె ఫిలిమ్స్ నుంచి వచ్చిన మరో భారీ చిత్రమిది. దర్శకుడు రిషబ్ శెట్టి తనే ముఖ్య పాత్ర పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించాడు. కన్నడలో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా దీన్ని అందరూ కొనియాడుతున్నారు. ఈ సినిమా కథాంశం, నటీనటుల పెర్ఫామెన్స్, విజువల్స్, భారీతనం, అలాగే పతాక సన్నివేశాలకు సంబంధించి ప్రశంసల జల్లు కురుస్తోంది.
కన్నడ నాట సంచలన వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా గురించి ఇతర భాషల వాళ్లకూ బాగానే ఆసక్తి కలిగింది. హైదరాబాద్, చెన్నై, కొచ్చి, ముంబయి లాంటి ప్రధాన నగరాల్లో ‘కాంతార’కు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ఆయా నగరాల్లో అందుబాటులో ఉన్న స్క్రీన్లలో సినిమాను ప్రదర్శిస్తుండగా.. హౌస్ ఫుల్స్ పడుతున్నాయి.
‘కాంతార’ కన్నడ వెర్షన్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎగబడుతున్న తీరు చూసిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ వెంటనే రంగంలోకి దిగిపోయారు. దసరాకు మూడు సినిమాలు రిలీజైన నేపథ్యంలో తర్వాతి వారానికి తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలేవీ షెడ్యూల్ అయి లేవు. ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ లాంటి చిన్నా చితకా సినిమాలే వస్తున్నాయి. దసరా చిత్రాల్లో ‘ది ఘోస్ట్’, ‘స్వాతిముత్యం’ పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో వచ్చే వారానికి అవి చాలా థియేటర్లను ఖాళీ చేయబోతున్నాయి. ఈ అడ్వాంటేజీని అరవింద్ ఉపయోగించుకోబోతున్నారు.
‘కాంతార’ తెలుగు వెర్షన్ను వచ్చే శుక్రవారమే గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నిర్ణయం గత రెండు మూడు రోజుల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే హక్కులు తీసుకోవడం, డబ్బింగ్ పనులు మొదలుపెట్టేయడం జరిగిపోయింది. ‘కాంతార’ కన్నడ వెర్షన్కు వస్తున్న రెస్పాన్స్ చూసి, వచ్చే వారం థియేటర్లు ఖాళీగా దొరకడం గమనించి ఇంత వేగంగా స్పందించి తక్కువ వ్యవధిలో సినిమాను రెడీ చేస్తుండడం చూసి అల్లు అరవింద్ తెలివే తెలివి అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి టాలీవుడ్లో.
This post was last modified on October 9, 2022 1:34 pm
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…