ఇంకో రెండు వారాల్లో డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు రాబోతోంది. ఇటీవలే పెదనాన్న కృష్ణంరాజు కాలం చేయడంతో సంబరాలు ఉండవేమో అనుకున్నారు కానీ రీ రిలీజుల రూపంలో జరుపుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా అక్టోబర్ 15న రెబల్ ని థియేటర్లలో తీసుకొస్తున్నారు. దీని ప్రకటన రాగానే ఫ్యాన్సే షాక్ తిన్నారు. ఎందుకంటే ఇది మాములు డిజాస్టర్ కాదు. అప్పట్లో సోషల్ మీడియా 2022 స్థాయిలో లేదు కానీ ఉంటే మాత్రం దర్శకుడు రాఘవేంద్ర లారెన్స్ ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దిన విధానానికి అభిమానులు ట్రోలింగ్ తో విరుచుకుపడేవారు.
సరే గతం గతః అనుకుంటే ఆ మర్చిపోలేని గాయాన్ని ఎందుకు మళ్ళీ స్క్రీన్ మీద చూపిస్తారని అప్పుడే కామెంట్లు మొదలయ్యాయి. అయితే ఊరట కలిగించే వార్త మరొకటి ఉంది. ఇదే నెల 23, 24 తేదీల్లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ వర్షంని 4Kతో వెండితెరపై ప్రదర్శించబోతున్నారు. ఒకవేళ రెబెల్ చూసి తట్టుకోలేం అనుకుంటే హ్యాపీగా వర్షం చూసి ఎంజాయ్ చేయొచ్చన్న మాట. ఇది మాత్రం సరైన నిర్ణయమే. ఎందుకంటే 2004లో వచ్చిన ఈ మ్యూజికల్ సూపర్ హిట్ చాలా రికార్డులు సాధించింది. ప్రభాస్, త్రిషల జంటకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం చేసిన రచ్చ మాములుది కాదు.
మొత్తానికి ఈ ఒక సాడ్ ఒక హ్యాపీ మూవీతో ప్రభాస్ ఫ్యాన్స్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. గత రెండు నెలల నుంచి ఈ రీ రిలీజుల ట్రెండ్ ఊపందుకుంటోంది. పోకిరి, ఘరానా మొగుడు, తమ్ముడు, జల్సా, చెన్నకేశవరెడ్డి, 3 ఒకదాన్ని మించి మరొకటి పోటీపడి కలెక్షన్లు రాబట్టాయి. జనవరిలో ఒక్కడుని ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆల్రెడీ జులాయి, దేశముదురు కావాలని డిమాండ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆది, సింహాద్రి కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవలే అమితాబ్ నటించిన 11 పాత క్లాసిక్స్ ని పివిఆర్ మల్టీప్లెక్స్ చైన్ స్పెషల్ ప్రీమియర్ చేయడం మనల్ని చూసి తెచ్చుకున్న ఐడియానే.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…