ఇంకో రెండు వారాల్లో డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు రాబోతోంది. ఇటీవలే పెదనాన్న కృష్ణంరాజు కాలం చేయడంతో సంబరాలు ఉండవేమో అనుకున్నారు కానీ రీ రిలీజుల రూపంలో జరుపుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా అక్టోబర్ 15న రెబల్ ని థియేటర్లలో తీసుకొస్తున్నారు. దీని ప్రకటన రాగానే ఫ్యాన్సే షాక్ తిన్నారు. ఎందుకంటే ఇది మాములు డిజాస్టర్ కాదు. అప్పట్లో సోషల్ మీడియా 2022 స్థాయిలో లేదు కానీ ఉంటే మాత్రం దర్శకుడు రాఘవేంద్ర లారెన్స్ ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దిన విధానానికి అభిమానులు ట్రోలింగ్ తో విరుచుకుపడేవారు.
సరే గతం గతః అనుకుంటే ఆ మర్చిపోలేని గాయాన్ని ఎందుకు మళ్ళీ స్క్రీన్ మీద చూపిస్తారని అప్పుడే కామెంట్లు మొదలయ్యాయి. అయితే ఊరట కలిగించే వార్త మరొకటి ఉంది. ఇదే నెల 23, 24 తేదీల్లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ వర్షంని 4Kతో వెండితెరపై ప్రదర్శించబోతున్నారు. ఒకవేళ రెబెల్ చూసి తట్టుకోలేం అనుకుంటే హ్యాపీగా వర్షం చూసి ఎంజాయ్ చేయొచ్చన్న మాట. ఇది మాత్రం సరైన నిర్ణయమే. ఎందుకంటే 2004లో వచ్చిన ఈ మ్యూజికల్ సూపర్ హిట్ చాలా రికార్డులు సాధించింది. ప్రభాస్, త్రిషల జంటకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం చేసిన రచ్చ మాములుది కాదు.
మొత్తానికి ఈ ఒక సాడ్ ఒక హ్యాపీ మూవీతో ప్రభాస్ ఫ్యాన్స్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. గత రెండు నెలల నుంచి ఈ రీ రిలీజుల ట్రెండ్ ఊపందుకుంటోంది. పోకిరి, ఘరానా మొగుడు, తమ్ముడు, జల్సా, చెన్నకేశవరెడ్డి, 3 ఒకదాన్ని మించి మరొకటి పోటీపడి కలెక్షన్లు రాబట్టాయి. జనవరిలో ఒక్కడుని ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆల్రెడీ జులాయి, దేశముదురు కావాలని డిమాండ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆది, సింహాద్రి కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవలే అమితాబ్ నటించిన 11 పాత క్లాసిక్స్ ని పివిఆర్ మల్టీప్లెక్స్ చైన్ స్పెషల్ ప్రీమియర్ చేయడం మనల్ని చూసి తెచ్చుకున్న ఐడియానే.
This post was last modified on October 9, 2022 10:02 am
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…