అక్కినేని నాగార్జునకు బాక్సాఫీస్ దగ్గర మరోసారి చేదు అనుభవం తప్పేలా లేదు. ఆయన కొత్త చిత్రం ‘ది ఘోస్ట్’ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ‘గరుడవేగ’ లాంటి సెన్సేషనల్ మూవీతో అందరి దృష్టినీ ఆకర్షించిన ప్రవీణ్ సత్తారు.. ఈ చిత్రాన్ని రూపొందించడంతో ఇది మినిమం గ్యారెంటీ మూవీ అయి ఉంటుందని అనుకున్నారు. కానీ ప్రవీణ్ ప్రేక్షకులను బాగా నిరాశ పరిచాడు.
అసలే ఈ సినిమాకు విడుదల ముంగిట పెద్దగా బజ్ లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా డల్లుగా జరిగాయి. టాక్ కూడా బాగా లేకపోవడంతో వసూళ్లు మరీ తక్కువగానే వచ్చాయి తొలి రోజు. రెండో రోజు సినిమా పుంజుకుంటున్న సంకేతాలేమీ కనిపించడం లేదు. నాగ్ ఖాతాలో మరో పరాజయం జమ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా నాగ్ ఎందుకు మళ్లీ ఈ యాక్షన్ థ్రిల్లర్ జానర్ పట్టుకుని వేలాడుతున్నడనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
నాగ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసిన ప్రతిసారీ ఆయనకు చేదు అనుభవమే ఎదురవుతోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగ్ నటించిన ‘ఆఫీసర్’ ఎంత దారుణమైన ఫలితాన్నందుకుందో తెలిసిందే. ఐతే వర్మ ఫాంలో లేడు కాబట్టి ఆ సినిమా అలా తయారవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఐతే కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ నాగ్ ఇలాంటి ఆఫీసర్ రోల్ చేసిన ‘వైల్డ్ డాగ్’ మంచి టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది.
ఐతే అప్పుడు కొవిడ్ ఉంది అందుకే ఆడలేదంటూ నాగ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మరి ‘ది ఘోస్ట్’ పరిస్థితి చూస్తే ఏమాత్రం ఆశాజనకంగా లేదు. నాగ్ను ఇలాంటి రోల్స్లో చూడ్డానికి ప్రేక్షకులు అసలు ఇష్టపడట్లేదా అనిపిస్తోంది. ఈ తరహా పాత్రలతో వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నా.. ప్రేక్షకుల దృష్టిని ఏమాత్రం ఆకర్షించలేకపోతున్నా నాగ్ ఎందుకు మళ్లీ మళ్లీ అవే ట్రై చేస్తున్నాడన్నది అర్థం కావడం లేదు. మధ్యలో ఆయన ‘బంగార్రాజు’ అనే ఎంటర్టైనర్ తీస్తే టాక్ బాలేకున్నా ఓ మోస్తరుగా ఆడింది. కాబట్టి నాగ్ ఇకపై ఇలాంటి సీరియస్ కాప్ థ్రిల్లర్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది.
This post was last modified on October 6, 2022 9:43 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…