అక్కినేని నాగార్జునకు బాక్సాఫీస్ దగ్గర మరోసారి చేదు అనుభవం తప్పేలా లేదు. ఆయన కొత్త చిత్రం ‘ది ఘోస్ట్’ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ‘గరుడవేగ’ లాంటి సెన్సేషనల్ మూవీతో అందరి దృష్టినీ ఆకర్షించిన ప్రవీణ్ సత్తారు.. ఈ చిత్రాన్ని రూపొందించడంతో ఇది మినిమం గ్యారెంటీ మూవీ అయి ఉంటుందని అనుకున్నారు. కానీ ప్రవీణ్ ప్రేక్షకులను బాగా నిరాశ పరిచాడు.
అసలే ఈ సినిమాకు విడుదల ముంగిట పెద్దగా బజ్ లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా డల్లుగా జరిగాయి. టాక్ కూడా బాగా లేకపోవడంతో వసూళ్లు మరీ తక్కువగానే వచ్చాయి తొలి రోజు. రెండో రోజు సినిమా పుంజుకుంటున్న సంకేతాలేమీ కనిపించడం లేదు. నాగ్ ఖాతాలో మరో పరాజయం జమ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా నాగ్ ఎందుకు మళ్లీ ఈ యాక్షన్ థ్రిల్లర్ జానర్ పట్టుకుని వేలాడుతున్నడనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
నాగ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసిన ప్రతిసారీ ఆయనకు చేదు అనుభవమే ఎదురవుతోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగ్ నటించిన ‘ఆఫీసర్’ ఎంత దారుణమైన ఫలితాన్నందుకుందో తెలిసిందే. ఐతే వర్మ ఫాంలో లేడు కాబట్టి ఆ సినిమా అలా తయారవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఐతే కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ నాగ్ ఇలాంటి ఆఫీసర్ రోల్ చేసిన ‘వైల్డ్ డాగ్’ మంచి టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది.
ఐతే అప్పుడు కొవిడ్ ఉంది అందుకే ఆడలేదంటూ నాగ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మరి ‘ది ఘోస్ట్’ పరిస్థితి చూస్తే ఏమాత్రం ఆశాజనకంగా లేదు. నాగ్ను ఇలాంటి రోల్స్లో చూడ్డానికి ప్రేక్షకులు అసలు ఇష్టపడట్లేదా అనిపిస్తోంది. ఈ తరహా పాత్రలతో వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నా.. ప్రేక్షకుల దృష్టిని ఏమాత్రం ఆకర్షించలేకపోతున్నా నాగ్ ఎందుకు మళ్లీ మళ్లీ అవే ట్రై చేస్తున్నాడన్నది అర్థం కావడం లేదు. మధ్యలో ఆయన ‘బంగార్రాజు’ అనే ఎంటర్టైనర్ తీస్తే టాక్ బాలేకున్నా ఓ మోస్తరుగా ఆడింది. కాబట్టి నాగ్ ఇకపై ఇలాంటి సీరియస్ కాప్ థ్రిల్లర్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది.
This post was last modified on October 6, 2022 9:43 pm
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వరుసగా తమిళ నటులు, టెక్నీషియన్లతో పని చేస్తున్నాడు. గత ఏడాది ధనుష్తో కలిసి…
అక్కడెక్కడో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాలు యుద్దం చేసుకుంటే.. వారికి వేలాది కిలోమీటర్ల ఇవతల ఉన్న బెంగళూరులోని టిఫిన్ సెంటర్లు..…
నిర్మాత కోన వెంకట్ బ్యాండ్ మేళంని చాలా సీరియస్ గా తీసుకున్న వైనం ప్రమోషన్లలో కనిపిస్తోంది. కోర్ట్ జంట హర్ష్…