తమిళంలోనే కాదు తెలుగులోనూ మోస్ట్ వాంటెడ్ బిజీ ఆర్టిస్టుల్లో ఒకరైన సముతిరఖని నటుడిగా కెరీర్ ఊపందుకోక ముందే మంచి దర్శకుడన్న సంగతి మాస్ ఆడియన్స్ కి అంతగా అవగాహన లేదు కానీ సగటు మూవీ లవర్స్ కి బాగా తెలుసు. కాకపోతే తెలుగులో తీయలేదు అంతే. నిన్న రిలీజైన గాడ్ ఫాదర్ లో ఈయన పోలీస్ ఇన్స్ పెక్టర్ గా చేసిన క్యారెక్టర్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఎక్కువ లెన్త్ లేకపోయినా కీలకమైన సన్నివేశాలు పడటంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం దాకా వేచి చూసిన సముతిరఖని బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ రాగానే గాడ్ ఫాదర్ పోస్టర్లు, ఫోటోలతో ట్వీట్లు వేస్తున్నారు.
ఇక్కడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి వేడుకోలు కార్యక్రమం మొదలుపెట్టారు. దేనికంటారా. సముతిరఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తో వినోదయ సితం రీమేక్ గురించి గత ఆరేడు నెలల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనలో వేగంగా పూర్తి చేయబోతున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. సాయి ధరమ్ తేజ్ ఓ ముఖ్యపాత్రలో చాలా తక్కువ బడ్జెట్ తో తీస్తారని చెప్పుకున్నారు. కొంత కాలం ఈ ప్రాజెక్టు గురించి టాక్స్ ఆగిపోయాయి. ఇప్పుడు పాదయాత్ర వాయిదా పడి పవన్ తిరిగి షూటింగ్స్ లో పాల్గొనడానికి నిర్ణయం తీసుకోవడంతో వినోదయ సితం మళ్ళీ తెరపైకొచ్చింది.
ఒరిజినల్ వెర్షనే డైరెక్ట్ ఓటిటిలో వచ్చింది. అలాంటి కథని వంద కోట్ల మార్కెట్ ఉన్న పవన్ తో చేయడం గురించి ఇప్పటికే పవర్ స్టార్ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లో అంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాయి. అలాంటిది గోపాల గోపాల తరహా థీమ్ తో రూపొందే వినోదయ సితం ఏదో అద్భుతం చేసే అవకాశం ఉందని వాళ్ళనుకోవడం లేదు. ఏదో చిరంజీవితో హిట్టు బొమ్మ చేశానని ఆనందపడుతున్న టైంలో సముతిరఖని ఊహించని విధంగా ఈ విన్నపాలు వెల్లువ చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదుట.
This post was last modified on October 6, 2022 12:34 pm
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…