తమిళంలోనే కాదు తెలుగులోనూ మోస్ట్ వాంటెడ్ బిజీ ఆర్టిస్టుల్లో ఒకరైన సముతిరఖని నటుడిగా కెరీర్ ఊపందుకోక ముందే మంచి దర్శకుడన్న సంగతి మాస్ ఆడియన్స్ కి అంతగా అవగాహన లేదు కానీ సగటు మూవీ లవర్స్ కి బాగా తెలుసు. కాకపోతే తెలుగులో తీయలేదు అంతే. నిన్న రిలీజైన గాడ్ ఫాదర్ లో ఈయన పోలీస్ ఇన్స్ పెక్టర్ గా చేసిన క్యారెక్టర్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఎక్కువ లెన్త్ లేకపోయినా కీలకమైన సన్నివేశాలు పడటంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం దాకా వేచి చూసిన సముతిరఖని బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ రాగానే గాడ్ ఫాదర్ పోస్టర్లు, ఫోటోలతో ట్వీట్లు వేస్తున్నారు.
ఇక్కడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి వేడుకోలు కార్యక్రమం మొదలుపెట్టారు. దేనికంటారా. సముతిరఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తో వినోదయ సితం రీమేక్ గురించి గత ఆరేడు నెలల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనలో వేగంగా పూర్తి చేయబోతున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. సాయి ధరమ్ తేజ్ ఓ ముఖ్యపాత్రలో చాలా తక్కువ బడ్జెట్ తో తీస్తారని చెప్పుకున్నారు. కొంత కాలం ఈ ప్రాజెక్టు గురించి టాక్స్ ఆగిపోయాయి. ఇప్పుడు పాదయాత్ర వాయిదా పడి పవన్ తిరిగి షూటింగ్స్ లో పాల్గొనడానికి నిర్ణయం తీసుకోవడంతో వినోదయ సితం మళ్ళీ తెరపైకొచ్చింది.
ఒరిజినల్ వెర్షనే డైరెక్ట్ ఓటిటిలో వచ్చింది. అలాంటి కథని వంద కోట్ల మార్కెట్ ఉన్న పవన్ తో చేయడం గురించి ఇప్పటికే పవర్ స్టార్ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లో అంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాయి. అలాంటిది గోపాల గోపాల తరహా థీమ్ తో రూపొందే వినోదయ సితం ఏదో అద్భుతం చేసే అవకాశం ఉందని వాళ్ళనుకోవడం లేదు. ఏదో చిరంజీవితో హిట్టు బొమ్మ చేశానని ఆనందపడుతున్న టైంలో సముతిరఖని ఊహించని విధంగా ఈ విన్నపాలు వెల్లువ చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదుట.
This post was last modified on October 6, 2022 12:34 pm
తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.…
ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు కొన్ని బాగానే వర్కౌట్ చేసుకున్న నేపథ్యంలో బాక్ అరణ్మనై 4 మీద కాస్తో కూస్తో…
తమిళ నటే అయినప్పటికీ తెలుగులోనూ పలు బ్లాక్ బస్టర్లలో పాలు పంచుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు మంచి ఫాలోయింగ్…
ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి…
భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అబ్ కీ బార్ .. చార్ సౌ పార్ నినాదంతో దేశంలో ఎన్నికల…
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…