Movie News

సుశాంత్ ఆత్మహత్య.. ఈ నటుడి వేదన వినండి

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారంతో బాలీవుడ్లో నెపోటిజం గురించి పెద్ద చర్చే నడిచింది. నడుస్తోంది. బాలీవుడ్ బడా ఫ్యామిలీలకు చెందిన వాళ్లు.. సొంత టాలెంట్‌తో కష్టపడి ఎదిగిన వాళ్లను తొక్కే ప్రయత్నం చేస్తుంటారని.. వాళ్లను చేరదీయరని.. చిన్నచూపు చూస్తారని పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు అనేక ఉదాహరణలు కూడా చూపిస్తూ వారిపై విరుచుకుపడుతున్నారు జనాలు.

కొందరు సెలబ్రెటీలు ఈ విషయంలో ధైర్యంగా తమ గళం వినిపించారు కూడా. ఐతే కేవలం నెపోటిజం గురించి మాట్లాడటం వల్ల లాభం లేదని.. పరిశ్రమలో మరెన్నో అన్యాయాలు జరుగుతుంటాయని అంటున్నాడు యువ నటుడు జీషన్ అయూబ్.

నో వన్ కిల్డ్ జెస్సికా, రాన్‌జానా, తను వెడ్స్ మను రిటర్న్స్, ఆర్టికల్ 15 లాంటి సినిమాలతో గుర్తింపు సంపాదించిన జీషన్.. సినీ పరిశ్రమలో నటీనటులు, టెక్నీషియన్లకు ముందు చెప్పేది ఒకటి, కానీ తర్వాత జరిగేది ఒకటి అని.. దీని గురించి ఎవరూ మాట్లాడరని అన్నాడు. ముందు మన పాత్ర గురించి ఆహా ఓహో అని చెబుతారని.. కానీ మధ్యలో స్క్రిప్టు మారిపోతుందని.. కానీ దాని గురించి ఏ సమాచారం ఇవ్వకుండా పాత్రను కుదించేస్తారని.. దాని గురించి తర్వాత మాట్లాడనే మాట్లాడరని అతనన్నాడు.

అలాగే పోస్టర్లో మన బొమ్మ కూడా ఉంటుందని ముందు చెబుతారని, ప్రమోషన్లలో ప్రాధాన్యం కల్పిస్తారని అంటారని.. తీరా చూస్తే ఎక్కడా మన పేరు, బొమ్మ ఉండదని.. అలాగే లీడ్ క్యారెక్టర్లలో ఒకటని చెప్పి సినిమాకు ఒప్పిస్తారని.. కానీ తర్వాత సైడ్ క్యారెక్టర్‌ని చేసి పడేస్తారని.. ఈ అబద్ధాలు, అన్యాయాల గురించి ఎవరూ మాట్లాడరని.. సినీ పరిశ్రమలో నెపోటిజంకు మించి, లోతైన సమస్య ఇదని.. దీని గురించి చర్చ జరగాలని అతను అభిప్రాయపడ్డాడు.

This post was last modified on July 8, 2020 4:30 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

1 hour ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

2 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago