మొన్ననే కదా మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్.. తాను వెబ్ సిరీస్ల్లో నటించబోనని, అవి చేస్తే సినిమా అవకాశాలు లేవనుకుంటారని, తన లాంటి యువ కథానాయకులకు వెబ్ సిరీస్లు నష్టమే చేస్తాయని అన్నది.. అంతలోనే వెబ్ సిరీస్ ఒప్పుకోవడం ఏంటి అని ఆశ్చర్యం కలుగుతోందా? ఐతే ఇప్పుడు వెబ్ సిరీస్ చేయబోతోంది చిరు చిన్న అల్లుడు కాదు. పెద్ద అల్లుడు.
చిరు పెద్ద కూతురు సుస్మితతో కలిసి ఆమె భర్త విష్ణు ప్రసాద్ ఓ వెబ్ సిరీస్ నిర్మించడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. వీళ్లిద్దరూ కలిసి ఓ వెబ్ ిసిరీస్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు ఈ మధ్యే వార్తలొచ్చాయి. దాన్ని నిజం చేస్తూ కొత్తగా బేనర్ కూడా మొదలుపెట్టారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే కొత్త బేనర్ మీద ఈ జంట ఓ వెబ్ సిరీస్ను నిర్మించనుంది. కొన్ని నెలల పాటు ప్రి ప్రొడక్షన్ పనులు చేశాక ఆ వెబ్ సిరీస్ను పట్టాలెక్కిస్తున్నారు.
‘ఓయ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత కనిపించకుండా పోయిన ఆనంద్ రంగా.. చిరు కూతురు, అల్లుడు నిర్మించబోయే వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించనున్నాడు. ఇంకా ఈ సిరీస్కు పని చేసే నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు వెల్లడించలేదు. స్క్రిప్టు రెడీ అయిందని.. కరోనా ప్రభావం కొంచెం తగ్గాక షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. పరిమిత బడ్జెట్లో కాన్సెప్ట్ బేస్డ్ వెబ్ సిరీస్గా దీన్ని తీర్చిదిద్దబోతున్నారట.
విష్ణు ప్రసాద్ వ్యాపారవేత్త కాగా.. సుస్మిత సినిమాల్లోనే కొనసాగుతోంది. ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన ఆమె.. కాస్ట్యూమ్ డిజైనర్గా మారింది. చిరంజీవి రీఎంట్రీ తర్వాత ప్రతి సినిమాకూ ఆమే కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేస్తోంది. చిరు కొత్త సినిమా ‘ఆచార్య’కూ సుస్మితనే కాస్ట్యూమ్స్ సమకూరుస్తోంది. తమ తొలి వెబ్ సిరీస్ వ్యవహారాలన్నీ సుస్మితనే చూసుకోబోతున్నట్లు సమాచారం.
This post was last modified on July 8, 2020 4:27 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…