ఈ దసరాకు మూడు తెలుగు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో ట్రైలర్తో బాగా ఆకట్టుకున్నది, ఎక్కువ ప్రామిసింగ్గా కనిపిస్తున్న సినిమా ఏది అంటే.. ది ఘోస్ట్ అనే చెప్పాలి. అక్కినేని నాగార్జున హీరోగా గరుడ వేగ దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందించిన ఈ చిత్రం మొదట్నుంచి కొంచెం కొత్తగా ఉన్న, ఆసక్తికరమైన ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ బడ్జెట్, బిజినెస్.. అన్ని రకాలుగా దీంతో పోలిస్తే పెద్ద సినిమానే అయినప్పటికీ.. అది రీమేక్ కావడం, దాని ప్రోమోలు మామూలుగా అనిపించడంతో అనుకున్నంత హైప్ రాలేదు.
కంటెంట్ పరంగా చూస్తే కచ్చితంగా ది ఘోస్ట్యే పైచేయి సాధిస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. మరో దసరా సినిమా స్వాతిముత్యంకు పెద్దగా బజ్ అయితే కనిపించడం లేదు. ఐతే ది ఘోస్ట్ ప్రోమోలు ఎంత ఆసక్తికరంగా అనిపిస్తున్నా, దాని పట్ల ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉన్నా.. అది ప్రి రిలీజ్ బుకింగ్స్ విషయంలో ప్రతిఫలించట్లేదు.
దసరా సినిమాలకు ఆల్రెడీ బుకింగ్స్ మొదలయ్యాయి. పండుగ బుధవారం కావడంతో వీకెండ్ దాకా ఆగకుండా ఆ రోజే సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లే బుకింగ్స్ కూడా ముందుగానే మొదలయ్యాయి. మూడు చిత్రాలకూ ఆశించిన స్థాయిలో అయితే బుకింగ్స్ జరగట్లేదు. ఉన్నంతలో చిరు సినిమా పరిస్థితే మెరుగ్గా ఉంది. ఒకప్పుడైతే ఆయన సినిమాలకు ఇలా టికెట్లు పెడితే అలా అయిపోయేవి. కానీ ఆచార్య నుంచి పరిస్థితి మారి.. గాడ్ ఫాదర్కు కూడా ఓ మోస్తరుగానే బుకింగ్స్ జరుగుతున్నాయి.
దాంతో పోలిస్తే ది ఘోస్ట్ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ఎక్కడా ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్ అన్నదే కనిపించడం లేదు. మేజర్ షోలకు 20 శాతానికి మించి బుకింగ్స్ అయిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ సినిమా వెంటనే చూసేయాలన్న ఉత్సాహం అయితే జనాల్లో లేనట్లే కనిపిస్తోంది. టాక్ వచ్చాక చూసుకుందాం అనుకుంటున్నట్లున్నారు. కాబట్టి సినిమాకు పాజిటివ్ టాక్ రావడం చాలా ముఖ్యం. అది వచ్చిందంటే వీకెండ్కు సినిమా బాగా పుంజుకుంటుందేమో.
This post was last modified on October 3, 2022 10:51 pm
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వరుసగా తమిళ నటులు, టెక్నీషియన్లతో పని చేస్తున్నాడు. గత ఏడాది ధనుష్తో కలిసి…
అక్కడెక్కడో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాలు యుద్దం చేసుకుంటే.. వారికి వేలాది కిలోమీటర్ల ఇవతల ఉన్న బెంగళూరులోని టిఫిన్ సెంటర్లు..…
నిర్మాత కోన వెంకట్ బ్యాండ్ మేళంని చాలా సీరియస్ గా తీసుకున్న వైనం ప్రమోషన్లలో కనిపిస్తోంది. కోర్ట్ జంట హర్ష్…